పోలీసు పరిశీలకుడికి స్వాగతం
జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పోలీసు పరిశీలకుడు రాజేశ్ మీనా ఆదివారం కామారెడ్డికి చేరుకున్నారు.
పోలీసు పరిశీలకుడు రాజేశ్ మీనాకు మొక్క అందజేస్తున్న ఎస్పీ సింధూశర్మ
కామారెడ్డి నేరవిభాగం, న్యూస్టుడే: జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పోలీసు పరిశీలకుడు రాజేశ్ మీనా ఆదివారం కామారెడ్డికి చేరుకున్నారు. ఎస్పీ సింధూశర్మ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను ఆయనకు వివరించారు. ఓటర్లను ప్రలోభపరిచే చర్యలను నిరోధించేందుకు జిల్లా సరిహద్దుల్లో రెండు అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రాలను, అంతర్ జిల్లా చెక్పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలను ముమ్మరం చేశామన్నారు. పొరుగు రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నామని, ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు, ర్యాలీలను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. ఇప్పటివరకు పాత నేరస్థులు, రౌడీషీట్ కలిగి ఉన్న 493 మందిని బైండోవర్ చేయడంతో పాటు లైసెన్సులు కలిగి ఉన్న వ్యక్తుల నుంచి 19 ఆయుధాలను డిపాజిట్ చేయించామన్నారు. పోలీసు పరిశీలకుడిని కలిసిన వారిలో ఏఎస్పీ నర్సింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వర్రావు, పట్టణ సీఐ చంద్రశేఖర్రెడ్డి, గ్రామీణ సీఐ రామన్ తదితరులు ఉన్నారు.
పాలనాధికారి సైతం.. : కామారెడ్డి కలెక్టరేట్: జిల్లాకేంద్రానికి వచ్చిన జహీరాబాద్ లోక్సభ పోలీస్ పరిశీలకుడు రాజేశ్ మీనాకు జిల్లా ఎన్నికల అధికారి జితేశ్ వి పాటిల్ ఆదివారం స్వాగతం పలికారు. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రాలు, వాహనాల తనిఖీలు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాల పనితీరును ఆయన వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థులు... విజ్ఞాన దీపికలు
[ 15-05-2024]
గిరిరాజ్ కళాశాల విద్యార్థులు పరిశోధనల్లో రాణిస్తున్నారు. ఇందూరు సాహిత్యం, చారిత్రక, పర్యాటక, ప్రజా సంక్షేమం విషయాల సేకరణ, క్షేత్ర పర్యటనలు వంటి అంశాల్లో రాణిస్తూ అబ్బురపరుస్తున్నారు. -
చివరి ఆయకట్టుకు నీరందించండి
[ 15-05-2024]
జిల్లాలోని ముఖ్యమైన ప్రాజెక్టుల్లో రామడుగు ఒకటి. ఈ ప్రాజెక్టు ఆయకట్టు ద్వారా ధర్పల్లి, డిచ్పల్లి, జక్రాన్పల్లి, భీంగల్, వేల్పూర్ మండలాల్లోని గ్రామాలకు రెండు పంటల నీరందిస్తున్నారు. -
ఈ గ్రామాలు ఆదర్శం
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కొన్ని గ్రామాలు ఆదర్శంగా నిలిచాయి. ఎన్నికల కమిషన్ ఎన్ని స్వీప్ కార్యక్రమాలు నిర్వహించినా కొన్ని గ్రామాల్లో సరాసరిగా 75 శాతం కంటే అధికంగా పోలింగ్ నమోదు కాలేదు -
ఆలోచన అదిరే!
[ 15-05-2024]
ఎండలు మండుతున్న తరుణంలో ద్విచక్రవాహనాలపై ప్రయాణమంటే భయపడాల్సిన పరిస్థితి. దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించాడు పెద్దకొడప్గల్ మండలం వడ్లం గ్రామానికి చెందిన యువకుడు బోగేష్. ఈయన హైదరాబాద్లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తాడు. -
పైకి గాంభీర్యం.. లోలోన లెక్కలు
[ 15-05-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానంలో విజయంపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్ ముగిసి ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉండగా.. గెలుపుపై ఎవరికి వారు తమకు అనుకూలంగా చెప్పుకొంటున్నారు. -
ప్రవేశాల పెంపునకు కసరత్తు
[ 15-05-2024]
గురుకులాలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల్ని కళాశాలలుగా ఆప్గ్రేడ్ చేయడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులు మొగ్గు చూపడం లేదని అధ్యాపకులు పేర్కొంటున్నారు. -
నేడు విచారణ
[ 15-05-2024]
కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి లక్ష్మణ్సింగ్ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. -
ఆలస్యంగా కొనుగోళ్లు
[ 15-05-2024]
తల్లి బిడ్డలను కంటికి రెప్పలాగా ఎలా దాచుకుంటుందో.. అన్నదాతలు సైతం ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కాపాడుకొని నానా అవస్థలు పడి కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే లారీలు రాక వర్షానికి తడిసి ఎండిపోతుంటే పట్టించుకునే నాథుడే కరవయ్యారు. -
పెరిగిన ఓటింగ్తో ఉత్కంఠ
[ 15-05-2024]
హోరాహోరీగా సాగిన సార్వత్రిక సమరం ముగిసింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 69.67 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ సారి 74.63 నమోదైంది. సుమారు ఐదుశాతం మేర పోలింగ్ పెరిగింది -
ఆమె కదిలింది
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లోనూ అసెంబ్లీ పోలింగ్ మాదిరిగానే ఓటర్లు పోటెత్తారు. నవంబరులో శాసనసభకు నిర్వహించిన ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు స్థానాల్లో 12,39,568 ఓట్లు పోలయ్యాయి -
‘1.30 లక్షల మెజారిటీతో గెలుస్తాం’
[ 15-05-2024]
నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ విజయం తథ్యమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. -
ఉద్యోగిపై ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు
[ 15-05-2024]
విద్యుత్తు శాఖలో పనిచేసే ఉద్యోగి ఒక పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారనే విషయం ఆ శాఖలో గుప్పుమంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేను బెంగళూరుపై ఆడుంటే.. ఈ పాటికే ప్లేఆఫ్స్కు చేరేవాళ్లమేమో!: పంత్
-
బహిరంగ క్షమాపణలు కోరిన మెహరీన్.. ఎందుకంటే!
-
కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృవియోగం
-
ఎఫ్డీ రేట్లు పెంచిన ఎస్బీఐ.. లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే..
-
తిరుమలలో మరోసారి చిరుత కలకలం
-
హెడ్ కోచ్గా కొనసాగమని కోరినా.. తిరస్కరించిన ద్రవిడ్