పోలీసు పరిశీలకుడికి స్వాగతం
జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పోలీసు పరిశీలకుడు రాజేశ్ మీనా ఆదివారం కామారెడ్డికి చేరుకున్నారు.
పోలీసు పరిశీలకుడు రాజేశ్ మీనాకు మొక్క అందజేస్తున్న ఎస్పీ సింధూశర్మ
కామారెడ్డి నేరవిభాగం, న్యూస్టుడే: జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పోలీసు పరిశీలకుడు రాజేశ్ మీనా ఆదివారం కామారెడ్డికి చేరుకున్నారు. ఎస్పీ సింధూశర్మ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను ఆయనకు వివరించారు. ఓటర్లను ప్రలోభపరిచే చర్యలను నిరోధించేందుకు జిల్లా సరిహద్దుల్లో రెండు అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రాలను, అంతర్ జిల్లా చెక్పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలను ముమ్మరం చేశామన్నారు. పొరుగు రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నామని, ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు, ర్యాలీలను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. ఇప్పటివరకు పాత నేరస్థులు, రౌడీషీట్ కలిగి ఉన్న 493 మందిని బైండోవర్ చేయడంతో పాటు లైసెన్సులు కలిగి ఉన్న వ్యక్తుల నుంచి 19 ఆయుధాలను డిపాజిట్ చేయించామన్నారు. పోలీసు పరిశీలకుడిని కలిసిన వారిలో ఏఎస్పీ నర్సింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వర్రావు, పట్టణ సీఐ చంద్రశేఖర్రెడ్డి, గ్రామీణ సీఐ రామన్ తదితరులు ఉన్నారు.
పాలనాధికారి సైతం.. : కామారెడ్డి కలెక్టరేట్: జిల్లాకేంద్రానికి వచ్చిన జహీరాబాద్ లోక్సభ పోలీస్ పరిశీలకుడు రాజేశ్ మీనాకు జిల్లా ఎన్నికల అధికారి జితేశ్ వి పాటిల్ ఆదివారం స్వాగతం పలికారు. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రాలు, వాహనాల తనిఖీలు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాల పనితీరును ఆయన వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్సాహంగా.. ఉల్లాసంగా..
[ 19-05-2024]
వేసవి సెలవుల్లో క్రీడా శిబిరాల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. జిల్లాలో నిర్వహించే అన్ని శిబిరాల్లో క్రీడాకారులు కిక్కిరిసిపోతున్నారు. -
ప్లాస్టిక్ నిషేధంపై తనిఖీలేవి
[ 19-05-2024]
పర్యావరణానికి పెను ప్రమాదంగా మారిన ప్లాస్టిక్ కవర్లు, వస్తువుల విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారి వాడి పడేసే(సింగిల్ యూజ్డ్) ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించింది. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
[ 19-05-2024]
విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన ఘటన శనివారం పిట్లం మండలం గౌరారం తండాలో చోటుచేసుకుంది. -
మొక్కల పెంపకానికి విత్తనాల సేకరణ
[ 19-05-2024]
అడవుల్లో పచ్చదనం పెంచేందుకు అటవీశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్థానికంగా నర్సరీల్లో మొక్కలు పెంచేందుకు ప్రణాళిక రూపొందించారు. -
‘రైతులను మోసగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం’
[ 19-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతినని చెప్పుకొంటూ వారిని మోసం చేస్తోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. -
పాఠ్యపుస్తకాలు వస్తున్నాయ్
[ 19-05-2024]
బడులు తెరిచే నాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేందుకు రాష్ట్ర విద్యాశాఖ జిల్లా కేంద్రాలకు పంపిణీ ప్రక్రియ ప్రారంభించింది. కొన్ని నెలల కిత్రమే ముద్రణ ప్రారంభించగా ప్రస్తుతం జిల్లా కేంద్రాలకు చేరుస్తున్నారు. -
గ్రూప్-1 నిర్వహణకు 12 పరీక్ష కేంద్రాలు
[ 19-05-2024]
జిల్లాలో గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు 12 కేంద్రాలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. -
ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం.. సాగుకు సన్నద్ధం
[ 19-05-2024]
వానాకాలం సాగు ప్రణాళికలను వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. గడిచిన వానాకాలం చీడపీడలు, తెగుళ్లతో పంట దిగుబడులు రాక కర్షకులకు నష్టాలే మిగిలాయి. -
లక్ష్యం శతశాతం
[ 19-05-2024]
జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, అనుబంధ విద్యాలయాల్లో ఇంటర్ ప్రవేశాలు పెంచేందుకు యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది.