logo

పోలీసుల అదుపులో నిందితులు..!

భిక్కనూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిషేధిత మత్తు పదార్థాలు తరలిస్తున్న నలుగురు నిందితులను ప్రత్యేక పోలీసు బృందం శనివారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Published : 05 May 2024 06:04 IST

భిక్కనూరు : భిక్కనూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిషేధిత మత్తు పదార్థాలు తరలిస్తున్న నలుగురు నిందితులను ప్రత్యేక పోలీసు బృందం శనివారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పెద్దమల్లారెడ్డి గ్రామం పెట్రోల్‌ బంక్‌ వద్ద ప్రత్యేక పోలీసు బృందం మాటువేసి మరీ ఓ కారును స్వాధీనం చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. అందులో ప్రయాణిస్తున్న వారి వద్ద మత్తు పదార్థాలున్నట్లు తెలిసింది. పక్కా సమాచారంతో రెండు రోజులుగా రెక్కీ నిర్వహించి నిందితులను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పూర్తి వివరాలను ఆదివారం పోలీసులు వెల్లడించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని