ఉపకేంద్రాల్లో సౌర యూనిట్లు
పీఎం కుసుమ్ పథకం కింద జిల్లాలో సౌర యూనిట్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.
జిల్లాలో ఎనిమిది ఎంపిక
రాజంపేట వద్ద ఏర్పాటు చేసిన సౌర పలకలు
కామారెడ్డి కలెక్టరేట్, న్యూస్టుడే: పీఎం కుసుమ్ పథకం కింద జిల్లాలో సౌర యూనిట్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం విద్యుత్తు ఉపకేంద్రాల్లో వాటిని నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. స్థలం అనుకూలంగా ఉన్న ఉపకేంద్రాల్లో ఈ ప్రక్రియ ద్వారా సౌరవిద్యుత్తు తయారు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇందుకోసం జిల్లాలో 8 కేంద్రాలను ఎంపిక చేశారు. ఈ పనులను వరంగల్కు చెందిన ఓ గుత్తేదారు సంస్థకు అప్పగించారు. వారు త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు. దీంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఇళ్లపై సౌర యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం రాయితీ కల్పిస్తోంది.
కోటాను మించి సరఫరా..
జిల్లాలో అన్ని రకాల విద్యుత్తు కనెక్షన్లు సుమారు 4 లక్షలున్నాయి. ఇందులో 1.05 లక్షల వరకు బోరు మోటార్లు, 2.65 లక్షలు గృహావసర కనెక్షన్లు, మిగితావి వాణిజ్య, పరిశ్రమలు, వీధి దీపాలకు సంబంధించినవి ఉన్నాయి. జిల్లాలో విద్యుత్తుకు చాలా డిమాండ్ ఉంది. నీటి వనరులు లేక రైతులు ఎక్కువగా బోరు బావులపై ఆధారపడుతున్నారు. ప్రతి నెల కేటాయించిన కోటా కంటే ఎక్కువ విద్యుత్తు వాడకం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. ఒక్కో ప్లాంటుకు రూ.4.25 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇలా ఏర్పాటు చేసిన యూనిట్ ద్వారా స్థలాన్ని బట్టి 1 మెగావాట్ లేదా 0.50 మె.వా, 0.75 మె.వాల విద్యుత్తు ఉత్పత్తి చేసేలా లక్ష్యం పెట్టుకున్నారు.
గ్రిడ్కు విక్రయించేలా..
స్థానిక ఉప కేంద్రాల్లో ఏర్పాటు చేసే సౌర యూనిట్ల నిర్వహణను మహిళా సంఘాలకు ఇవ్వాలని సర్కార్ ఆలోచిస్తోంది. ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్తును గ్రిడ్కు అనుసంధానం చేసి వ్యవసాయ అవసరాలు తీర్చాలని అధికారులు భావిస్తున్నారు.
త్వరలో పనులు ప్రారంభం
రమేశ్బాబు, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్, కామారెడ్డి
సౌర యూనిట్లు నెలకొల్పేందుకు అనువుగా ఉన్న ఉపకేంద్రాలు ఎంపిక చేశాం. గుత్తేదారులు రాగానే పనులు ప్రారంభమవుతాయి. ఈ ప్రాజెక్ట్తో విద్యుత్తు సరఫరా మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తల్లిదండ్రులూ.. తస్మాత్ జాగ్రత్త
[ 20-05-2024]
ముద్దులొలికే పాపే ఆ తల్లిదండ్రులకు పంచప్రాణాలు..కొడుకున్నా.. కూతురిపైనే మక్కువ ఎక్కువ..చిట్టితల్లికి చిన్న గాయమైనా తట్టుకోలేని హృదయాలు వారివి. అప్పటి వరకు సరదాగా గడిపిన చిన్నారిని మృత్యువు మింగేసింది. -
సజ్జ రైతు సంబరం
[ 20-05-2024]
ఎర్రజొన్నల మాదిరిగానే ఒప్పందంపై సేద్యం చేస్తున్న సజ్జ పంట ఈసారి అన్నదాతల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని అధిక దిగుబడి రావడం, ధర అమాంతం రూ.2 వేలు పెరగడంతో సాగుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రూ.వేయి కోట్ల కొనుగోళ్లు
[ 20-05-2024]
దేశంలో పసుపు కొనుగోళ్లలో ప్రత్యేక స్థానం ఉన్న నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈసారి సుమారు రూ. వేయి కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి. జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గినప్పటికీ కొనుగోళ్లలో వృద్ధి కనిపించింది. -
‘గెలుపు మనదే’
[ 20-05-2024]
జహీరాబాద్ పార్లమెంటు స్థానంలో గెలుపు మనదేనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. సదాశివనగర్ మండల కాంగ్రెస్ నాయకులతో ఆదివారం ఆయన పోలింగ్ సరళి, గ్రామాల వారీగా కాంగ్రెస్కు పడిన ఓట్ల వివరాలపై ఆరా తీశారు. -
టీఎస్ కాస్తా టీజీగా..
[ 20-05-2024]
తెలంగాణ సంక్షిప్త రూపం ఇది వరకు టీఎస్గా ఉండేది. అది కాస్తా టీజీగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి నివేదికలు, ప్రభుత్వ ఉత్తర్వులు, లెటర్ హెడ్లపై టీఎస్కి బదులు టీజీగా పేర్కొనాలని వెల్లడించింది. -
పర్యాటకంగా మారిస్తే.. ప్రయోజనాలెన్నో!
[ 20-05-2024]
నిజామాబాద్ గ్రామీణ మండలం మల్కాపూర్ గ్రామ శివారులోని స్వయంగా వెలసిన అనంత పద్మనాభ స్వామి ఆలయానికి గుర్తింపు లభించడం లేదు. చెరువు గట్టున పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం ఇది. -
ఆదర్శ కళాశాలల్లో ప్రవేశాలకు వేళాయె
[ 20-05-2024]
తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. పదో తరగతి ఉత్తీర్ణులైనవారిలో అత్యధికులు ఇంటర్మీడియెట్ వైపు దృష్టి సారిస్తారు. అలాంటి వారికి ఆదర్శ జూనియర్ కళాశాలలు వరమనే చెప్పాలి. -
చూసి కొనాలి.. రసీదు పొందాలి
[ 20-05-2024]
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ముందస్తుగానే వానలు వచ్చే అవకాశం ఉండటంతో రైతులు నాణ్యమైన విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
పల్లె పోరుకు సన్నాహాలు
[ 20-05-2024]
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడుతోంది. సర్పంచుల పదవీకాలం జనవరి 31వ తేదీతో ముగిసింది.