ప్రతిష్ఠాత్మకం.. సార్వత్రికం
పార్టీ అభ్యర్థి గెలుపుకోసం వ్యూహాలు రచిస్తూనే సొంత నియోజకవర్గంలో మెజార్టీ సాధించడం జహీరాబాద్ లోక్సభ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది.
పట్టు నిలుపుకొనేందుకు శ్రమిస్తున్న ఎమ్మెల్యేలు
ఈనాడు, కామారెడ్డి: పార్టీ అభ్యర్థి గెలుపుకోసం వ్యూహాలు రచిస్తూనే సొంత నియోజకవర్గంలో మెజార్టీ సాధించడం జహీరాబాద్ లోక్సభ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. కాంగ్రెస్కు చెందిన నలుగురు, భారాసకు చెందిన ఇద్దరితో పాటు భాజపాకు చెందిన ఎమ్మెల్యే తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేలా ముందుకెళ్తున్నారు.
ఎవరికివారే ప్రత్యేక వ్యూహాలు
- ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లోక్సభ ఎన్నికలను రెఫరెండంగా ప్రకటించి సొంత నియోజకవర్గాల్లో మెజారిటీ తెప్పించే బాధ్యతలను ఎమ్మెల్యేలపైనే మోపారు. కాంగ్రెస్కు చెందిన ఎల్లారెడ్డి, జుక్కల్, అందోల్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు అంతా తామై వ్యవహరిస్తున్నారు. గ్రామాల వారీగా పార్టీల బలాబలాలను సమీక్షిస్తూ వ్యూహాలను రచిస్తున్నారు. ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు.
- అసెంబ్లీ స్థానాల్లో ఇటీవల శాసనసభకు జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఓట్లను మించి.. పార్టీ అభ్యర్థికి మెజారిటీ సాధించాలని నియోజకవర్గ బాధ్యులకు భాజపా నిర్దేశిస్తోంది. ఈ నేపథ్యంలో కామారెడ్డి నియోజకవర్గంలో లక్ష ఓట్లు సాధించాలనే లక్ష్యంతో భాజపా ఎమ్మెల్యే కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు రెండింతల మెజారిటీ సాధించాలని ఎమ్మెల్యేలకు నిర్దేశించినట్లు సమాచారం.
- కామారెడ్డిలో బస్సుయాత్ర చేపట్టిన భారాస అధినేత కేసీఆర్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ను గెలిపించాల్సిన ఆవశ్యకతను బాన్సువాడ, జహీరాబాద్ ఎమ్మెల్యేలకు నిర్దేశించారు. బాన్సువాడ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓడిపోయిన ఏనుగు రవీందర్రెడ్డి భారాస నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టు నిలుపుకొనేందుకు పోచారం శ్రీనివాస్రెడ్డితో పాటు ఆయన కుమారులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. జహీరాబాద్లో సైతం ఎమ్మెల్యే గ్రామాల వారీగా ప్రచారం చేపడుతున్నారు. మైనార్టీ ఓటర్లను కలుస్తూ భారాస హయాంలో చేసిన మేలును వివరిస్తూ మద్దతు కోసం యత్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తల్లిదండ్రులూ.. తస్మాత్ జాగ్రత్త
[ 20-05-2024]
ముద్దులొలికే పాపే ఆ తల్లిదండ్రులకు పంచప్రాణాలు..కొడుకున్నా.. కూతురిపైనే మక్కువ ఎక్కువ..చిట్టితల్లికి చిన్న గాయమైనా తట్టుకోలేని హృదయాలు వారివి. అప్పటి వరకు సరదాగా గడిపిన చిన్నారిని మృత్యువు మింగేసింది. -
సజ్జ రైతు సంబరం
[ 20-05-2024]
ఎర్రజొన్నల మాదిరిగానే ఒప్పందంపై సేద్యం చేస్తున్న సజ్జ పంట ఈసారి అన్నదాతల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని అధిక దిగుబడి రావడం, ధర అమాంతం రూ.2 వేలు పెరగడంతో సాగుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రూ.వేయి కోట్ల కొనుగోళ్లు
[ 20-05-2024]
దేశంలో పసుపు కొనుగోళ్లలో ప్రత్యేక స్థానం ఉన్న నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈసారి సుమారు రూ. వేయి కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి. జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గినప్పటికీ కొనుగోళ్లలో వృద్ధి కనిపించింది. -
‘గెలుపు మనదే’
[ 20-05-2024]
జహీరాబాద్ పార్లమెంటు స్థానంలో గెలుపు మనదేనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. సదాశివనగర్ మండల కాంగ్రెస్ నాయకులతో ఆదివారం ఆయన పోలింగ్ సరళి, గ్రామాల వారీగా కాంగ్రెస్కు పడిన ఓట్ల వివరాలపై ఆరా తీశారు. -
టీఎస్ కాస్తా టీజీగా..
[ 20-05-2024]
తెలంగాణ సంక్షిప్త రూపం ఇది వరకు టీఎస్గా ఉండేది. అది కాస్తా టీజీగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి నివేదికలు, ప్రభుత్వ ఉత్తర్వులు, లెటర్ హెడ్లపై టీఎస్కి బదులు టీజీగా పేర్కొనాలని వెల్లడించింది. -
పర్యాటకంగా మారిస్తే.. ప్రయోజనాలెన్నో!
[ 20-05-2024]
నిజామాబాద్ గ్రామీణ మండలం మల్కాపూర్ గ్రామ శివారులోని స్వయంగా వెలసిన అనంత పద్మనాభ స్వామి ఆలయానికి గుర్తింపు లభించడం లేదు. చెరువు గట్టున పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం ఇది. -
ఆదర్శ కళాశాలల్లో ప్రవేశాలకు వేళాయె
[ 20-05-2024]
తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. పదో తరగతి ఉత్తీర్ణులైనవారిలో అత్యధికులు ఇంటర్మీడియెట్ వైపు దృష్టి సారిస్తారు. అలాంటి వారికి ఆదర్శ జూనియర్ కళాశాలలు వరమనే చెప్పాలి. -
చూసి కొనాలి.. రసీదు పొందాలి
[ 20-05-2024]
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ముందస్తుగానే వానలు వచ్చే అవకాశం ఉండటంతో రైతులు నాణ్యమైన విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
పల్లె పోరుకు సన్నాహాలు
[ 20-05-2024]
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడుతోంది. సర్పంచుల పదవీకాలం జనవరి 31వ తేదీతో ముగిసింది.