జిల్లా అభివృద్ధి బాధ్యత నాది
నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి తాను అండగా నిలుస్తానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు.
ఇంజినీరింగ్, మహిళా డిగ్రీ కళాశాలలు మంజూరు చేస్తా
ఆర్మూర్ మున్సిపల్ భవనానికి రూ.16 కోట్లు
రోడ్ షోల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ
నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, ఆర్మూర్ పట్టణం, న్యూస్టుడే: నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి తాను అండగా నిలుస్తానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్మూర్, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన రోడ్ షోల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇందూరుకు ప్రభుత్వ ఇంజినీరింగ్, మహిళా డిగ్రీ కళాశాలలు, రింగ్ రోడ్డు ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. నగరం స్మార్ట్ సిటీలో ఉండేలా చొరవ చూపుతానన్నారు. కోడ్ ముగియగానే ఆర్మూర్లో పురపాలక సంఘం కార్యాలయ భవనానికి రూ.16 కోట్లు మంజూరు చేస్తానన్నారు. ఛైర్పర్సన్ లావణ్య తన దృష్టికి తెచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని మాటిచ్చారు. ‘ఇవన్నీ చేసే బాధ్యత నాది.. మీరంతా 13న జరిగే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసి గెలిపించే బాధ్యత తీసుకోవాలి’ అని కోరారు. పదేళ్లు తమ ప్రభుత్వమే ఉంటుందని, అన్ని సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుందామని చెప్పారు.
మచ్చలేని జీవన్రెడ్డిని గెలిపించండి..
‘వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెరిపిస్తానని అప్పటి ఎంపీ కవిత మోసగించారు. 2019 ఎన్నికల్లో ఐదు రోజుల్లో పసుపు బోర్డు కోసం అర్వింద్ బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేశారు. రాజ్నాథ్ సింగ్, రాంమాధవ్లతో ప్రకటన చేయించారు. ఆరు అడుగుల అహంకారమే అర్వింద్, ఆయన నిర్లక్ష్యం వల్లే నిజామాబాద్కు నిధులు రాకుండాపోయాయి.. ఆర్మూర్లో భాజపా ఎమ్మెల్యేను గెలిపించి పెనం పైనుంచి పోయిలో పడినట్లు అయింది. ఆయన ఈ ప్రాంత అభివృద్ధికి ఏమైనా నిధులు తెచ్చారా? అని ప్రశ్నించారు. ఈ సారి కాంగ్రెస్కు అవకాశం ఇవ్వండి. స్వయాన రైతు, 40 ఏళ్ల ప్రజాజీవితంలో మచ్చలేని నాయకుడు జీవన్రెడ్డి అని, ఆయనను గెలిపించాలి. లేదంటే మంచి ఓడిపోయి.. మోసమే గెలిచినట్లవుతుందని పేర్కొన్నారు.
ఆర్మూర్లో మాట్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డి, చిత్రంలో ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి, పుర ఛైర్పర్సన్ లావణ్య, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల ఇన్ఛార్జులు వినయ్రెడ్డి, సునీల్రెడ్డి
ఆర్మూర్ వల్లే ఈస్థాయికి వచ్చా..
పసుపు బోర్డు కోసం ఆర్మూర్ ప్రాంత రైతులు 2021లో చేసిన ధర్నా తన ఎదుగుదలకు దోహదం చేసిందన్నారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పాల్గొన్న ఆ ధర్నా సోనియమ్మ దృష్టిని ఆకర్షించడంతో పీసీసీ అధ్యక్ష పదవి, ఆ తర్వాత పోరాటాలతో పార్టీ అభివృద్ధికి చేసిన కృషి చూసి సీఎం పదవి ఇచ్చారని వెల్లడించారు. ‘ఆదర్శ గ్రామం అంకాపూర్.. ఇక్కడి రైతుల చైతన్యం ఇతరులకు స్ఫూర్తి. నల్లాచట్టాలు రద్దు చేయించిన హరియాణ, పంజాబ్ మాదిరిగానే.. ఆర్మూర్ రైతులు పోరాట పటిమ కలిగి ఉంటారు’ అని తెలిపారు. ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, భూపతిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పుర ఛైర్పర్సన్ వన్నెల్దేవి లావణ్య, మాజీ మంత్రి మండవ, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి, నాయకులు అరికెల, ఏ.లలిత, అన్వేష్రెడ్డి, తాహెర్, గడుగు గంగాధర్, వినయ్రెడ్డి, సునీల్రెడ్డి, కేశ వేణు, ధర్మపురి సంజయ్, ఏ.సుజాత పాల్గొన్నారు.
ఆర్మూర్ అంబేడ్కర్ చౌరస్తాలో కార్నర్మీటింగ్కు హాజరైన ప్రజలు
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్..
ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి జీవన్రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం కాంగ్రెస్ పార్టీ రోడ్ షోలు నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరై ఈ ప్రాంత సమస్యలపై మాట్లాడి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఆర్మూర్లో పాత బస్టాండ్ ప్రాంతం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ఓపెన్ టాప్ వాహనంలో ప్రయాణిస్తూ ప్రజలకు అభివాదం చేశారు. అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ..భాజపా, భారాసలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆర్మూర్లో భారాస జీవన్రెడ్డి నకిలీ అని.. అసలు జీవన్రెడ్డి తాటిపర్తి జీవన్రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. ‘లక్ష ఓట్లతో గెలిపించాలి.. నేను లక్ష అంటా..మీరు పక్కా’ అనాలని సూచించి పలుమార్లు నినాదాలు చేయించారు. నిజామాబాద్లో గోల్ హనుమాన్ మందిరం కూడలి నుంచి నెహ్రూ పార్క్ వరకు ఓపెన్ టాప్ జీపులో ప్రయాణిస్తూ ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం జరిగిన కార్నర్ మీటింగ్లో తెలుగు, ఉర్దూ భాషలో ప్రసంగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తల్లిదండ్రులూ.. తస్మాత్ జాగ్రత్త
[ 20-05-2024]
ముద్దులొలికే పాపే ఆ తల్లిదండ్రులకు పంచప్రాణాలు..కొడుకున్నా.. కూతురిపైనే మక్కువ ఎక్కువ..చిట్టితల్లికి చిన్న గాయమైనా తట్టుకోలేని హృదయాలు వారివి. అప్పటి వరకు సరదాగా గడిపిన చిన్నారిని మృత్యువు మింగేసింది. -
సజ్జ రైతు సంబరం
[ 20-05-2024]
ఎర్రజొన్నల మాదిరిగానే ఒప్పందంపై సేద్యం చేస్తున్న సజ్జ పంట ఈసారి అన్నదాతల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని అధిక దిగుబడి రావడం, ధర అమాంతం రూ.2 వేలు పెరగడంతో సాగుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రూ.వేయి కోట్ల కొనుగోళ్లు
[ 20-05-2024]
దేశంలో పసుపు కొనుగోళ్లలో ప్రత్యేక స్థానం ఉన్న నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈసారి సుమారు రూ. వేయి కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి. జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గినప్పటికీ కొనుగోళ్లలో వృద్ధి కనిపించింది. -
‘గెలుపు మనదే’
[ 20-05-2024]
జహీరాబాద్ పార్లమెంటు స్థానంలో గెలుపు మనదేనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. సదాశివనగర్ మండల కాంగ్రెస్ నాయకులతో ఆదివారం ఆయన పోలింగ్ సరళి, గ్రామాల వారీగా కాంగ్రెస్కు పడిన ఓట్ల వివరాలపై ఆరా తీశారు. -
టీఎస్ కాస్తా టీజీగా..
[ 20-05-2024]
తెలంగాణ సంక్షిప్త రూపం ఇది వరకు టీఎస్గా ఉండేది. అది కాస్తా టీజీగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి నివేదికలు, ప్రభుత్వ ఉత్తర్వులు, లెటర్ హెడ్లపై టీఎస్కి బదులు టీజీగా పేర్కొనాలని వెల్లడించింది. -
పర్యాటకంగా మారిస్తే.. ప్రయోజనాలెన్నో!
[ 20-05-2024]
నిజామాబాద్ గ్రామీణ మండలం మల్కాపూర్ గ్రామ శివారులోని స్వయంగా వెలసిన అనంత పద్మనాభ స్వామి ఆలయానికి గుర్తింపు లభించడం లేదు. చెరువు గట్టున పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం ఇది. -
ఆదర్శ కళాశాలల్లో ప్రవేశాలకు వేళాయె
[ 20-05-2024]
తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. పదో తరగతి ఉత్తీర్ణులైనవారిలో అత్యధికులు ఇంటర్మీడియెట్ వైపు దృష్టి సారిస్తారు. అలాంటి వారికి ఆదర్శ జూనియర్ కళాశాలలు వరమనే చెప్పాలి. -
చూసి కొనాలి.. రసీదు పొందాలి
[ 20-05-2024]
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ముందస్తుగానే వానలు వచ్చే అవకాశం ఉండటంతో రైతులు నాణ్యమైన విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
పల్లె పోరుకు సన్నాహాలు
[ 20-05-2024]
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడుతోంది. సర్పంచుల పదవీకాలం జనవరి 31వ తేదీతో ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..