ఏనుగు దంతం స్వాధీనం: ఒకరి అరెస్టు
గంజాం జిల్లా బుగుడా ఠాణా పరిధిలోని సంఖురు గ్రామంలోని ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి దాడి చేసిన దక్షిణ ఘుముసుర అటవీ డివిజన్ సిబ్బంది ఓ ఏనుగు దంతాన్ని స్వాధీనం చేసుకున్నారు.
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: గంజాం జిల్లా బుగుడా ఠాణా పరిధిలోని సంఖురు గ్రామంలోని ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి దాడి చేసిన దక్షిణ ఘుముసుర అటవీ డివిజన్ సిబ్బంది ఓ ఏనుగు దంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకర్ని అరెస్టు చేసి శనివారం న్యాయస్థానానికి తరలించారు.
* జరడా ఠాణా పరిధిలో జయంతిపూర్లోని శ్రీ దివ్యసింహ విద్యాపీఠంలో శారీరక విద్య శిక్షకుని (పీఈటీ)గా పనిచేస్తున్న దనార్దన సాహు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోణలపై బ్రహ్మపుర విజిలెన్స్ డివిజన్ అధికారులు ఇటీవల పదమూడు చోట్ల దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఆయా దాడుల్లో సాహు అతడి కుటుంబ సభ్యుల పేరిట మొత్తం రూ.4,83,88,052ల విలువ గల స్థిర, చరాస్తులు గుర్తించిన సంగతి విదితమే. సాహు ఆదాయం, ఖర్చులు మినహాయించగా, ఆయన 234 శాతం (రూ.4,01,27,117) అధిక ఆదాయం కలిగి ఉన్నట్లు లెక్కల్లో తేలిందని బ్రహ్మపుర విజిలెన్స్ ఎస్పీ గణేష్చంద్ర ప్రధాన్ ఆదివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.
* కళ్లికోట ఠాణా పరిధిలోని వివిధ చోట్ల వరుస చోరీ ఘటనలు జరిగాయి. నలుగురు నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి బంగారు ఆభరణాలు, నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఠాణా ఆవరణలో బాధితులకు వాటిని అందజేసినట్లు ఐఐసీ జగన్నాథ మల్లిక విలేకరులకు తెలిపారు.
* బ్రహ్మపుర శివారున ఓ ఇంజినీరింగు కళాశాల విద్యార్థిపై కొందరు దాడి చేయడంతో అతడి చేయి విరిగింది. కశాశాలలో ర్యాగింగ్ జరుగుతోందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ దాడి కళాశాల బయట జరిగిందంటూ సంబంధిత కళాశాల యాజమాన్యం విలేకరులతో పేర్కొన్నట్లు ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి.
* గంజాం జిల్లా అస్కా ఠాణా పరిధిలోని నువాగాంలో ఆదివారం ఉదయం ఇంట్లో తండ్రిని దుర్భాషలాడిన కొడుకు నేత్రానంద సేన (23) అతడి పీక నులిమి హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో తండ్రి కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారు అక్కడకు చేరుకుని కాపాడారు. ఈ ఘటనపై బాధిత తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కొడుకు నేత్రానందను అరెస్టు చేసి ఆదివారం న్యాయస్థానానికి తరలించామని ఠాణా ఐఐసీ ప్రశాంత కుమార్ సాహు సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిడుగుపాటుకు ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
[ 26-04-2024]
గజపతి జిల్లాలో కాల వైశాఖి ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. -
జంపివాణి కేసులో నిందితుడికి ఉరిశిక్ష
[ 26-04-2024]
మ్యుచుండే వయగఢ్ జిల్లా ఏడీజేఎంకేలో 2019లో జరిగిన జంపి వాణి కేసులో శుక్రవారం తీర్పు వెల్లడించారు. -
నీటిలో మునిగి ఇద్దరు బాలికలు మృతి
[ 26-04-2024]
జిల్లాలోని గేప్ సమితిలోని మథని గ్రామంలో శుక్రవారం రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. -
రాటుదేలిన యోధులు... ఎవరో విజేతలు?
[ 26-04-2024]
రాజకీయాల్లో రాటుదేలిన ముగ్గురు యోధుల మధ్య బాలేశ్వర్ లోక్సభ పరిధిలో ఈసారి ఎన్నికల సంగ్రామం సాగుతోంది. -
కేకేలైన్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 26-04-2024]
కొరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు బోల్తా పడ్డాయి. -
జగన్నాథునికి సైనా పూజలు
[ 26-04-2024]
అంతర్జాతీయ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గురువారం ఉదయం శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
[ 26-04-2024]
ఇప్పటికే రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. -
నవీన్ ప్రభుత్వాన్ని గద్దె దించండి
[ 26-04-2024]
సామర్థ్యం కొరవడిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అయిదేళ్లు భాజపాకు అవకాశం ఇవ్వాలని, ఒడిశాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. -
పనిచేయని బిజూ కార్డు.. ఆగిన శస్త్రచికిత్స
[ 26-04-2024]
బిజు కార్డు పని చేయకపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడికి చేయవలసిన శస్త్రచికిత్స ఆపేశారు. గత్యంతరం లేక బాలుడిని పట్టుకొని తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చిన ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. -
కాంగ్రెస్లో రాజీనామాలు
[ 26-04-2024]
గుణుపురం విధానసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్కు సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు నాయకులు ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేసినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బిజయకుమార్ గమాంగ్ తెలిపారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం...
[ 26-04-2024]
గజపతి జిల్లాలో మే 13వ తేదీన జరిగే ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. మోహన నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా రూబెన్ మండల్
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!