ఉద్యమ దీప్తి.. చైతన్య స్ఫూర్తి లక్ష్మణ్
స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా 1942 ఆగస్టు 9 నుంచి ప్రారంభమైన ‘భారత్ ఛోడో’ ఆందోళనలో వేలాదిమంది ఉత్కళీయులు పాల్గొన్నారు. బాలేశ్వర్ జిల్లా లుణియా, ఖయిరాడిలి, ఇరామఠ ప్రాంతాల్లో ఉద్యమం తీవ్రం కాగా ఆంగ్లేయుల దమనకాండలో
స్వాతంత్య్ర సమరంలో ఉరికంబమెక్కిన సేనాని
భువనేశ్వర్, న్యూస్టుడే
స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా 1942 ఆగస్టు 9 నుంచి ప్రారంభమైన ‘భారత్ ఛోడో’ ఆందోళనలో వేలాదిమంది ఉత్కళీయులు పాల్గొన్నారు. బాలేశ్వర్ జిల్లా లుణియా, ఖయిరాడిలి, ఇరామఠ ప్రాంతాల్లో ఉద్యమం తీవ్రం కాగా ఆంగ్లేయుల దమనకాండలో 42 మంది అమరులయ్యారు. అదే సమయంలో అవిభక్త కొరాపుట్ జిల్లాలోని మథిలి, పపడహండి ప్రాంతాల్లో 25 మంది గిరిజన యోధులను బ్రిటిష్ సైన్యం కాల్చి చంపింది. బాలేశ్వర్, కొరాపుట్, అనుగుల్, ఢెంకనాల్, నయాగఢ్, అఠాగఢ్ (కటక్), నీలగిరి, బాలేశ్వర్ ప్రాంతాల్లో త్యాగధనులు విజయమో, వీర స్వర్గమో తేల్చుకోవడానికి పోరు ముమ్మరం చేశారు. ఈ సమయంలో బ్రిటీష్ పాలకులు పలువురిని బందీలుగా పట్టుకున్నారు.
షహీద్ లక్ష్మణ్నాయక్
దేశభక్తికి మరోపేరు
ఈ సమయంలో అవిభక్త కొరాపుట్ జిల్లాలో సమర శంఖం పూరించిన గిరిజన వీరుడు తోటి ఆదివాసీ యువకుల్లో స్వాతంత్య్రేచ్ఛ, దేశభక్తి నూరిపోశారు. ఆయనే షహీద్ లక్ష్మణ్ నాయక్. 1899 నవంబరు 22న అవిభక్త కొరాపుట్ జిల్లా తెంతులిగుమ్మ గ్రామంలో జన్మించిన నాయక్ బాల్యం నుంచే నరనరాల్లో దేశభక్తిని జీర్ణించుకున్నారు. ఆంగ్లేయుల దుష్ట పాలన, బానిసత్వ నిర్మూలన ధ్యేయంగా దండకారణ్యం స్థావరంగా చేసుకుని గిరిపుత్రులందర్నీ ఏకతాటిపైకి తెచ్చారు. భారత్ ఛోడో ఆందోళనకు నాయకత్వం వహించారు. అల్లూరి సీతారామరాజు, నీలకంఠ పాత్ర్, ఇతూరి దొర తదితర విప్లవ వీరులను ఆదర్శంగా తీసుకున్న పోరు తీవ్రం చేశారు. అరెస్టయి 5 నెలలు కారాగారంలో ఉన్నారు. విడుదలైన తర్వాత మల్కాన్గిరి ఠాణాపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని వ్యూహం రచించారు. వందలాది మందితో పాదయాత్రగా బయలుదేరిన క్రాంతి వీరులను మథిలి వద్ద బ్రిటిష్ అధికారులు అడ్డుకున్నారు. పట్టువీడని వారంతా జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల లాఠీ దెబ్బలను భరించారు. ఇక్కడ జరిగిన కాల్పుల్లో హింగా భుమియా వీర మరణం పొందారు. ఈ సంఘటన నేపథ్యంలో తలోవైపు పరుగులు తీస్తున్న సమయంలో జరిగిన కాల్పుల్లో ఒక కానిస్టేబుల్ మరణించాడు. ఆయనను కాల్చి చంపారనే ఆరోపణలతో లక్ష్మణ్ నాయక్ను బంధించారు.
షహీద్ నాయక్ పేరిట విడుదలైన తపాలా బిళ్ల
బ్రహ్మపుర జైలులో ఉరి
1943 మార్చి 29న బ్రహ్మపుర మండల కారాగారంలో నాయక్ను ఉరి తీశారు. తుదిశ్వాస విడిచే వరకు భారత మాతకు జై అన్న నినాదం వీడని ఈ గిరిజన వీరుడు చరిత్ర పుటల్లో అమరజీవిగా నిలిచారు. భరతమాత దాస్య శృంఖలాలు చేధించడానికి అమరులైన వారిలో ప్రముఖునిగా నేటికీ పూజలందుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిడుగుపాటుకు ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
[ 26-04-2024]
గజపతి జిల్లాలో కాల వైశాఖి ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. -
జంపివాణి కేసులో నిందితుడికి ఉరిశిక్ష
[ 26-04-2024]
మ్యుచుండే వయగఢ్ జిల్లా ఏడీజేఎంకేలో 2019లో జరిగిన జంపి వాణి కేసులో శుక్రవారం తీర్పు వెల్లడించారు. -
నీటిలో మునిగి ఇద్దరు బాలికలు మృతి
[ 26-04-2024]
జిల్లాలోని గేప్ సమితిలోని మథని గ్రామంలో శుక్రవారం రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. -
రాటుదేలిన యోధులు... ఎవరో విజేతలు?
[ 26-04-2024]
రాజకీయాల్లో రాటుదేలిన ముగ్గురు యోధుల మధ్య బాలేశ్వర్ లోక్సభ పరిధిలో ఈసారి ఎన్నికల సంగ్రామం సాగుతోంది. -
కేకేలైన్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 26-04-2024]
కొరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు బోల్తా పడ్డాయి. -
జగన్నాథునికి సైనా పూజలు
[ 26-04-2024]
అంతర్జాతీయ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గురువారం ఉదయం శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
[ 26-04-2024]
ఇప్పటికే రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. -
నవీన్ ప్రభుత్వాన్ని గద్దె దించండి
[ 26-04-2024]
సామర్థ్యం కొరవడిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అయిదేళ్లు భాజపాకు అవకాశం ఇవ్వాలని, ఒడిశాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. -
పనిచేయని బిజూ కార్డు.. ఆగిన శస్త్రచికిత్స
[ 26-04-2024]
బిజు కార్డు పని చేయకపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడికి చేయవలసిన శస్త్రచికిత్స ఆపేశారు. గత్యంతరం లేక బాలుడిని పట్టుకొని తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చిన ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. -
కాంగ్రెస్లో రాజీనామాలు
[ 26-04-2024]
గుణుపురం విధానసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్కు సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు నాయకులు ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేసినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బిజయకుమార్ గమాంగ్ తెలిపారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం...
[ 26-04-2024]
గజపతి జిల్లాలో మే 13వ తేదీన జరిగే ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. మోహన నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా రూబెన్ మండల్
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!