భక్తిశ్రద్ధలతో మహర్నవమి పూజలు
గంజాం జిల్లాలో దేవీ నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం మహర్నవమి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
మహిషాసురమర్ధిని అవతారంలో చౌడేశ్వరి అమ్మవారు
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: గంజాం జిల్లాలో దేవీ నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం మహర్నవమి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జిల్లాలోని సుప్రసిద్ధ తరాతరిణి, మా నారాయణి, మా బాలకుమారి, సిద్ధ భైరవి, మొహురి కాళువ, సింఘాసిని, వ్యాఘ్రదేవి, మా బంకేశ్వరి తదితర శక్తిపీఠాల్లో దేవతామూర్తులకు ప్రత్యేక అలంకరణలు చేసి విశేష పూజలు నిర్వహించారు. స్థానిక మార్తాపేటలోని రామలింగ చౌడేశ్వరి అమ్మవారిని ఉదయం మహిషాసురమర్ధిని అవతారంతో అలంకరించారు. ఖస్పావీధిలోని జఠాధరేశ్వరస్వామి కల్యాణ మండపం, జెమ్మి వీధిలోని స్వామి అయ్యప్ప ఆశ్రమం, ప్రేమనగర్ రెండోలైనులోని ఆర్యవైశ్య కల్యాణ మండపం, డైమండ్ ట్యాంకు రోడ్డులో వీరబ్రహ్మేంద్ర స్వామీజీ మందిరంలోని కామాక్షి అమ్మవారు, నీలకంఠేశ్వరాలయం రోడ్డులో హరిహర భెట్ మందిరం సమీపాన స్వామి అయ్యప్ప మందిరాల్లో మహిళలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. స్థానిక గాంధీనగర్ కూడలిలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి పూజా మండపంలో మధ్యాహ్నం స్థానిక లలితా పారాయణం బృందం మహిళలు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తల్లి సన్నిధిలో లలితా పారాయణం చేశారు.
చికిటి సమితిలోని శక్తిపీఠంలో మా బాలకుమారి అలంకరణ
ఆర్యవైశ్య కల్యాణ మండపంలో మహిళల సామూహిక కుంకుమార్చనలు
గాంధీనగర్లోని దుర్గాదేవి మండపంలో పారాయణ చేస్తున్న మహిళలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాటుదేలిన యోధులు... ఎవరో విజేతలు?
[ 26-04-2024]
రాజకీయాల్లో రాటుదేలిన ముగ్గురు యోధుల మధ్య బాలేశ్వర్ లోక్సభ పరిధిలో ఈసారి ఎన్నికల సంగ్రామం సాగుతోంది. -
కేకేలైన్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 26-04-2024]
కొరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు బోల్తా పడ్డాయి. -
జగన్నాథునికి సైనా పూజలు
[ 26-04-2024]
అంతర్జాతీయ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గురువారం ఉదయం శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
[ 26-04-2024]
ఇప్పటికే రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. -
నవీన్ ప్రభుత్వాన్ని గద్దె దించండి
[ 26-04-2024]
సామర్థ్యం కొరవడిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అయిదేళ్లు భాజపాకు అవకాశం ఇవ్వాలని, ఒడిశాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. -
పనిచేయని బిజూ కార్డు.. ఆగిన శస్త్రచికిత్స
[ 26-04-2024]
బిజు కార్డు పని చేయకపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడికి చేయవలసిన శస్త్రచికిత్స ఆపేశారు. గత్యంతరం లేక బాలుడిని పట్టుకొని తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చిన ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. -
కాంగ్రెస్లో రాజీనామాలు
[ 26-04-2024]
గుణుపురం విధానసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్కు సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు నాయకులు ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేసినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బిజయకుమార్ గమాంగ్ తెలిపారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం...
[ 26-04-2024]
గజపతి జిల్లాలో మే 13వ తేదీన జరిగే ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. మోహన నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా రూబెన్ మండల్