జన్మభూమి రుణం తీర్చుకోవాలి: నవీన్
తమ ప్రభుత్వం ‘సమృద్ధ ఒడిశా’ ధ్యేయంగా కార్యక్రమాలు అమలు పరుస్తోందని, అభివృద్ధిలో రాష్ట్రం ముందంజలో ఉందని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు.
నవీన్ నివాస్లో పిల్లలతో సీఎం ముచ్చట
భువనేశ్వర్, న్యూస్టుడే: తమ ప్రభుత్వం ‘సమృద్ధ ఒడిశా’ ధ్యేయంగా కార్యక్రమాలు అమలు పరుస్తోందని, అభివృద్ధిలో రాష్ట్రం ముందంజలో ఉందని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం రాష్ట్ర ప్రజలకు ఆయన వీడియో సందేశమిచ్చారు. మనకెంతో ఇచ్చిన జన్మభూమి రుణం తీర్చుకోవడానికి యువత ముందుకు రావాలని, అంకితభావంతో సేవలు అందించాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో ఉన్నామని, మో సర్కార్, 5-టీ కార్యక్రమాలు మంచి ఫలితాలిచ్చాయని పేర్కొన్నారు. కొవిడ్ ఆర్ధిక ప్రమాణాలను దెబ్బతీసినా, సమర్ధంగా ఎదుర్కోగలిగామని, సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని నవీన్ చెప్పారు.
పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు
కొవిడ్ వల్ల రెండేళ్లకుపైగా నవీన్ నివాస్కు ఎవరినీ అనుమతించలేదు. నవీన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. మహమ్మారి నియంత్రణలో ఉన్నందున ఆయన గణతంత్ర వేడుకల కోసం భువనేశ్వర్లోని పాఠశాలలకు చెందిన పిల్లల్ని ఆహ్వానించి వారితో ముచ్చటించి చాక్లెట్లు, బిస్కెట్లు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గజపతి సేవలు చిరస్మరణీయం: నవీన్
[ 27-04-2024]
స్వతంత్ర ఒడిశా ఏర్పాటు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మహారాజా కృష్ణచంద్ర గజపతి సేవలు చిరస్మరణీయమని, రాష్ట్ర ప్రజలకు ఆయన మార్గదర్శిగా నిలిచారని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభివర్ణించారు. -
కాంగ్రెస్కు పూర్వవైభవం దక్కేనా
[ 27-04-2024]
కొరాపుట్ జిల్లాలోని అయిదు నియోజకవర్గాలు ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేవి. ఆ పార్టీలో నెలకొన్న వివాదాలు పార్టీకి తీవ్ర నష్టాన్ని తీసుకువస్తున్నాయి. -
హింజిలికి ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయండి
[ 27-04-2024]
‘ముఖ్యమంత్రిగా 25 ఏళ్ల కాలంలో మీ సొంత నియోజకవర్గం హింజిలికి ఏం చేశారు?.. వలసలు నివారించడానికి అక్కడ పరిశ్రమలు ఏవైనా ప్రారంభించగలిగారా? అన్నదానిపై శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని నవీన్కు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సవాల్ విసిరారు. -
ధర్మేంద్ర మాతృభూమికి చేసిందేమిటి?
[ 27-04-2024]
స్థిరమైన పాలన అందించిన ఘనచరిత్ర ముఖ్యమంత్రి నవీన్ సొంతమని, ఉత్తమ పాలకునిగా మన్ననలందుకున్నారని, అన్ని రికార్డులు ఆయన సొంతమని సంబల్పూర్ లోక్సభ బిజద అభ్యర్థి ప్రణవ ప్రకాష్ దాస్ (బొబి) పేర్కొన్నారు. -
5 లోక్సభ, 35 అసెంబ్లీ స్థానాలకు నోటిఫికేషన్
[ 27-04-2024]
రాష్ట్రంలో రెండోవిడతగా మే 20న జరగనున్న అస్కా, కొంధమాల్, బొలంగీర్, బరగఢ్, సుందర్గఢ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 35 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. -
రాయగడ జిల్లాలో 62 నామినేషన్లు
[ 27-04-2024]
జిల్లాలో రాయగడ, గుణుపురం, బిసంకటక్ నియోజకవర్గ శాసనసభ స్థానాలకుగాను ప్రధాన పార్టీలతోసహా ఇతర పార్టీ అభ్యర్థులు, స్వతంత్రులతో కలిపి 62 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు శుక్రవారం ఆర్వో సంఘమిత్రా దేవి వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత
[ 27-04-2024]
కేంద్ర హోంమంత్రి, భాజపా సిద్ధాంతకర్త అమిత్షా రాష్ట్ర పర్యటన పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. గురువారం సాయంత్రం పశ్చిమ ఒడిశాలోని సోన్పూర్ బహిరంగ సభలో నవీన్ పట్నాయక్ పాలనా వైఫల్యాలను విమర్శించిన షా తాము బిజదకు అనుకూలం కాదన్న సందేశమిచ్చారు. -
నాడు బిజద.. నేడు భాజపా
[ 27-04-2024]
రాయగడ జిల్లా గుణుపురం నియోజకవర్గంలో కొందరు నిన్నటి వరకు బిజూ జనతా దళ్లో ఉండి ఎన్నికల ముందు భాజపాలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. -
బిజదలో చేరికలు
[ 27-04-2024]
బ్రహ్మపుర మున్సిపల్ కార్పొరేషన్ (బీఈఎంసీ) అయిదో వార్డుకు చెందిన యువ నాయకుడు సనాతన సాహు శుక్రవారం రాత్రి బిజదలో చేరారు. అంతకుముందు ఆయన వందలాది మంది వార్డు ప్రజలు, మద్దతుదారులతో కలిసి వార్డులో పాదయాత్ర నిర్వహించారు.