ప్రైవేటుకు ఒ.ఎస్.ఆర్.టి.సి. బస్సులు
ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఒ.ఎస్.ఆర్.టి.సి.) నష్టాల్లో కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వం బస్సులకు ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు సన్నాహాలు ప్రారంభించింది.
త్వరలో టెండర్ల ప్రక్రియ
కటక్, న్యూస్టుడే
ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఒ.ఎస్.ఆర్.టి.సి.) నష్టాల్లో కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వం బస్సులకు ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. గతవారం రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శి ఉష పాఢి నేతృత్వంలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓఎస్ ఆర్టీసీకి నష్టాలు రావడంతో బస్సులను ప్రైవేట్ సంస్థకు లీజులో ఇచ్చేందుకు నిర్ణయించారు. దీంతో బస్సుల నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల జీతాల భారం ప్రభుత్వంపై తగ్గుతుంది. ప్రైవేటీకరణకు ఒప్పందం జరిగితే నష్టాలు వచ్చే మార్గాల్లో నడుస్తున్న బస్సులకు సంబంధించి ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఓఎస్ ఆర్టీసీ వద్ద ప్రస్తుతం 636 బస్సులు ఉన్నాయి. వీటిలో 317 మార్గాల్లో 478 బస్సులు నడుస్తున్నాయి. 105 బస్సులు మరమ్మతులకు గురయ్యాయి. వీటిని బాగు చేయిస్తున్నారు. 53 బస్సులు నిరుపయోగంగా మారాయి. రాష్ట్రంలో ప్రైవేటు బస్సుల సంఖ్యతో పోల్చితే ఓఎస్ఆర్టీసీ బస్సులు కేవలం ఐదు శాతం మాత్రమే. ప్రస్తుతం సంస్థలో 1450 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో 149 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. మిగిలినవారు కాంటాక్ట్ విధానంలో పనిచేస్తున్నారు. పలు పట్టణాలు, నగరాల్లో సంస్థకు 201 ప్రాంతాల్లో 273 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలాలను ప్రభుత్వం తీసుకొని ఆదాయం పెంచుకునేలా వ్యాపార దుకాణాలు, ఇతర నిర్మాణాలు చేయనుంది. ఇందుకోసం టెండర్లు పిలవనున్నారు.
మొదటి నుంచి నిర్లక్ష్యం
1974లో ఓఎస్ఆర్టీసీ ఏర్పాటైంది. సంస్థ ప్రారంభం నుంచి నష్టాల్లో కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రైవేటు బస్సుల యజమానులు రాష్ట్రంలో బస్సులు నడుపుతూ లాభాలు సాధిస్తుంటే రాష్ట్ర ఆర్టీసీ ఎందుకు నష్టాల్లో కొనసాగుతోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయిస్తే 2021-22 ఆర్థిక సంవత్సరంలో 10 ఖరీదైన వాల్వో బస్సులను ఎందుకు కొనుగోలు చేసిందని అడుగుతున్నారు. నష్టాల నుంచి బయట పడి లాభాల బాట పట్టేందుకు చర్యలు తీసుకోవాలే తప్ప ప్రైవేటుకు అప్పగించడం తగదని సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గజపతి సేవలు చిరస్మరణీయం: నవీన్
[ 27-04-2024]
స్వతంత్ర ఒడిశా ఏర్పాటు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మహారాజా కృష్ణచంద్ర గజపతి సేవలు చిరస్మరణీయమని, రాష్ట్ర ప్రజలకు ఆయన మార్గదర్శిగా నిలిచారని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభివర్ణించారు. -
కాంగ్రెస్కు పూర్వవైభవం దక్కేనా
[ 27-04-2024]
కొరాపుట్ జిల్లాలోని అయిదు నియోజకవర్గాలు ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేవి. ఆ పార్టీలో నెలకొన్న వివాదాలు పార్టీకి తీవ్ర నష్టాన్ని తీసుకువస్తున్నాయి. -
హింజిలికి ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయండి
[ 27-04-2024]
‘ముఖ్యమంత్రిగా 25 ఏళ్ల కాలంలో మీ సొంత నియోజకవర్గం హింజిలికి ఏం చేశారు?.. వలసలు నివారించడానికి అక్కడ పరిశ్రమలు ఏవైనా ప్రారంభించగలిగారా? అన్నదానిపై శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని నవీన్కు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సవాల్ విసిరారు. -
ధర్మేంద్ర మాతృభూమికి చేసిందేమిటి?
[ 27-04-2024]
స్థిరమైన పాలన అందించిన ఘనచరిత్ర ముఖ్యమంత్రి నవీన్ సొంతమని, ఉత్తమ పాలకునిగా మన్ననలందుకున్నారని, అన్ని రికార్డులు ఆయన సొంతమని సంబల్పూర్ లోక్సభ బిజద అభ్యర్థి ప్రణవ ప్రకాష్ దాస్ (బొబి) పేర్కొన్నారు. -
5 లోక్సభ, 35 అసెంబ్లీ స్థానాలకు నోటిఫికేషన్
[ 27-04-2024]
రాష్ట్రంలో రెండోవిడతగా మే 20న జరగనున్న అస్కా, కొంధమాల్, బొలంగీర్, బరగఢ్, సుందర్గఢ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 35 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. -
రాయగడ జిల్లాలో 62 నామినేషన్లు
[ 27-04-2024]
జిల్లాలో రాయగడ, గుణుపురం, బిసంకటక్ నియోజకవర్గ శాసనసభ స్థానాలకుగాను ప్రధాన పార్టీలతోసహా ఇతర పార్టీ అభ్యర్థులు, స్వతంత్రులతో కలిపి 62 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు శుక్రవారం ఆర్వో సంఘమిత్రా దేవి వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత
[ 27-04-2024]
కేంద్ర హోంమంత్రి, భాజపా సిద్ధాంతకర్త అమిత్షా రాష్ట్ర పర్యటన పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. గురువారం సాయంత్రం పశ్చిమ ఒడిశాలోని సోన్పూర్ బహిరంగ సభలో నవీన్ పట్నాయక్ పాలనా వైఫల్యాలను విమర్శించిన షా తాము బిజదకు అనుకూలం కాదన్న సందేశమిచ్చారు. -
నాడు బిజద.. నేడు భాజపా
[ 27-04-2024]
రాయగడ జిల్లా గుణుపురం నియోజకవర్గంలో కొందరు నిన్నటి వరకు బిజూ జనతా దళ్లో ఉండి ఎన్నికల ముందు భాజపాలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. -
బిజదలో చేరికలు
[ 27-04-2024]
బ్రహ్మపుర మున్సిపల్ కార్పొరేషన్ (బీఈఎంసీ) అయిదో వార్డుకు చెందిన యువ నాయకుడు సనాతన సాహు శుక్రవారం రాత్రి బిజదలో చేరారు. అంతకుముందు ఆయన వందలాది మంది వార్డు ప్రజలు, మద్దతుదారులతో కలిసి వార్డులో పాదయాత్ర నిర్వహించారు.