నవీన్తో మమతా బెనర్జీ భేటీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం సాయంత్రం ఒడిశా సీఎం నవీన్ను ఆయన నివాసంలో కలిశారు.
నవీన్ మెడలో శాలువా వేస్తున్న మమతా
భువనేశ్వర్, న్యూస్టుడే: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం సాయంత్రం ఒడిశా సీఎం నవీన్ను ఆయన నివాసంలో కలిశారు. పూరీ నుంచి వచ్చిన ఆమెకు స్వాగతించిన నవీన్ జగన్నాథుని ఫొటో తీర్థ ప్రసాదాలతో పాటు ‘ఛెన్నాపుడొ’ (జున్ను మిఠాయి) బహూకరించారు. కొద్దిసేపు ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడుతూ..తమ ఇద్దరి మధ్య రాజకీయ అంశాలపై చర్చ జరగలేదని, ఆమె పూరీ దర్శనానికి వచ్చి తనను మర్యాదపూర్వకంగా కలిశారని చెప్పారు. దేశంలో ఫెడరల్ వ్యవస్థ బలంగా ఉండాలన్నదే ఇద్దరి అభిమతమన్నారు. మమతా బెనర్జీ మాట్లాడుతూ.. పూరీలోని సిపా సొరుబలి ప్రాంతంలో ఒడిశా ప్రభుత్వం రెండెకరాల స్థలం ఉచితంగా కేటాయించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. పూరీలో బెంగాల్ అతిథి భవనం నిర్మాణం పనులు త్వరలో ప్రారంభం అవుతాయన్నారు. సాధారణ ఎన్నికలకు ఏడాది సమయం ఉందని, దీనిపై తాము చర్చ జరపలేదన్నారు. దివంగత బిజుబాబు కుటుంబంతో తమకు అనుబంధం ఉందని, పూరీ జగన్నాథుని సన్నిధికి వచ్చినప్పుడు నవీన్తో భేటీ అవుతుంటానని చెప్పారు. ఒడిశాకు తుఫాను వస్తే విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ప్రభావం బెంగాల్పై పడుతోందన్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య సన్నిహిత బంధం ఉండాలని బెంగాల్ వాసులంతా జగన్నాథుని భక్తులని పేర్కొన్నారు. ఒడిశా సరిహద్దులోని దిఘాలో తమ ప్రభుత్వం జగన్నాథుని ఆలయం నిర్మించిందని, దీన్ని తిలకించడానికి రావాలని నవీన్కు ఆహ్వానించామన్నారు. ఒడిశాలో ఖనిజ సంపదలు పుష్కలంగా ఉన్నందున నిర్మాణాలు పుంజుకోనుండగా, బెంగాల్ వరకు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు మంచి అవకాశాలున్నాయని ఈ అంశంపై నవీన్ సముచిత నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒడిశా సీఎం గొప్ప నాయకుడని ఆమె కొనియాడారు. పూరీలో విడిది చేసిన తనకు అధికారులు సౌకర్యాలు కల్పించారని, నవీన్ ఆతిథ్యం మరవలేనని మమతా చిరునవ్వుతో చెప్పారు. ఈ భేటీలో 5-టీ కార్యదర్శి వి.కార్తికేయ పాండ్యన్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాటుదేలిన యోధులు... ఎవరో విజేతలు?
[ 26-04-2024]
రాజకీయాల్లో రాటుదేలిన ముగ్గురు యోధుల మధ్య బాలేశ్వర్ లోక్సభ పరిధిలో ఈసారి ఎన్నికల సంగ్రామం సాగుతోంది. -
కేకేలైన్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 26-04-2024]
కొరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు బోల్తా పడ్డాయి. -
జగన్నాథునికి సైనా పూజలు
[ 26-04-2024]
అంతర్జాతీయ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గురువారం ఉదయం శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
[ 26-04-2024]
ఇప్పటికే రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. -
నవీన్ ప్రభుత్వాన్ని గద్దె దించండి
[ 26-04-2024]
సామర్థ్యం కొరవడిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అయిదేళ్లు భాజపాకు అవకాశం ఇవ్వాలని, ఒడిశాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. -
పనిచేయని బిజూ కార్డు.. ఆగిన శస్త్రచికిత్స
[ 26-04-2024]
బిజు కార్డు పని చేయకపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడికి చేయవలసిన శస్త్రచికిత్స ఆపేశారు. గత్యంతరం లేక బాలుడిని పట్టుకొని తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చిన ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. -
కాంగ్రెస్లో రాజీనామాలు
[ 26-04-2024]
గుణుపురం విధానసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్కు సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు నాయకులు ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేసినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బిజయకుమార్ గమాంగ్ తెలిపారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం...
[ 26-04-2024]
గజపతి జిల్లాలో మే 13వ తేదీన జరిగే ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. మోహన నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా రూబెన్ మండల్