ప్రధాన పార్టీలకు అసంతృప్తుల బెడద
కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్, పొట్టంగి, కొరాపుట్ నియోజకవర్గాల్లో టికెట్ దక్కని అసంతృప్త వర్గాలతో ప్రధాన పార్టీలకు తలనొప్పి వ్యవహారంగా మారింది.
సిమిలిగుడ, న్యూస్టుడే: కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్, పొట్టంగి, కొరాపుట్ నియోజకవర్గాల్లో టికెట్ దక్కని అసంతృప్త వర్గాలతో ప్రధాన పార్టీలకు తలనొప్పి వ్యవహారంగా మారింది. దాదాపు అన్ని నియోజక వర్గాల్లో బిజద, భాజపా, కాంగ్రెస్ల టికెట్ దక్కనివారిలో వ్యతిరేకత ఏర్పడింది.
కొరాపుట్ నియోజకవర్గం నుంచి బిజద నుంచి సుమారు 15 మంది టికెట్ ఆశించారు. సిటింగ్ ఎమ్మెల్యే రఘురామ్ పడాల్కు అవకాశం లభించింది. ఇది ఇష్టం లేని పలువురు నాయకులు వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. అభ్యర్థిని మార్చాలని ఒత్తిడి చేశారు. కొరాపుట్, లమతాపుట్ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపించింది. భాజపా టికెట్ రఘురామ్ మచ్చోకు రావడంతో మిగతా అభ్యర్థులు ఆందోళన చేయడంతో ఉత్కంఠ నెలకొంది. కొందరు పార్టీ వీడి ఇతర పార్టీల్లో చేరారు.
పొట్టంగిలో కాంగ్రెస్ టికెట్ మాజీ ఎమ్మెల్యే రామ్చంద్ర కడమ్కు దక్కడంతో నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. రేస్లో ఉన్న మాజీ ఎంపీ జయరామ్ పంగి, సాంబ పంగిలు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. వెంటనే అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారు. ఇక భాజపాలో కూడా అసంతృప్తి లేకపోలేదు. అభ్యర్థిగా నిలిచిన చైతన్య హంతల్ కుల ధ్రువీకరణ పత్రంతో వివాదాన్ని సృష్టించి వ్యతిరేకిస్తున్నారు. చైతన్య టికెట్ సైతం రద్దు అయింది. ఆయన స్థానంలో చైతన్య నందివాలికి టికెట్ ఇచ్చారు. దీన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. బిజద సిటింగ్ ఎమ్మెల్యే ప్రీతమ్ పాఢికి బదులు మాజీ ఎమ్మెల్యే ప్రఫుల్ల కుమార్ పంగికి టికెట్ ఇవ్వడంతో ప్రీతమ్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. అధిష్ఠానం బుజ్జగింపుతో నిర్ణయం మార్చుకున్నారు.
లక్ష్మీపూర్లో పెరుగుతున్న రాజీనామాలు
లక్ష్మీపూర్ నియోజకవర్గంలో టికెట్ కేటాయింపు సక్రమంగా లేక అసంతృప్తివర్గం పార్టీ నుంచి రాజీనామాలు చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో అధికంగా ఫిరాయింపులు జరుగుతున్నాయి. కాంగ్రెస్లో టికెట్ కేటాయింపులో జరిగిన అసంతృప్తి కారణంగా బందుగాం సమితి ఉపాధ్యక్షురాలు గీతాంజలి పిడికాతోపాటు అనేక మంది రాజీనామా చేసి బిజదలో చేరారు. బిజద విషయానికొస్తే మాజీ ఎమ్మెల్యే కైలాష్ చంద్ర కూల్సేకాకు టికెట్ రాకపోవడంతో భాజపాలో చేరారు. కమలం అభ్యర్థి ఖరారు కాకపోవడంతో కైలాష్ పేరు ప్రకటిస్తారని ఆశిస్తున్నారు. ఇంకా టికెట్ ఇవ్వకముందే భాజపా నేతలు కైలాష్ను వ్యతిరేకించడం ప్రారంభించారు.
స్వతంత్రంగా పోటీ చేసే అవకాశాలు
టికెట్ లభించని అనేక మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి అవకాశాలు కనిపిస్తున్నాయి. పొట్టంగిలో జయరామ్పంగి, సాంబ పంగి, చైతన్య నందివాలి, కొరాపుట్, లక్ష్మీపూర్లో మరికొందరు పోటీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అధిష్ఠానాలు అసంతృప్తి వర్గాలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో కొందరు అంగీకరిస్తుండగా, మరికొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలకు తిరుగుబాట్ల గండం పొంచి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రమాదానికి గురైన విమానం
[ 01-05-2024]
భువనేశ్వర్ నుంచి దిల్లి బయలుదేరిన విమానం ప్రమాదానికి గురైంది. బుధవారం మధ్యహ్నం 1.45 గంటలకు దిల్లి వెళ్లే విస్తార విమానం టేకాఫ్ అయిన పది నిమిషాల్లోనే అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకుని గాలి, వానతో వడగల్లు పడటంతో విమానం రెక్కలు విరిగాయి. -
విభేదాలను దాటి అధికారం ‘చే’ జిక్కించుకుంటారా?
[ 01-05-2024]
అంతర్గత కలహాలు, ముఖ్యనేతల మధ్య సమన్వయ లోపం, అభ్యర్థుల కొరత రాష్ట్రంలో కాంగ్రెస్ను వేధిస్తున్నాయి. ఎన్నికల ముందు, టికెట్ల కేటాయింపు సమయంలో పలువురు నేతలు బిజద, భాజపాల్లో చేరడంతో పార్టీకి దిశా నిర్దేశం చేసేవారి కొరత ఏర్పడింది. -
నామినేషన్ దాఖలు చేసిన నవీన్
[ 01-05-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గంజాం జిల్లా హింజిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. -
మృత్యువుతో పోరాడుతున్న మగుణి
[ 01-05-2024]
తోలు బొమ్మలాటలో దేశవిదేశాల్లో ఖ్యాతి గాంచిన కేంఝర్కి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మగుణి కుహర్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. -
కలిసొచ్చిన స్కూటర్... దూసుకుపోతా రయ్..రయ్
[ 01-05-2024]
వ్యవసాయ శాఖ మంత్రి రాణేంద్ర ప్రతాప్ స్వయిన్కు ప్రతిసారి ఎన్నికల్లో కలిసొస్తున్న స్కూటర్తో ఈసారి ప్రచారం ప్రారంభించారు. -
తండ్రి వెంట..కుమార్తె ప్రచారం ఇంటింట..
[ 01-05-2024]
బారాబటి కటక్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోఫియా ఫిర్దోస్ తండ్రి మహమ్మద్ ముఖింతో కలిసి మంగళవారం ప్రచారం ప్రారంభించారు. -
తెలుగులో పాట... ఓట్ల వేట
[ 01-05-2024]
పూరీ లోక్సభ స్థానానికి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంబిత్ పాత్ర్ మంచి గాయకుడు. తెలుగు, ఒడియా, హిందీ గీతాలు పాడుతుంటారు. -
ఎన్నికల బరి... ఇంతులే మరి
[ 01-05-2024]
జిల్లాలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈ రెండు పార్టీలు నారీమణులను బరిలో దింపి పావులు కదుపుతున్నాయి. -
తొలి ఓటు అనుభూతి పొందండి
[ 01-05-2024]
కొత్తగా ఓటు కార్డు పొందుతున్న యువ ఓటర్లు అందరూ మే 13న జరిగే ఎన్నికల్లో ఓటు వేసి తొలి ఓటు అనుభూతి పొందాలని జిల్లా పాలనాధికారి మనోజ్ సత్యవాన్ మహాజన్ అన్నారు. -
చిట్ఫండ్ బాధితుల విషయమై నవీన్ ఎందుకు మాట తప్పారు?
[ 01-05-2024]
చిట్ఫండ్ బాధితులైన 20 లక్షల మందికి డబ్బు తిరిగి ఇప్పిస్తామన్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎందుకు మాట తప్పారో, బాధితులను ఎందుకు నట్టేట ముంచారో సమాధానం చెప్పాలని భాజపా అధికార ప్రతినిధి సజ్జన్ శర్మ డిమాండ్ చేశారు -
చికిటిలో యాభై వేల మెజార్టీతో గెలిపించాలి: పాండ్యన్
[ 01-05-2024]
బ్రహ్మపుర లోక్సభ, చికిటి అసెంబ్లీ బిజద అభ్యర్థులు భృగు బక్షిపాత్ర్, చిన్మయానంద శ్రీరుప్ దేవ్లను శంఖద్వయం (జొడి శంఖొ) గుర్తుపై ఓటేసి గెలిపించాలని రాష్ట్ర 5టీ అధ్యక్షుడు వి.కార్తికేయ పాండ్యన్ ఓటర్లను కోరారు. నియోజకవర్గం పరిధిలో చికిటిపెంఠొలోని తళొబజారులో మంగళవారం సాయంత్రం ఎన్నికల బహిరంగ సభ నిర్వహించారు. -
జయపురం బరిలో 11 మంది అభ్యర్థులు
[ 01-05-2024]
జయపురం నియోజకవర్గంలో సోమవారం నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. స్వతంత్ర అభ్యర్థి నీలమాధవ బిశోయి నామినేషన్ ఉపసంహరించుకోగా 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బరిలో నిలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
-
ఆ శాస్త్రవేత్త ఆందోళనకు దిగొచ్చిన చైనా సర్కారు
-
అది దేవెగౌడ ప్లానే..: సీఎం సిద్ధరామయ్య
-
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
-
‘వందే మెట్రో’.. ఫస్ట్ లుక్.. విశేషాలివే!
-
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?