logo

‘శ్రేష్ఠ భారత్‌’ ఏర్పాటుకు అంతా సహకరించాలి

‘శ్రేష్ఠ భారత్‌’ లక్ష్యంగా దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలు, అన్ని రంగాల సమగ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ 2024 సంకల్ప పత్రం జారీ చేశారని, ప్రజలంతా సహకరించి, మరోసారి మోదీని ప్రధాని చేసేందుకు ముందుకు రావాలని బ్రహ్మపుర లోక్‌సభ భాజపా అభ్యర్థి ప్రదీప్‌ కుమార్‌ పాణిగ్రహి కోరారు

Published : 19 Apr 2024 01:04 IST

మాట్లాడుతున్న ప్రదీప్‌ పాణిగ్రహి. ఇరువైపులా కె.అనిల్‌ కుమార్‌, సిద్ధాంత్‌ మహాపాత్ర్‌. చిత్రంలో భాజపా జిల్లా నాయకులు
బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ‘శ్రేష్ఠ భారత్‌’ లక్ష్యంగా దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలు, అన్ని రంగాల సమగ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ 2024 సంకల్ప పత్రం జారీ చేశారని, ప్రజలంతా సహకరించి, మరోసారి మోదీని ప్రధాని చేసేందుకు ముందుకు రావాలని బ్రహ్మపుర లోక్‌సభ భాజపా అభ్యర్థి ప్రదీప్‌ కుమార్‌ పాణిగ్రహి కోరారు. గురువారం సాయంత్రం స్థానిక గాంధీనగర్‌లోని పార్టీ ఎన్నికల కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంకల్ప పత్రంలోని వివిధ అంశాలను వివరించిన ఆయన అవన్నీ బ్రహ్మపుర లోక్‌సభ పరిధిలో అమలయ్యేలా చూస్తామన్నారు. విలేకరుల సమావేశంలో బ్రహ్మపుర, దిగపొహండి అసెంబ్లీ నియోజకవర్గాల భాజపా అభ్యర్థులు కె.అనిల్‌్ కుమార్‌, సిద్ధాంత్‌ మహాపాత్ర్‌ తదితరులు మాట్లాడారు. పాతబస్టాండులోని ఓ హోటల్‌ సమావేశ మందిరంలో భాజపా బ్రహ్మపుర లోక్‌సభ నిర్వహణ సమితి సమావేశం మధ్యాహ్నం జరిగింది. పార్టీ రాష్ట్రాధ్యక్షుడు మన్మోహన్‌ సామల్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శారదా శత్పథి, రాష్ట్ర కార్యదర్శి (ఆర్గనైజేషన్‌) మానస్‌ మహంతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని