‘శ్రేష్ఠ భారత్’ ఏర్పాటుకు అంతా సహకరించాలి
‘శ్రేష్ఠ భారత్’ లక్ష్యంగా దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలు, అన్ని రంగాల సమగ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ 2024 సంకల్ప పత్రం జారీ చేశారని, ప్రజలంతా సహకరించి, మరోసారి మోదీని ప్రధాని చేసేందుకు ముందుకు రావాలని బ్రహ్మపుర లోక్సభ భాజపా అభ్యర్థి ప్రదీప్ కుమార్ పాణిగ్రహి కోరారు
మాట్లాడుతున్న ప్రదీప్ పాణిగ్రహి. ఇరువైపులా కె.అనిల్ కుమార్, సిద్ధాంత్ మహాపాత్ర్. చిత్రంలో భాజపా జిల్లా నాయకులు
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: ‘శ్రేష్ఠ భారత్’ లక్ష్యంగా దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలు, అన్ని రంగాల సమగ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ 2024 సంకల్ప పత్రం జారీ చేశారని, ప్రజలంతా సహకరించి, మరోసారి మోదీని ప్రధాని చేసేందుకు ముందుకు రావాలని బ్రహ్మపుర లోక్సభ భాజపా అభ్యర్థి ప్రదీప్ కుమార్ పాణిగ్రహి కోరారు. గురువారం సాయంత్రం స్థానిక గాంధీనగర్లోని పార్టీ ఎన్నికల కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంకల్ప పత్రంలోని వివిధ అంశాలను వివరించిన ఆయన అవన్నీ బ్రహ్మపుర లోక్సభ పరిధిలో అమలయ్యేలా చూస్తామన్నారు. విలేకరుల సమావేశంలో బ్రహ్మపుర, దిగపొహండి అసెంబ్లీ నియోజకవర్గాల భాజపా అభ్యర్థులు కె.అనిల్్ కుమార్, సిద్ధాంత్ మహాపాత్ర్ తదితరులు మాట్లాడారు. పాతబస్టాండులోని ఓ హోటల్ సమావేశ మందిరంలో భాజపా బ్రహ్మపుర లోక్సభ నిర్వహణ సమితి సమావేశం మధ్యాహ్నం జరిగింది. పార్టీ రాష్ట్రాధ్యక్షుడు మన్మోహన్ సామల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శారదా శత్పథి, రాష్ట్ర కార్యదర్శి (ఆర్గనైజేషన్) మానస్ మహంతి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రమాదానికి గురైన విమానం
[ 01-05-2024]
భువనేశ్వర్ నుంచి దిల్లి బయలుదేరిన విమానం ప్రమాదానికి గురైంది. బుధవారం మధ్యహ్నం 1.45 గంటలకు దిల్లి వెళ్లే విస్తార విమానం టేకాఫ్ అయిన పది నిమిషాల్లోనే అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకుని గాలి, వానతో వడగల్లు పడటంతో విమానం రెక్కలు విరిగాయి. -
విభేదాలను దాటి అధికారం ‘చే’ జిక్కించుకుంటారా?
[ 01-05-2024]
అంతర్గత కలహాలు, ముఖ్యనేతల మధ్య సమన్వయ లోపం, అభ్యర్థుల కొరత రాష్ట్రంలో కాంగ్రెస్ను వేధిస్తున్నాయి. ఎన్నికల ముందు, టికెట్ల కేటాయింపు సమయంలో పలువురు నేతలు బిజద, భాజపాల్లో చేరడంతో పార్టీకి దిశా నిర్దేశం చేసేవారి కొరత ఏర్పడింది. -
నామినేషన్ దాఖలు చేసిన నవీన్
[ 01-05-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గంజాం జిల్లా హింజిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. -
మృత్యువుతో పోరాడుతున్న మగుణి
[ 01-05-2024]
తోలు బొమ్మలాటలో దేశవిదేశాల్లో ఖ్యాతి గాంచిన కేంఝర్కి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మగుణి కుహర్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. -
కలిసొచ్చిన స్కూటర్... దూసుకుపోతా రయ్..రయ్
[ 01-05-2024]
వ్యవసాయ శాఖ మంత్రి రాణేంద్ర ప్రతాప్ స్వయిన్కు ప్రతిసారి ఎన్నికల్లో కలిసొస్తున్న స్కూటర్తో ఈసారి ప్రచారం ప్రారంభించారు. -
తండ్రి వెంట..కుమార్తె ప్రచారం ఇంటింట..
[ 01-05-2024]
బారాబటి కటక్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోఫియా ఫిర్దోస్ తండ్రి మహమ్మద్ ముఖింతో కలిసి మంగళవారం ప్రచారం ప్రారంభించారు. -
తెలుగులో పాట... ఓట్ల వేట
[ 01-05-2024]
పూరీ లోక్సభ స్థానానికి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంబిత్ పాత్ర్ మంచి గాయకుడు. తెలుగు, ఒడియా, హిందీ గీతాలు పాడుతుంటారు. -
ఎన్నికల బరి... ఇంతులే మరి
[ 01-05-2024]
జిల్లాలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈ రెండు పార్టీలు నారీమణులను బరిలో దింపి పావులు కదుపుతున్నాయి. -
తొలి ఓటు అనుభూతి పొందండి
[ 01-05-2024]
కొత్తగా ఓటు కార్డు పొందుతున్న యువ ఓటర్లు అందరూ మే 13న జరిగే ఎన్నికల్లో ఓటు వేసి తొలి ఓటు అనుభూతి పొందాలని జిల్లా పాలనాధికారి మనోజ్ సత్యవాన్ మహాజన్ అన్నారు. -
చిట్ఫండ్ బాధితుల విషయమై నవీన్ ఎందుకు మాట తప్పారు?
[ 01-05-2024]
చిట్ఫండ్ బాధితులైన 20 లక్షల మందికి డబ్బు తిరిగి ఇప్పిస్తామన్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎందుకు మాట తప్పారో, బాధితులను ఎందుకు నట్టేట ముంచారో సమాధానం చెప్పాలని భాజపా అధికార ప్రతినిధి సజ్జన్ శర్మ డిమాండ్ చేశారు -
చికిటిలో యాభై వేల మెజార్టీతో గెలిపించాలి: పాండ్యన్
[ 01-05-2024]
బ్రహ్మపుర లోక్సభ, చికిటి అసెంబ్లీ బిజద అభ్యర్థులు భృగు బక్షిపాత్ర్, చిన్మయానంద శ్రీరుప్ దేవ్లను శంఖద్వయం (జొడి శంఖొ) గుర్తుపై ఓటేసి గెలిపించాలని రాష్ట్ర 5టీ అధ్యక్షుడు వి.కార్తికేయ పాండ్యన్ ఓటర్లను కోరారు. నియోజకవర్గం పరిధిలో చికిటిపెంఠొలోని తళొబజారులో మంగళవారం సాయంత్రం ఎన్నికల బహిరంగ సభ నిర్వహించారు. -
జయపురం బరిలో 11 మంది అభ్యర్థులు
[ 01-05-2024]
జయపురం నియోజకవర్గంలో సోమవారం నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. స్వతంత్ర అభ్యర్థి నీలమాధవ బిశోయి నామినేషన్ ఉపసంహరించుకోగా 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బరిలో నిలిచారు.