ప్రధాని పర్యటనకు మూడంచెల భద్రత
బ్రహ్మపుర లోక్సభ నియోజకవర్గం పరిధిలోని నగర శివారున కొణిసి వద్ద 16వ నెంబరు జాతీయ రహదారి సమీపాన సోమవారం ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల బహిరంగ సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
మోదీ ఎన్నికల సభకు ఏర్పాట్లు చేస్తున్న స్థలం
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: బ్రహ్మపుర లోక్సభ నియోజకవర్గం పరిధిలోని నగర శివారున కొణిసి వద్ద 16వ నెంబరు జాతీయ రహదారి సమీపాన సోమవారం ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల బహిరంగ సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ప్రధాని పర్యటనకు మూడంచెల భద్రత ఏర్పాట్లు చేసినట్లు బ్రహ్మపుర ఎస్పీగా బాధ్యతలో ఉన్న డీఐజీ సార్థక్ షడంగి చెప్పారు. ఆదివారం ఆయన సభా ప్రాంగణంలో ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని పర్యటన నేపథ్యంలో ముప్పై పటాలాల బలగాలను మోహరిస్తున్నామని, వివిధ జిల్లాల నుంచి వచ్చిన 150 మందికిపైగా అధికారుల్ని నియమించామని చెప్పారు. హెలీప్యాడ్, సభా ప్రాంగణానికి వంద మీటర్ల దూరంలో ఎలాంటి వాహనాలు, పార్కింగ్ స్థలాలు ఉండకూడదన్నారు. రంఢ కూడలి నుంచి గొళంత్రా వరకూ వాహనాల పార్కింగుకు స్థలాలు గుర్తించామన్నారు. బ్రహ్మపుర వైపు నుంచి సభకు వచ్చేవారు గొళంత్రా మీదుగా గుర్తించిన స్థలంలో వాహనాలు నిలిపి, అక్కడి నుంచి ప్రాంగణానికి నడిచి రావాలని సూచించారు. ఇచ్ఛాపురం (ఆంధ్ర) వైపు నుంచి సభకు వచ్చే వాహనాలను గొళంత్రా, రంఢ మధ్యలో గుర్తించిన పార్కింగ్ స్థలాల్లో ఉంచాలన్నారు. అదనపు ఎస్పీ వీటిని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. సభా ప్రాంగణానికి సమీపంలో రైల్వే లైను ఉందని, ప్రధాని పర్యటన సమయంలో ఇచ్ఛాపురం, బ్రహ్మపుర రైల్వే స్టేషన్ల అధికారులతో సంప్రదిస్తామని ఆయన పేర్కొన్నారు. అదనపు డీజీ (హెడ్క్వార్టర్) పర్యవేక్షణలో గట్టి భద్రత ఏర్పాటు చేశామని డీఐజీ షడంగి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాతకక్షలతో దాడి.. చికిత్స పొందుతూ యువకుడి మృతి
[ 19-05-2024]
పాతకక్షల నేపథ్యంలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
కమలమా.. శంఖమా ?
[ 19-05-2024]
పశ్చిమ ఒడిశాలోని బరగఢ్ లోక్సభ స్థానంలో ఎన్నికల వేడి పెరిగింది. భాజపా, బిజద అభ్యర్థుల మధ్య ముఖాముఖి పోరు నువ్వా? నేనా? అన్న రీతిలో సాగుతోంది. -
రెండోవిడత ప్రచారానికి తెర
[ 19-05-2024]
అస్కా, కొంధమాల్, బొలంగీర్, బరగఢ్, సుందర్గఢ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లో 35 అసెంబ్లీ సెగ్మెంట్లలో సోమవారం (20న) రెండోవిడత పోలింగ్ జరగనుంది -
చివరి రోజు ముమ్మరంగా ప్రచారం
[ 19-05-2024]
గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం, దాని పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారానికి శనివారం చివరి రోజు కావడంతో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు -
ఈసారి కాంగ్రెస్కు అనుకూల ఫలితాలు: సచిన్ పైలెట్
[ 19-05-2024]
ఈసారి దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధిస్తుందన్న ఆశాభావంతో ఉన్నామని ఆ పార్టీ నేత సచిన్ పైలెట్ చెప్పారు. -
ప్రజాహితం కోరే సీఎం అవసరం: భజన్లాల్
[ 19-05-2024]
ఒడిశా ప్రజల హితం కోరే సీఎం రాష్ట్రానికి అవసరమని, నవీన్ ఔట్సోర్సింగ్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్శర్మ చెప్పారు. -
డబుల్ ఇంజిన్ పాలనతో రాష్ట్ర ప్రగతి: అశ్వినీ
[ 19-05-2024]
డబుల్ ఇంజిన్ పాలనతో రాష్ట్ర ప్రగతి తథ్యమని, ప్రధాని మోదీ హయాంలో భారత్ అన్ని రంగాల్లో ముందంజ వేసినట్లు రైల్వే, కమ్యూనికేషన్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. -
పంటను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులదే
[ 19-05-2024]
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించేంతవరకు కాపాడుకోవాల్సిన బాధ్యత రైతన్నలదేనని సహకార సంఘం డిప్యూటీ డైరెక్టర్ మన్మధకుమార్ దాస్ అన్నారు. -
బిజద పక్షానే రాష్ట్ర ప్రజలు: సీఎం
[ 19-05-2024]
ఒడిశాలో ఎన్నికల ప్రచారం చేస్తున్న భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలపై ముఖ్యమంత్రి నవీన్ విమర్శలు గుప్పించారు. -
రాష్ట్రానికి మోదీ, రాజ్నాథ్, అమిత్షాల రాక
[ 19-05-2024]
ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం రాత్రి భువనేశ్వర్ చేరుకోనున్నారు. 9 గంటలకు భాజపా అగ్రనేతలతో ఎన్నికల ప్రచార వ్యూహం, ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
-
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్
-
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
-
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ
-
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?