గుణుపురం... చతుర్ముఖం
రాయగడ జిల్లాలో గుణుపురం నియోజకవర్గం ఎంతో పరిష్టాత్మకం. ఇక్కడ ఇప్పటి వరకూ ఎక్కువసార్లు కాంగ్రెసు అభ్యర్థులే గెలుపొందారు. నియోజకవర్గంలో గమాంగ్లే ఎన్నికవుతూ వస్తున్నారు. ఈసారి కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒకే ఇంటి పేరున్నవారు కావడం గమనార్హం.
గుణుపురం, న్యూస్టుడే
రాయగడ జిల్లాలో గుణుపురం నియోజకవర్గం ఎంతో పరిష్టాత్మకం. ఇక్కడ ఇప్పటి వరకూ ఎక్కువసార్లు కాంగ్రెసు అభ్యర్థులే గెలుపొందారు. నియోజకవర్గంలో గమాంగ్లే ఎన్నికవుతూ వస్తున్నారు. ఈసారి కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒకే ఇంటి పేరున్నవారు కావడం గమనార్హం. నియోజక వర్గంలో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా చతుర్ముఖ పోటీ ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందాలని రఘునాథ్
ఈ ఎన్నికల్లో కూడా గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలని బిజద అభ్యర్థి రఘునాథ్ గమాంగ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా బిజదలో విభేదాలున్నా పార్టీ జిల్లా అధ్యక్ష పగ్గాలు నెక్కంటి భాస్కరావు చేతికి వచ్చిన తరువాత కొంతమేర విభేదాలు సమసిపోయాయి. పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుధీర్దాస్ వర్గం మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నా రఘునాథ్ గమాంగ్ గెలుపు కోసం అంతా కలిసి పని చేస్తున్నారు. రఘునాథ్ గమాంగ్ కూడా అందరితో కలిసిపోయి ప్రచారం చేస్తున్నారు.
కాంగ్రెసుకు వ్యతిరేకంగా భాస్కర జగరంగా
కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా భాస్కర జగరంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన గుడారి సమితిలో పార్టీ అధ్యక్షునిగా ఉండేవారు. అక్కడ, చంద్రపూర్ సమితిలో కూడా పట్టు సాధించారు. కాంగ్రెసు టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. ఫలించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కాంగ్రెసు, బిజద ఓట్లు కూడా ఈయనకు కొంతమేర పోలయ్యే అవకాశం ఉంది.
ఓటు బ్యాంక్ పెంచుకొనే దిశగా అనాసిమి సబర
గుణుపురం నియోజకవర్గంలో సీపీఐఎంఎల్ లిబరేషన్ పార్టీ అభ్యర్థి పోటీలో ఉంటారు. నియోజకవర్గంలో తమ ఓటు బ్యాంక్ పెంచుకోవాలని భావిస్తోంది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆ పార్టీ ముందు వరుసలో ఉంటుంది. ఈసారి ఎన్నికలలో యువకుడైన అనాసిమి సబర పోటీ చేస్తున్నారు. ప్రజల సహకారంతో పోటీలో దిగారు. ఆర్ధికంగా వెనుక బడినా ప్రజలను ప్రత్యక్షంగా కలిసి ఓట్లు అడుగుతున్నారు.
మోదీ ఆదర్శాలతోనే భాజపా ముందుకు
భాజపా అభ్యర్థిగా త్రినాథ్ గమాంగ్ పోటీలో ఉన్నారు. ఆయన 2014 సంవత్సరంలో బిజద అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్రంగా పోటీ చేసి 26 వేల ఓట్లకుపైగా సాధించారు. ఈసారి కూడా బిజద టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. అవకాశం లేకపోవడంతో భాజపాలో చేరారు. పార్టీ టి·కెట్తో ఎన్నికల రంగంలోకి దిగారు. జిల్లాలో భాజపా గెలుపు కోసం జిల్లా పార్టీ అధ్యక్షుడు శివ పట్నాయక్ త్రినాథ్ గెలుపునకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు.
అసంతృప్తుల నడుమ కాంగ్రెసు
గుణుపురం విధానసభ నియోజకవర్గంలో కాంగ్రెసు ఆది నుంచి అసంతృప్తుల నడుమ నడుస్తోంది. ఈసారి గుణుపురం స్థానం గురించి కాంగ్రెసులో ఏడుగురు అభ్యర్థులు దరఖాస్తు చేయగా యువకుడైన సత్యజిత్ గమాంగ్కు పార్టీ టికెట్ ఇచ్చింది. సత్యజిత్ తన మద్దతుదారులతో ప్రచారం చేస్తున్నారు. కొరాపుట్ లోక్సభ అభ్యర్థి సప్తగిరి ఉలక మద్దతు పూర్తిగా ఉండడంతో ఆయన సూచనల ప్రకారం నడుచుకుంటున్నారు. బిజదలోని అసంతృప్త నేతలు నేరుగా కాంగ్రెసుకు మద్దతిస్తున్నారు. ఇది పార్టీకి కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలమా.. శంఖమా ?
[ 19-05-2024]
పశ్చిమ ఒడిశాలోని బరగఢ్ లోక్సభ స్థానంలో ఎన్నికల వేడి పెరిగింది. భాజపా, బిజద అభ్యర్థుల మధ్య ముఖాముఖి పోరు నువ్వా? నేనా? అన్న రీతిలో సాగుతోంది. -
రెండోవిడత ప్రచారానికి తెర
[ 19-05-2024]
అస్కా, కొంధమాల్, బొలంగీర్, బరగఢ్, సుందర్గఢ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లో 35 అసెంబ్లీ సెగ్మెంట్లలో సోమవారం (20న) రెండోవిడత పోలింగ్ జరగనుంది -
చివరి రోజు ముమ్మరంగా ప్రచారం
[ 19-05-2024]
గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం, దాని పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారానికి శనివారం చివరి రోజు కావడంతో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు -
ఈసారి కాంగ్రెస్కు అనుకూల ఫలితాలు: సచిన్ పైలెట్
[ 19-05-2024]
ఈసారి దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధిస్తుందన్న ఆశాభావంతో ఉన్నామని ఆ పార్టీ నేత సచిన్ పైలెట్ చెప్పారు. -
ప్రజాహితం కోరే సీఎం అవసరం: భజన్లాల్
[ 19-05-2024]
ఒడిశా ప్రజల హితం కోరే సీఎం రాష్ట్రానికి అవసరమని, నవీన్ ఔట్సోర్సింగ్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్శర్మ చెప్పారు. -
డబుల్ ఇంజిన్ పాలనతో రాష్ట్ర ప్రగతి: అశ్వినీ
[ 19-05-2024]
డబుల్ ఇంజిన్ పాలనతో రాష్ట్ర ప్రగతి తథ్యమని, ప్రధాని మోదీ హయాంలో భారత్ అన్ని రంగాల్లో ముందంజ వేసినట్లు రైల్వే, కమ్యూనికేషన్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. -
పంటను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులదే
[ 19-05-2024]
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించేంతవరకు కాపాడుకోవాల్సిన బాధ్యత రైతన్నలదేనని సహకార సంఘం డిప్యూటీ డైరెక్టర్ మన్మధకుమార్ దాస్ అన్నారు. -
బిజద పక్షానే రాష్ట్ర ప్రజలు: సీఎం
[ 19-05-2024]
ఒడిశాలో ఎన్నికల ప్రచారం చేస్తున్న భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలపై ముఖ్యమంత్రి నవీన్ విమర్శలు గుప్పించారు. -
రాష్ట్రానికి మోదీ, రాజ్నాథ్, అమిత్షాల రాక
[ 19-05-2024]
ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం రాత్రి భువనేశ్వర్ చేరుకోనున్నారు. 9 గంటలకు భాజపా అగ్రనేతలతో ఎన్నికల ప్రచార వ్యూహం, ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు.