బాలికపై సామూహిక అత్యాచారం: ఐదుగురి అరెస్టు
బ్రహ్మపుర బైద్యనాథపూర్ (బిఎన్.పూర్) ఠాణా పరిధిలో 17 ఏళ్ల బాలికతో మత్తుమందు కలిపిన శీతల పానీయం తాగించి ఆమె మత్తులోకి జారుకోగానే సామూహిక అత్యాచారం జరిపిన సంఘటన తీవ్ర కలకలం రేపింది.
సార్థక్ షడంగి
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: బ్రహ్మపుర బైద్యనాథపూర్ (బిఎన్.పూర్) ఠాణా పరిధిలో 17 ఏళ్ల బాలికతో మత్తుమందు కలిపిన శీతల పానీయం తాగించి ఆమె మత్తులోకి జారుకోగానే సామూహిక అత్యాచారం జరిపిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై బి.ఎన్.పూర్ ఠాణాలో ఈనెల 5న పొక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు రుతున్ కుమార్ దాస్ (22)తోపాటు 19-26 ఏళ్ల వయసు గల మొత్తం అయిదుగురిని అరెస్టు చేసి బుధవారం న్యాయస్థానానికి తరలించినట్లు బ్రహ్మపుర ఎస్పీ బాధ్యతలో ఉన్న డీఐజీ సార్థక్ షడంగి చెప్పారు. మధ్యాహ్నం బ్రహ్మపుర ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఆ వివరాలు వెల్లడించారు.
నమ్మించి.. గదికి తీసుకువెళ్లి..
ప్రైవేటు విద్యాసంస్థలో ప్లస్టు చదువుతున్న బాలిక ఈ నెల 3న స్నేహితురాలిని కలిసేందుకు స్థానిక హిల్పట్నాలోని ఆమె ఇంటికి వచ్చింది. అక్కడ కొంతసేపు గడిపిన తర్వాత బాలిక ఇంటికి బయలుదేరేందుకు తండ్రికి ఫోను చేసి హిల్పట్నా రోడ్డులో నిరీక్షించింది. అదే సమయంలో అటుగా వచ్చిన రుతున్ దాస్ బాలికను చూశాడు. వీరిద్దరికీ అంతకు ముందే ముఖ పరిచయడం ఉండడంతో కొత్తబస్టాండు ప్రాంతంలోని తన ఇంటికి వెళదామని, అక్కడి నుంచి ఇంటివారికి ఫోను చేస్తే, వారు వచ్చి తీసుకెళతారని నమ్మించాడు. తన ద్విచక్ర వాహనంపై కొత్త బస్టాండు ప్రాంతంలో ఉంటున్న గదికి తీసుకువెళ్లాడు. అక్కడ ఉండడం ఇష్టం లేని బాలిక ఇంటికి వెళ్లిపోతానని చెప్పడంతో అమ్మను పిలుచుకువస్తానని, ఈలోగా శీతల పానీయం తాగమని (అప్పటికే అందులో మత్తు పదార్థం కలిపారు) బాలికను ఇచ్చాడు. అది తాగిన బాధితురాలు స్పృహతప్పి పడిపోయింది. దీంతో రుతున్తోపాటు ఆయన స్నేహితులు మరో నలుగురు ఆమెపై అత్యాచారం చేశారు. మత్తు వల్ల బాలిక ప్రతిఘటించలేకపోయింది. రాత్రి 10 గంటల సమయంలో ఆమెకు స్పృహ రావడంతో ఆమెను బెజ్జిపురం సంతోషిమాత మందిర ప్రాంతంలో వదిలి, విషయం ఎవరికైనా చెబితే హతమారుస్తామని రుతున్ బెదిరించాడు. రెండు రోజుల తర్వాత ఈ నెల 5న బాధితురాలు బి.ఎన్.పూర్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఐదుగురు యువకుల్ని అరెస్టు చేశామని, నిందితులు, బాలికకు వైద్య పరీక్షలు చేయించామని డీఐజీ షడంగి తెలిపారు. ఈ ఘటనలో ఇంకెందరి ప్రమేయముంది? ఇతరత్రా అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
[ 19-05-2024]
రాయగడ జిల్లా కాసిపూర్ సమితి పరిధిలో విద్యార్థుల మృతి ఘటనలకు సంబంధించి నలుగురు ఉపాధ్యాయులను విధుల నుంచి సస్పెండ్ చేశారు. -
పాతకక్షలతో దాడి.. చికిత్స పొందుతూ యువకుడి మృతి
[ 19-05-2024]
పాతకక్షల నేపథ్యంలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
కమలమా.. శంఖమా ?
[ 19-05-2024]
పశ్చిమ ఒడిశాలోని బరగఢ్ లోక్సభ స్థానంలో ఎన్నికల వేడి పెరిగింది. భాజపా, బిజద అభ్యర్థుల మధ్య ముఖాముఖి పోరు నువ్వా? నేనా? అన్న రీతిలో సాగుతోంది. -
రెండోవిడత ప్రచారానికి తెర
[ 19-05-2024]
అస్కా, కొంధమాల్, బొలంగీర్, బరగఢ్, సుందర్గఢ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లో 35 అసెంబ్లీ సెగ్మెంట్లలో సోమవారం (20న) రెండోవిడత పోలింగ్ జరగనుంది -
చివరి రోజు ముమ్మరంగా ప్రచారం
[ 19-05-2024]
గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం, దాని పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారానికి శనివారం చివరి రోజు కావడంతో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు -
ఈసారి కాంగ్రెస్కు అనుకూల ఫలితాలు: సచిన్ పైలెట్
[ 19-05-2024]
ఈసారి దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధిస్తుందన్న ఆశాభావంతో ఉన్నామని ఆ పార్టీ నేత సచిన్ పైలెట్ చెప్పారు. -
ప్రజాహితం కోరే సీఎం అవసరం: భజన్లాల్
[ 19-05-2024]
ఒడిశా ప్రజల హితం కోరే సీఎం రాష్ట్రానికి అవసరమని, నవీన్ ఔట్సోర్సింగ్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్శర్మ చెప్పారు. -
డబుల్ ఇంజిన్ పాలనతో రాష్ట్ర ప్రగతి: అశ్వినీ
[ 19-05-2024]
డబుల్ ఇంజిన్ పాలనతో రాష్ట్ర ప్రగతి తథ్యమని, ప్రధాని మోదీ హయాంలో భారత్ అన్ని రంగాల్లో ముందంజ వేసినట్లు రైల్వే, కమ్యూనికేషన్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. -
పంటను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులదే
[ 19-05-2024]
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించేంతవరకు కాపాడుకోవాల్సిన బాధ్యత రైతన్నలదేనని సహకార సంఘం డిప్యూటీ డైరెక్టర్ మన్మధకుమార్ దాస్ అన్నారు. -
బిజద పక్షానే రాష్ట్ర ప్రజలు: సీఎం
[ 19-05-2024]
ఒడిశాలో ఎన్నికల ప్రచారం చేస్తున్న భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలపై ముఖ్యమంత్రి నవీన్ విమర్శలు గుప్పించారు. -
రాష్ట్రానికి మోదీ, రాజ్నాథ్, అమిత్షాల రాక
[ 19-05-2024]
ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం రాత్రి భువనేశ్వర్ చేరుకోనున్నారు. 9 గంటలకు భాజపా అగ్రనేతలతో ఎన్నికల ప్రచార వ్యూహం, ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు