వస్తున్నాయ్.. పాఠ్యపుస్తకాలు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు చేరుకుంటున్నాయి. 2023-24 విద్యా సంవత్సరానికి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాకు (34 మండలాలు ప్రాతిపదికన) సంబంధించి మొదటి సెమిస్టర్లో సుమారు 13.18 లక్షల పాఠ్యపుస్తకాలు జిల్లాలకు చేరాయి.
ఉమ్మడి జిల్లాకు 13.18 లక్షలు సరఫరా
మన్యం జిల్లా ఘటనతో విద్యాశాఖలో కదలిక
న్యూస్టుడే, విజయనగరం విద్యావిభాగం
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు చేరుకుంటున్నాయి. 2023-24 విద్యా సంవత్సరానికి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాకు (34 మండలాలు ప్రాతిపదికన) సంబంధించి మొదటి సెమిస్టర్లో సుమారు 13.18 లక్షల పాఠ్యపుస్తకాలు జిల్లాలకు చేరాయి. పాఠశాలలు తెరిచే లోపు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పుస్తకాల సరఫరా విషయంలో పార్వతీపురం మన్యం జిల్లా ఘటనతో ప్రభుత్వం అప్రమత్తం కావడంతో విద్యాశాఖలో కదలిక తీసుకొచ్చింది.
గతేడాది పరిస్థితి..
2022-23 విద్యా సంవత్సరంలో మే నుంచి ఫిబ్రవరి వరకూ పుస్తకాలు సరఫరా చేశారు. ఎనిమిదో తరగతి సిలబస్ మార్పు చేయడంతో పుస్తకాలు ఆలస్యంగా వచ్చాయి. 9, 10 మినహాయిస్తే ఇతర తరగతులకు మూడు సెమిస్టర్లుగా పుస్తకాలు అందించాలి. షెడ్యూల్ ప్రకారం పుస్తకాలు రాకపోవడంతో కొద్దిరోజులు విద్యార్థులు తరగతి గదిలో బోధనకే పరిమితం కావాల్సి వచ్చింది. చాలా మంది విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ విద్యలో ప్రవేశాలు పొందడంతో కొన్ని సబ్జెక్టుల్లో పుస్తకాల కొరతతో ఎంఈవోల ద్వారా ఇండెంట్ మేరకు తెప్పించి ఇవ్వడంతో జాప్యం చోటుచేసుకుంది.
జరిగింది ఇదీ..
విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ గత నెల మన్యం జిల్లాలోని పాఠశాలలను సందర్శించారు. వీరఘట్టం కేజీబీవీకి గణితం రెండో సెమిస్టర్ పుస్తకాలు అందించకపోవడాన్ని గుర్తించారు. పాలకొండ మండలం కొండాపురంలో విద్యార్థుల ఇళ్లకు వెళ్లిన ఆయన నోట్ పుస్తకాలు, వర్క్బుక్ ఖాళీగా ఉండడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి, కొందరిపై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో వీరికి మద్దతుగా ఉపాధ్యాయులు ఆందోళనలు నిర్వహించారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాఠ్యపుస్తకాలు ఇవ్వకపోతే పిల్లలు ఎలా చదువుతారు? ఇవ్వడం అధికారుల బాధ్యత కాదా..? అంటూ ప్రశ్నించారు. రానున్న ఏడాది జూన్లోనే పుస్తకాలిస్తామని చెప్పారు.
ప్రైవేటు మాటేమిటో..?
గతేడాది తొలిసారిగా ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వమే పాఠ్య పుస్తకాలను సరఫరా చేసింది. పాఠశాలలు తెరిచే వరకు యాజమాన్యాలు ఇండెంట్ పెట్టకపోవడంతో పుస్తకాలు కొంత ఆలస్యమయ్యాయి. విద్యార్థుల నుంచి పుస్తకాల కోసం ముందుగానే డబ్బులు వసూలు చేయడంతో తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ ఏడాది ప్రభుత్వమే సరఫరా చేస్తుందా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదని అధికారులు పేర్కొంటున్నారు.
ఇక రెండు సెమిస్టర్లే..
ఈ ఏడాది నుంచి పాఠ్యపుస్తకాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మూడు సెమిస్టర్లుగా ఉన్నవి రెండుగా రూపొందించారు. 1-8 తరగతుల పుస్తకాల్లో తెలుగు, ఆంగ్లం రెండు మాధ్యమాలు ఉండేలా గతేడాదే ముద్రించారు.ఈ ఏడాది తొమ్మిదో తరగతి పుస్తకాల్లో రెండు మాధ్యమాలు పొందుపర్చినట్లు అధికారులు తెలిపారు.పదో తరగతి పుస్తకాలు పాత విధానంలో రెండు మాధ్యమాలు వేర్వేరుగా ఉంటాయి.
జేవీకే పాయింట్లకు తరలించాం..
- ఉమారాణి, ప్రబంధకురాలు, పాఠ్యపుస్తక విభాగం కేంద్రం, విజయనగరం జిల్లా
ఈ ఏడాది విద్యాశాఖ ప్రణాళికతో ముందుకెళుతోంది. ప్రవేశాలు పెరిగితే అయిదుశాతం బఫర్ స్టాక్ కింద పుస్తకాలు ఉంటాయి. డీఈవో అనుమతితో వీటి నుంచి అందజేస్తాం. జిల్లాలకు వచ్చిన పుస్తకాల్లో ఒక విడత జగనన్న విద్యా కానుక (జేవీకే) పాయింట్ల వద్దకు తరలించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు సంద్రం
[ 26-04-2024]
సాలూరు పట్టణంలోని జాతీయ రహదారి పసుపు సంద్రంగా మారింది. కూటమి అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి గురువారం ఎన్నికల నామపత్రం సమర్పించి, ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
మామయ్య రాసిన మరణ శాసనం
[ 26-04-2024]
‘అక్క.. చెల్లెమ్మకు అండగా మీ అన్న జగన్ ఉన్నాడు. మీ పిల్లల బాధ్యతను మేనమామగా తీసుకుంటా’ అంటూ ఎన్నికల ముందు, తర్వాత అనేక సందర్భాల్లో సీఎం పలికిన ప్రగల్భాలివి. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి