అందరూ నన్ను తిట్టుకుంటే.. మీరు ఓట్లు దండుకుంటారా..
ఒకటా.. రెండా.. 26 నెలలుగా నన్ను ఏ ఒక్క నాయకుడూ నన్ను పట్టించుకున్న పాపాన పోలేదు. నాపై రాళ్లు తేలి.. గుంతలుగా మారడంతో ఎందరో ప్రయాణికులు అదుపుతప్పి నన్నే తిట్టుకున్నారు.
న్యూస్టుడే, వీరఘట్టం: ఒకటా.. రెండా.. 26 నెలలుగా నన్ను ఏ ఒక్క నాయకుడూ నన్ను పట్టించుకున్న పాపాన పోలేదు. నాపై రాళ్లు తేలి.. గుంతలుగా మారడంతో ఎందరో ప్రయాణికులు అదుపుతప్పి నన్నే తిట్టుకున్నారు. వీరఘట్టం అంత చెత్త రోడ్డును ఎక్కడా చూడలేదని, ఇంత దరిద్రంగా ఉందని తిడుతుంటే నాలో నేను కుమిలి పోయా. నన్ను బాగు చేయకపోతారా అని ఎదురు చూసినా ఎవరూ శ్రద్ధ చూపకపోవడంతో కుంగిపోయా.
2022లో ఫిబ్రవరిలో హడావుడిగా భూమి పనులు చేస్తే మంచి రోజులు వచ్చాయని సంతోషపడ్డాను. నా మీదుగా ఒడిశాతో పాటు శ్రీకాకుళం జిల్లా, మన్యంలో 65 గ్రామాల ప్రజలు సంతోషంగా వెళ్తారని భావించి ఆనందపడ్డాను. కానీ అది కొన్ని రోజులకే పరిమితమైంది. ఎప్పుడు పని ఆగుతుందో.. ఎప్పుడు జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యా. నన్ను విస్తరించేందుకు ఎందరో ఇళ్లను కూలగొట్టడంతో వారంతా బతుకులు కోల్పోతే కన్నీళ్లు పెట్టా. అయినా వారు వలస బాట పడుతూ ఎన్నో తిట్టుకున్నారు. నాపై దుమ్ము, ధూళి రేగి దుకాణాలు, వాహనదారుల కళ్లలో పడి అనారోగ్యానికి గురై శాపనార్థాలు పెట్టారు. పనులు ప్రారంభించింది మొదలు ఇప్పటివరకు ఎన్నో తిట్లు, అవమానాలను భరిస్తూ వచ్చా. ఇన్ని నెలలు నన్ను పట్టించుకోకుండా వదిలేసిన మీరు.. ఓట్ల కోసం ఇటీవల నా అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఇలా నన్ను వాడుకొని ఓట్లు దండుకోవాలని చూస్తారని ఏనాడు ఊహించలేదు. ఓ వైపు బాగు పడుతున్నా.. మీ దుర్భుద్ధిని చూసి బాధ పడుతున్నా.
ఇట్లు, మీ వీరఘట్టం రోడ్డు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డు ప్రమాదంలో కుమారుడి దుర్మరణం
[ 21-05-2024]
ఇంటికి పెద్ద దిక్కు అయిన కుమారుడు తన కళ్లెదుటే రక్తపు మడుగులో ఉండటాన్ని చూసి ఆ తల్లి గుండె తల్లడిల్లింది. -
ముట్టుకుంటే కూలిపోతాయ్..పట్టుకుంటే పగిలిపోతాయ్!!
[ 21-05-2024]
ఈ అందమైన, అద్భుతమైన నిర్మాణాలన్నీ ఎక్కడనుకుంటున్నారా.. విజయనగరం మండలం గుంకలాంలోని జగనన్న కాలనీలో పేదల కోసం ప్రభుత్వం కడుతున్న ఇళ్లు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో నివాసముండే దాదాపు 12 వేల మందికి పైగా ఇక్కడ పట్టాలిచ్చారు. -
సర్దుబాటు.. ఉన్న వారిపై పనిపోటు
[ 21-05-2024]
కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రాన్ని ఏపీఐఐసీ భవనంలో ఆర్భాటంగా ఏర్పాటు చేసేశారు. రెండేళ్లు అవుతున్నా పక్కా భవనానికి నోచుకోలేదు. పరాయి పంచనే కొనసాగుతోంది. -
అమ్మ కదిలింది..సంబరమొచ్చింది
[ 21-05-2024]
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పైడితల్లి దేవరోత్సవం సోమవారం సందడిగా జరిగింది. సాయంత్రం 4.30 గంటలకు ఆలయ సహా -
నేడు జంట సిరిమానోత్సవాలు
[ 21-05-2024]
బొబ్బిలి పట్టణంలోని పాతబొబ్బిలి, గొల్లపల్లిలో జంట పండగలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. -
గండె లయ తప్పుతోంది..!
[ 21-05-2024]
గతేడాది విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు పోలీసులు అనారోగ్యంతో చనిపోయారు. ఈ నేపథ్యంలో నాలుగు నెలల కిందట ఎస్పీ దీపిక ఎం.పాటిల్ వైద్య శిబిరం నిర్వహించగా.. 1400 మంది సిబ్బంది పాల్గొన్నారు. -
ఓట్ల లెక్కింపునకు..1043 మంది సిబ్బంది
[ 21-05-2024]
జూన్ నాలుగో తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయం, లెండి కళాశాలల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయని జిల్లా రెవెన్యూ అధికారిణి ఎస్.డి.అనిత తెలిపారు. -
ఇంటర్ విద్య కలేనా?
[ 21-05-2024]
జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలల నుంచి పదో తరగతి పరీక్షలకు 10,443 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 10,064 మంది పాసయ్యారు. -
పట్టణ రైతులకూదీ భరోసా!
[ 21-05-2024]
పట్టణ ప్రాంత రైతులు ఖరీఫ్, రబీ పంటల సాగుకు విత్తనాలు, ఎరువుల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. -
కట్టండి.. మీ ఇంటి అప్పు
[ 21-05-2024]
పేదల సొంతింటి కల నెరవేరుస్తాం.. ప్రతి ఒక్కరికీ రూ.10 లక్షల విలువ చేసే గూడు అప్పగిస్తాం. అప్పుల భారం లేకుండా చూస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది.