logo

9న చీపురుపల్లికి చంద్రబాబు

ఎన్నికల ప్రచారంలో భాగంగా చీపురుపల్లిలో 9న ప్రజాగళం భారీ బహిరంగ  సభకు తెదేపా అధినేత చంద్రబాబు హాజరు కానున్నట్లు తెదేపా విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెలిపారు.

Published : 07 May 2024 04:55 IST

విజయనగరంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న నాగార్జున, అదితి గజపతిరాజు
చీపురుపల్లి, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రచారంలో భాగంగా చీపురుపల్లిలో 9న ప్రజాగళం భారీ బహిరంగ  సభకు తెదేపా అధినేత చంద్రబాబు హాజరు కానున్నట్లు తెదేపా విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెలిపారు. సాయంత్రం 4 గంటలకు విజయనగరం- పాలకొండ ప్రధాన రహదారిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ఏర్పాటు చేయనున్న సభా స్థలాన్ని పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు. ఆంజనేయపురంలో హెలీప్యాడ్‌ స్థలాన్ని చూశారు. నాగార్జున మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. నాయకులు రౌతు కామునాయుడు, దన్నాన రామచంద్రుడు, మహంతి అప్పలనాయుడు, శనపతి శ్రీనివాసరావు, రౌతు నారాయణరావు, దన్నాన సూరపునాయుడు, గంట్యాడ సత్యనారాయణ, మీసాల కాశీ పాల్గొన్నారు.  

నేడు నగరానికి లోకేశ్‌ రాక

 విజయనగరం అర్బన్‌: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మంగళవారం విజయనగరం రానున్నారు. సాయంత్రం 4 గంటలకు అయోధ్య మైదానంలో జరిగే యువగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. సంబంధిత ఏర్పాట్లను సోమవారం విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, రాష్ట్ర పరిశీలకుడు శ్రీనివాస్‌రెడ్డి, కూటమి విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థిని అదితి గజపతిరాజు పరిశీలించారు. నియోజకవర్గ నాయకులు రాజేష్‌బాబు, అనూరాధ బేగం, మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని