అలక వీడని చినుకు
ఈసారి 5 మండలాల్లో మాత్రమే సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదైంది. రాచర్లలో 51, బేస్తవారపేట 40, గిద్దలూరులో 35 శాతం ఎక్కువగా కురిసింది. సెప్టెంబర్ ఆదుకుంటుందని రైతులు వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి
14 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం
ఒంగోలు నగరం, న్యూస్టుడే
త్రిపురాంతకం మండలం అన్నసముద్రంలో దెబ్బతిన్న జొన్న
ఈసారి 5 మండలాల్లో మాత్రమే సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదైంది. రాచర్లలో 51, బేస్తవారపేట 40, గిద్దలూరులో 35 శాతం ఎక్కువగా కురిసింది. సెప్టెంబర్ ఆదుకుంటుందని రైతులు వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. అరకొర వర్షపు జల్లులు తప్ప చెరువులు, దొరువులు నిండటంలేదు.
ఖరీఫ్ కాలం ఈనెలాఖరుతో ముగిసిపోతుంది. పంటలు వేసిన రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మండు వేసవిని తలపిస్తున్న వాతావరణం వారిని కలవరపరుస్తోంది. పెట్టుబడి ఖర్చులకైనా దిగుబడులు వస్తాయా లేదా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెలలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో కంది, మొక్కజొన్న, మిరప, మినుము, జొన్న, సజ్జ పంటలు గిడసబారిపోతున్నాయి. జిల్లాలో 38 మండలాలకు గాను 14 మండలాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. సాగర్ నీరు ఆగస్టులో విడుదల చేసినా ఆయకట్టు చివరి భూములకు అందడంలేదు. తాళ్లూరు మండలంలో కాలువ చివరి భూముల్లో మొక్కజొన్న, కంది పంటలు అధికంగా వేశారు. వీరికి ఈ నీరు రాకపోగా వరుణుడు ముఖం చాటేశాడు. కంకి దశలోకి వచ్చిన మొక్కజొన్న దెబ్బతింది.
తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలెంలో ఎండిపోతున్న మొక్కజొన్న
ఈ నెలలో 105.4 మి.మీ సాధారణ వర్షపాతం నమోదుకావల్సి ఉండగా ఇప్పటివరకు 77.8 మి.మీ. కురిసింది.
తాళ్లూరులో అత్యల్పం.. జిల్లాలో తాళ్లూరు మండలంలో అత్యల్ప వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ సీజన్లో 376.8 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 159.3 మిల్లీమీటర్లు (57శాతం) తక్కువ నమోదైంది. తరువాత యర్రగొండపాలెంలో 358 మి.మీ.కు గాను 185.7, అర్థవీడు మండలంలో 346.6 మి.మీ లకు 220.6 (36 శాతం తక్కువ) కురిసింది.
కంది 62 శాతానికే: ఖరీఫ్ కాలం ముగిసి అక్టోబర్ 1 నుంచి రబీ పంటల లెక్కలు ప్రారంభమవుతాయి. వరి సాగును మాత్రం అక్టోబర్ 15 వరకు ఖరీఫ్ కింద లెక్కిస్తారు. వరి, పొగాకు బదులు పప్పుధాన్య పంటలు సాగుచేయాలని వ్యవసాయశాఖ సూచించింది. ఈసారి పంటల సరళిలో కొంత మార్పు జరిగింది. మినుము పంట గత ఏడాది దెబ్బతినడంతో ఇపుడు బాగా తగ్గిపోయింది. దీని సాధారణ విస్తీర్ణం 3,300 హెక్టార్లకు గాను 807 హెక్టార్లలోనే సాగయింది. దానికి బదులు మొక్కజొన్న సాధారణం కన్నా 208 శాతం అధికంగా సాగులోకి వచ్చింది. అత్యధికంగా సాగయ్యే కంది ఈసారి 62 శాతానికి పరిమితమైంది. 85 వేల హెక్లార్లు సాధారణం కాగా, 52,500 హెక్టార్లతో ఆగిపోయింది. వరికి మినహా ఇతర సాధారణ పంటలకు అదను దాటిపోయినట్లు రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం వేసిన పంటలు కోలుకోవాలంటే ఎండలు తగ్గుముఖం పట్టి వర్షాలు కురవాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం