ఆహ్లాదం ఆవిరి
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది.
వైకాపా పాలనలో నిర్వహణకు నోచుకోని పార్కులు
త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్టుడే: త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు, కుటుంబసమేతంగా సేద తీరేందుకు గత ప్రభుత్వం రూ.పది లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో పలు వసతులతో కూడిన ఉద్యానవనం నిర్మించింది. ఆట వస్తువులు, దేవతా మూర్తుల విగ్రహాలతో పాటు పూల మొక్కలు, లాన్ ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దింది. నడక ట్రాక్, నిర్వహణకు ఒకర్ని నియమించారు. పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు దీనిని ఉపయోగించుకున్నారు. సాయంత్రం విద్యార్థులు, తల్లిదండ్రులు పిల్లలతో కలిసి వచ్చి సేద తీరేవారు. ఆటలు ఆడేవారు. ప్రభుత్వం మారగానే నిర్వహణన గాలికి వదిలేశారు. దీంతో ఉద్యానం విధ్వంసమైంది. అధికారులు పట్టించుకోనందున పూల మొక్కలు, లాన్ పాడయ్యాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల ఉద్యానం పనికి రాకుండా పోయిందని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఆహ్లాదం పంచే ఉద్యానం నేడు బీడుగా మారింది. ఎక్కడ చూసినా ఎండిపోయిన చెట్లు దర్శనమిస్తున్నాయి. మొక్కలకు నీరు పెట్టేందుకు ఏర్పాటు చేసిన డ్రిప్లు పాడైపోయాయి. వైకాపా పాలనలో నిర్మించకపోయినా ఉన్నదాన్ని పాడు చేశారని ప్రజలు అంటున్నారు.
అప్పట్లో అందరికీ ఉపయోగపడింది
-గిలకా పెద్దన్న, గొల్లవాండ్లపల్లి, త్రిపురాంతకం మండలం
విలేజ్ పార్కు మా గ్రామానికి ఎంతో కళ తెచ్చిపెట్టింది. మా పరిసర గ్రామాల పిల్లలు తల్లిదండ్రులతో వచ్చి సేద తీరేవారు. పిల్లలు ఆడుకునేందుకు అన్ని రకాల ఆట వస్తువులు ఉండేవి. పలు రకాల చెట్లతో ఎంతో సుందరంగా ఉండేది. కాలి నడకకు ట్రాక్లు కూడా నిర్మించారు.ఐదేళ్ల క్రితం వరకు ఎంతో ఆహ్లాదంగా ఉండే పార్కు ఆ తర్వాత పట్టించుకున్న నాధుడే కరవయ్యారు. దీంతో పచ్చగా ఉండే చెట్లు ఎండిపోవడంతో పాటు పార్కు ఆనవాళ్లు లేకుండా పోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ చేతిలో జనం బికారులు.. వైకాపా భక్షణ చట్టంపై జనాగ్రహం
[ 05-05-2024]
జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం (టైటిలింగ్ యాక్ట్-2022)పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
కూటమిదే పక్కా విజయం
[ 05-05-2024]
‘సభకు వచ్చిన జనం చూపుతున్న ఉత్సాహం.. యువత, మహిళల కేరింతలు చూస్తుంటే దర్శిలో మన విజయం పక్కా అని తేలిపోయింది. ఈ సారి కచ్చితంగా తెదేపా జెండా ఎగరేస్తాం. -
పోలింగ్కు ఇదేం సన్నద్ధత!
[ 05-05-2024]
తపాలా ఓటింగ్ మొదటి రోజైన శనివారం జిల్లాలో పలు చోట్ల అధికారులు నిర్లిప్తంగా వ్యవహరించారు. ఒంగోలు డీఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాలలోని సగం కేంద్రాల్లో గెజిటెడ్ అధికారులు అందుబాటులో లేరు. -
జగన్ రాసిన మరణ శాసనం
[ 05-05-2024]
అయిదేళ్ల క్రితం వచ్చిన ఆ పాద యాత్రికుడు అక్కడి వారిపై అమృతం కురిపించారు..జీవచ్ఛవాల్లా ఉన్న కనిగిరివాసులకు ఊరడించారు..ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమికొడతానన్నారు. -
11న ఒంగోలుకు చంద్రబాబు
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 11న తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంగోలు రానున్నారు. -
తెదేపా గూటికి వైకాపా సర్పంచి
[ 05-05-2024]
పొన్నలూరు మండలంలో సైకిల్ జోరు మీదుంది. మండలంలోని కె.అగ్రహారం గ్రామ సర్పంచి షేక్ చిన్న మస్తాన్ శుక్రవారం రాత్రి దామచర్ల సత్య సమక్షంలో తెదేపాలో చేరారు. -
పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలి
[ 05-05-2024]
పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
కొత్తపట్నంలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కొత్తపట్నం మండలం రెడ్డిపాలెం, కె.పల్లెపాలెం, ఈతముక్కలలోని పోలింగ్ కేంద్రాలను శనివారం జిల్లా పోలీసు పరిశీలకులు హసిబ్ ఉర్ రెహమాన్ పరిశీలించారు. -
చట్టం ముసుగులో దోపిడీకి జగన్ కుట్ర
[ 05-05-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఆస్తులు, భూములకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంతో పాటు జిల్లాలోని మార్కాపురం పశ్చిమ ప్రాంతంలో రైతులకు చెందిన భూములు, పట్టా భూములను పట్టపగలే ఆక్రమణ చేసుకోని కబ్జా చేస్తున్న, చేసిన ఉదంతాలు అనేకం ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..