logo

జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు

సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్‌ కుమార్‌ చౌరాసియా(ఐఏఎస్‌, 2012 బ్యాచ్‌, ఉత్తరప్రదేశ్‌ క్యాడర్‌) జిల్లాకు వచ్చారు.

Published : 26 Apr 2024 04:46 IST

 

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్‌ కుమార్‌ చౌరాసియా(ఐఏఎస్‌, 2012 బ్యాచ్‌, ఉత్తరప్రదేశ్‌ క్యాడర్‌) జిల్లాకు వచ్చారు. దర్శి, ఒంగోలు, కొండపి, మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిశీలకునిగా వ్యవహరించనున్నారు. ప్రతి రోజూ ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఒంగోలులోని ఎన్నెస్పీ అతిథి గృహంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు, సమస్యలు ఏమైనా ఉంటే తనను సంప్రదించాలని ఆయన గురువారం ఒక ప్రకటనలో సూచించారు. ఏదైనా సమస్యలపై చరవాణి నం: 92810 34505కు కూడా ఫోన్‌ చేయవచ్చని తెలిపారు. ఆయనతో పాటు, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గాలకు నియమితులైన సాధారణ పరిశీలకుడు మయూర్‌ కె.మెహతా(2014 ఐఏఎస్‌ బ్యాచ్‌) గురువారం ఉదయం ప్రకాశం భవన్‌లో కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని