ఎన్నికల వేళ.. చిల్లర పనులు
గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు.
అయిదేళ్లుగా గుత్తేదారులకు బకాయిలు
‘కోడ్’ కూశాక అనుయాయులకు చెల్లింపులు
ఈనాడు, ఒంగోలు: గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేసినప్పటికీ ఇదే పరిస్థితి. ఈ పరిణామాలతో గుత్తేదారులు బెంబేలెత్తిపోయారు. పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త పనులు చేపడతామని పలుసార్లు స్పష్టం చేశారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోయింది. దీంతో కొందరు గుత్తేదారులు కోర్టును ఆశ్రయించి బిల్లులు పొందారు. ఇదిలా ఉంటే ఎన్నికల వేళ తిర‘కాసు’ వ్యవహారానికి తెర లేపింది. తన అనుయాయులకు లబ్ధి చేకూర్చేలా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక బిల్లుల చెల్లింపునకు చర్యలు చేపట్టింది.
అందరికీ కాదు.. కొందరికే...: జిల్లాలో 2020-23లో పశ్చిమ ప్రకాశంలోని కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి ప్రాంతాలతో పాటు ఒంగోలు, సంతనూతలపాడు తదితర నియోజకవర్గాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేశారు. ఇందుకుగాను గుత్తేదారులకు రూ.139 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. ఎన్నికలు సమీపించడంతో గతేడాది చివరిలో రూ.100 కోట్లు వరకు చెల్లించారు. మిగిలిన బకాయిలకు సంబంధించిన బిల్లులను జిల్లా అధికారులు సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేశారు. దీంతో బకాయిలు వస్తాయని అంతా ఆశపడ్డారు. ఇక్కడే వైకాపా ప్రభుత్వం తన దుర్బుద్ధిని చాటుకుంది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఈ నెల 23, 24 తేదీల్లో కొన్ని జీవోలు తెచ్చింది. తమ అనుయాయులకు కొంతవరకు బకాయిలు చెల్లించింది. కోడ్ అమల్లోకి వచ్చాక స్క్రీనింగ్ కమిటీ ఆమోదం లేకుండా బిల్లుల చెల్లింపు విమర్శలకు దారి తీసింది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ ఎత్తుగడ అంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.
అరకొరగా ఇవ్వడంపై ఆగ్రహం...: జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్తో పాటు, మార్కాపురం మున్సిపాలిటీ, కనిగిరి, గిద్దలూరు, పొదిలి, చీమకుర్తి, దర్శి నగర పంచాయతీలున్నాయి. వీటి పరిధిలో ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలిన గుత్తేదారులకు కూడా బిల్లుల బకాయిలున్నాయి. వీటి చెల్లింపునకు ఇంతకాలం వైకాపా పాలకులకు మనసు రాలేదు. ఎన్నికల సమయంలో మాత్రం మేల్కొన్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో తెచ్చిన జీవోల ప్రకారం అరకొర చెల్లింపులు చేపట్టారు. 2020-21 సంవత్సరానికి సంబంధించి కనిగిరి నగర పంచాయతీకి రూ.8.75 కోట్ల బిల్లులు బకాయిలున్నాయి. ఇందులో ఇప్పుడు రూ.4.75 కోట్లు చెల్లించింది. మార్కాపురం మునిసిపాలిటీలో రూ.3 కోట్లు, పొదిలి నగర పంచాయతీలోనూ పాత బకాయిల చెల్లింపునకు ఉత్తర్వులిచ్చినా.. నిధులు ఇంకా విడుదల కాలేదు. అయిదేళ్ల తర్వాత కూడా అరకొరగా చెల్లించడంపై పలువురు గుత్తేదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
[ 27-04-2024]
పేరుకే పోలీసులు. నిత్యం వైకాపాకు వంతపాడుతుంటారు. ఆ నాయకులతో అంటకాగుతుంటారు.. అధికార పార్టీ నేతల సేవలో తరిస్తూ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. -
30న నేతల ఆగమనం.. ఒకేరోజు జగన్, లోకేష్, బాలకృష్ణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల తేదీ సమీపించే కొద్ది ప్రధాన పార్టీల కీలక నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇకపై ప్రచారం జోరందుకోనుంది. -
రూ. 4.92 కోట్ల ఖర్చు.. రూ.2.21 కోట్ల జప్తు
[ 27-04-2024]
ఎన్నిల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు జిల్లాలో రూ.2,21,90,514 విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఓటర్లను ప్రభావితం చేసేలా పంచేందుకు సిద్ధం చేసినట్లుగా అనుమానిత వస్తువులను సీజ్ చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
హెచ్చరిక.. కండువాలు మారిస్తే జరిమానా
[ 27-04-2024]
ప్రస్తుతం ఎవరు ఏ పార్టీనో ఇతమిత్థంగా చెప్పలేం. ఈ రోజు ఉదయం ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకొంటే.. సాయంత్రానికే మరో పార్టీ పిలిచిందంటూ అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. -
246మంది అభ్యర్థులు415నామినేషన్లు48తిరస్కరణలు
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. -
18,22,470 మంది చేతుల్లో భవిత
[ 27-04-2024]
మే 13 నాటి సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపుల సవరణల ప్రక్రియ పూర్తయింది. -
తాడేపల్లి జలగ.. రక్త మాంసాలు పీల్చ
[ 27-04-2024]
అధికారంలోకి వస్తానే జగన్ విడతల వారీగా మద్య నిషేధాన్ని గాలికొదిలేశారు. ఏకంగా ప్రభుత్వంతోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేయించారు. ఊరూరా మద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. -
పైసా విదిల్చింది లేదు
[ 27-04-2024]
గిద్దలూరు నియోజకవర్గం అర్థవీడు మండల కేంద్రంలోని బాలుర గురుకుల మైదానంలో గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.కోటి నిధులతో మినీ ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను 2018లో చేపట్టింది. -
తెదేపా పాలనలోనే అభివృద్ధి
[ 27-04-2024]
తెదేపా పాలనలోనే అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు.. ఆయన శుక్రవారం గిద్దలూరు నగర పంచాయతీలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. -
కన్నీరే మిగిల్చావ్.. జగన్
[ 27-04-2024]
బొప్పాయి పంట పండించి ఆదాయాన్ని సాధించాలన్న రైతుల కల కలగానే మిగిలింది. ఉద్యాన పంటలకు గత ప్రభుత్వం రాయితీలిచ్చి ప్రోత్సహించడంతో రైతులు ఈ పంట సాగుపై దృష్టి పెట్టారు. -
నిధులు నిలిపివేసి.. కేంద్రానివీ మింగేసి.. పురాల గొంతు నులిమిన పాలకుడు
[ 27-04-2024]
రోడ్ల విస్త‘రణం’..ఊసేలేని కాలువల నిర్మాణం..వీధి దీపాల ఏర్పాటులో నిర్లక్ష్యం..ఇక పత్తాయే లేని పారిశుద్ధ్యం ! జిల్లాలోని నగర, పుర సంస్థల్లో గత అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం ఒరగబెట్టిందిదే ! వసతులు కల్పించడం లేదు మొర్రో అని స్వయంగా వైకాపా వార్డు సభ్యులే గళమెత్తడం పాలకుల వైఫల్యాలకు అద్దం పడుతోంది. -
కక్ష కట్టి కడుపు కొడతారు
[ 27-04-2024]
2019 ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం వీచినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో (ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నాయి) తెదేపా ఎమ్మెల్యేలే విజయం సాధించారు. -
తెదేపాకు మద్దతుగా ఉన్నారని నీళ్ల నిలిపివేత
[ 27-04-2024]
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వైకాపా నేతల దాష్టీకాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా రేపల్లె, నగరం మండలాల్లోని మూడు, నాలుగు గ్రామాల్లో దళిత కాలనీలకు తాగునీరు సరఫరా చేసే విషయంలో ఆ కాలనీల్లో ఉండే వైకాపా నాయకులు రాజకీయ కోణంలో ఆలోచించి వివక్ష చూపడంతో గుక్కెడు నీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. -
ఐ ప్యాక్ సర్వేలన్నీ బోగస్
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా పనైపోయిందని, ఐప్యాక్ సర్వేలన్నీ బోగస్ అని నరసరావుపేట కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు