బరితెగింపు నేతలు.. ప్రలోభాల్లో తోపులు
ఎన్నికల కోడ్ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు.
ఎరగా చీరలు.. నగదు.. తోపుడు బండ్లు
అడ్డగోలుగా ఉల్లంఘనలు
అనుకూలురతో ముందుగానే మద్యం నిల్వలు
ఒంగోలు, న్యూస్టుడే: ఎన్నికల కోడ్ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. చీరలు, నగదు, డిన్నర్ సెట్లు, తోపుడు బండ్లను ఎరగా వేస్తూ బరితెగిస్తున్నారు. ఎన్నికల నియమావళిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. మేం అధికారంలో ఉన్నాం మా ఇష్టం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.
పట్టుకున్న మద్యం సీసాలు చూపుతున్న బేస్తవారపేట పోలీసులు
వందనమంటూ వంచనతో మొదలై...: ఎన్నికల నియమావళి అమలులోకి రాకముందే అధికార పార్టీ పెద్ద ఎత్తున కుయుక్తులకు తెర లేపింది. వాలంటీర్లపై తొలి ప్రలోభాల వల విసిరింది. వాలంటీర్లకు వందనం పేరిట అధికారిక కార్యక్రమం అంటూనే వారికి తాయిలాల ఎరవేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఒక్కొక్కరికీ రూ.5 వేల నగదుతో పాటు బహుమతులు పంపిణీ చేశారు. వైకాపా ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఫొటోతో పాటు స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి చిత్రాలను ముద్రించి మరీ బాహాటంగా అందజేశారు. ఆ తర్వాత అంగన్వాడీ, ఆశా వర్కర్లు, వీవోఏలకు కూడా తాయిలాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా కానుకలు అందిస్తున్నారు. అయినప్పటికీ అధికార యంత్రాంగం కిమ్మనలేదు.
సామాన్యులే చివరికి సమిధలు...: ఈ నెల 16న నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత కూడా అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా ప్రలోభాలకు పాల్పడుతూనే ఉన్నారు. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారానికి వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు దూరంగా ఉండాలని ఈసీ స్పష్టంగా చెబుతున్నా.. కొన్నిచోట్ల పట్టించుకోవడం లేదు. కోడ్ వచ్చిన తర్వాత ఒంగోలు మేయర్ గంగాడ సుజాత తన నివాసంలో తాయిలా పంపిణీ చేపట్టారు. అందులో పాల్గొన్న దిగువస్థాయి సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్న అధికారులు, నియమావళిని ఉల్లంఘించిన మేయర్పై మాత్రం కనీస చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తాజాగా ఒంగోలు శివారు గుత్తికొండవారిపాలెంలోని ఒక గోదాములో నిల్వ చేసిన చీరలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు జప్తు చేశారు. సదరు చీరల అట్టపెట్టెలపై సీఎం జగన్, ఎమ్మెల్యే బాలినేని ఫొటోలు ముద్రించి ఉన్నాయి. తాజాగా ఒంగోలు రామ్నగర్లో పంపిణీకి సిద్ధం చేసిన తోపుడుబండ్లను కూడా పట్టుకున్నారు.
దుకాణాల నుంచి మద్యం
తరలింపు...: ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేయడంలో మద్యానిది ప్రధాన పాత్రగా నేతలు భావిస్తుంటారు. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు మద్యం సేకరణపై దృష్టి సారించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది నియామకాలన్నీ అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే సాగాయి. వారి సిఫారసుల మేరకే సేల్స్మెన్, సూపర్వైజర్, వాచ్మెన్లను నియమించారు. ఇప్పుడు వారి ద్వారా రోజువారీ విక్రయాల్లో ఎక్కువ లెక్క చూపి బయటకు తరలించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇటీవల జిల్లాలోని పలుచోట్ల అటు పోలీసులు, ఇటు సెబ్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో మద్యం దుకాణాల సిబ్బంది పట్టుబడటమే ఇందుకు నిదర్శనం.
పేరుకేనా తనిఖీ బృందాలు..!: కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత జిల్లావ్యాప్తంగా పలు కీలక ప్రాంతాల్లో అధికారులు 18 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక, ఆకస్మిక తనిఖీల నిమిత్తం ఫ్లయింగ్ స్క్వాడ్ల బృందాలను నియమించారు. ఈ బృందాలు పక్కాగా తనిఖీలు నిర్వహిస్తే అక్రమాలను కొంతమేరకైనా నిరోధించే అవకాశం ఉంది. జిల్లాలో పోలీసు సిబ్బంది కొరత ఉండంటంతో ఆయా చెక్పోస్టుల వద్ద తక్కువ సిబ్బందితో నామమాత్రపు తనిఖీలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెక్పోస్టులను మరింత పటిష్ఠం చేసి ముమ్మర తనిఖీలు చేస్తే ఎన్నికల అక్రమాలకు కొంతమేరకైనా అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది.
ఒంగోలు మండలం గుత్తికొండవారిపాలెంలో నిల్వచేసిన చీరలను పరిశీలిస్తున్న అధికారులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
[ 27-04-2024]
పేరుకే పోలీసులు. నిత్యం వైకాపాకు వంతపాడుతుంటారు. ఆ నాయకులతో అంటకాగుతుంటారు.. అధికార పార్టీ నేతల సేవలో తరిస్తూ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. -
30న నేతల ఆగమనం.. ఒకేరోజు జగన్, లోకేష్, బాలకృష్ణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల తేదీ సమీపించే కొద్ది ప్రధాన పార్టీల కీలక నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇకపై ప్రచారం జోరందుకోనుంది. -
రూ. 4.92 కోట్ల ఖర్చు.. రూ.2.21 కోట్ల జప్తు
[ 27-04-2024]
ఎన్నిల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు జిల్లాలో రూ.2,21,90,514 విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఓటర్లను ప్రభావితం చేసేలా పంచేందుకు సిద్ధం చేసినట్లుగా అనుమానిత వస్తువులను సీజ్ చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
హెచ్చరిక.. కండువాలు మారిస్తే జరిమానా
[ 27-04-2024]
ప్రస్తుతం ఎవరు ఏ పార్టీనో ఇతమిత్థంగా చెప్పలేం. ఈ రోజు ఉదయం ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకొంటే.. సాయంత్రానికే మరో పార్టీ పిలిచిందంటూ అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. -
246మంది అభ్యర్థులు415నామినేషన్లు48తిరస్కరణలు
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. -
18,22,470 మంది చేతుల్లో భవిత
[ 27-04-2024]
మే 13 నాటి సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపుల సవరణల ప్రక్రియ పూర్తయింది. -
తాడేపల్లి జలగ.. రక్త మాంసాలు పీల్చ
[ 27-04-2024]
అధికారంలోకి వస్తానే జగన్ విడతల వారీగా మద్య నిషేధాన్ని గాలికొదిలేశారు. ఏకంగా ప్రభుత్వంతోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేయించారు. ఊరూరా మద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. -
పైసా విదిల్చింది లేదు
[ 27-04-2024]
గిద్దలూరు నియోజకవర్గం అర్థవీడు మండల కేంద్రంలోని బాలుర గురుకుల మైదానంలో గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.కోటి నిధులతో మినీ ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను 2018లో చేపట్టింది. -
తెదేపా పాలనలోనే అభివృద్ధి
[ 27-04-2024]
తెదేపా పాలనలోనే అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు.. ఆయన శుక్రవారం గిద్దలూరు నగర పంచాయతీలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. -
కన్నీరే మిగిల్చావ్.. జగన్
[ 27-04-2024]
బొప్పాయి పంట పండించి ఆదాయాన్ని సాధించాలన్న రైతుల కల కలగానే మిగిలింది. ఉద్యాన పంటలకు గత ప్రభుత్వం రాయితీలిచ్చి ప్రోత్సహించడంతో రైతులు ఈ పంట సాగుపై దృష్టి పెట్టారు. -
నిధులు నిలిపివేసి.. కేంద్రానివీ మింగేసి.. పురాల గొంతు నులిమిన పాలకుడు
[ 27-04-2024]
రోడ్ల విస్త‘రణం’..ఊసేలేని కాలువల నిర్మాణం..వీధి దీపాల ఏర్పాటులో నిర్లక్ష్యం..ఇక పత్తాయే లేని పారిశుద్ధ్యం ! జిల్లాలోని నగర, పుర సంస్థల్లో గత అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం ఒరగబెట్టిందిదే ! వసతులు కల్పించడం లేదు మొర్రో అని స్వయంగా వైకాపా వార్డు సభ్యులే గళమెత్తడం పాలకుల వైఫల్యాలకు అద్దం పడుతోంది. -
కక్ష కట్టి కడుపు కొడతారు
[ 27-04-2024]
2019 ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం వీచినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో (ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నాయి) తెదేపా ఎమ్మెల్యేలే విజయం సాధించారు. -
తెదేపాకు మద్దతుగా ఉన్నారని నీళ్ల నిలిపివేత
[ 27-04-2024]
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వైకాపా నేతల దాష్టీకాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా రేపల్లె, నగరం మండలాల్లోని మూడు, నాలుగు గ్రామాల్లో దళిత కాలనీలకు తాగునీరు సరఫరా చేసే విషయంలో ఆ కాలనీల్లో ఉండే వైకాపా నాయకులు రాజకీయ కోణంలో ఆలోచించి వివక్ష చూపడంతో గుక్కెడు నీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. -
ఐ ప్యాక్ సర్వేలన్నీ బోగస్
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా పనైపోయిందని, ఐప్యాక్ సర్వేలన్నీ బోగస్ అని నరసరావుపేట కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు