క్యాషియర్ జగన్.. నొక్కవేం బటన్
రాష్ట్రంలో సంక్షేమం కోసం తరచూ బటన్లు నొక్కుతున్నాను. ప్రతి గడపకూ సంక్షేమాన్ని పెద్ద ఎత్తున చేరుస్తున్నానంటూ గొప్పలు చెప్పే ముఖ్యమంత్రివన్నీ ఉత్తుతి మాటలేనని అగ్రిగోల్డ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆరు నెలల్లో నగదంటూ ఆర్భాటం
అయిదేళ్లుగా అదే నమ్మక ద్రోహం
అగ్రిగోల్డ్ బాధితులకూ మోసం
‘మీ జగన్ మోహన్ రెడ్డి మాటిస్తున్నాడు. అగ్రిగోల్డ్ బాధితులకు ఆరు నెలల్లో పూర్తి చెల్లింపులు చేస్తా. ఈ విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలోనూ పెడతాం. బాధితులు అధైర్య పడకండి. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తాను...’
విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితుల దీక్షా శిబిరం వద్ద ప్రతిపక్ష నేత హోదాలో జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలివి.
- కనిగిరి పట్టణానికి చెందిన గాదంశెట్టి ప్రవీణ్ రూ. 2.50 లక్షల అగ్రిగోల్డ్ పాలసీ చేశారు. ఆయనకు ఇంతవరకు పైసా ప్రభుత్వం నుంచి రాలేదు.
- కనిగిరి పట్టణానికి చెందిన బాలచంద్ర రూ. 23 లక్షల వరకు అగ్రిగోల్డ్కు చెల్లించారు. ఇతరులతో మరో రూ.27 లక్షలు కట్టించారు. ఏళ్లు గడుస్తున్నా చిల్లిగవ్వ చేతికి అందలేదు.
- పీసీపల్లికి చెందిన మధు అనే చిరు వ్యాపారి అగ్రిగోల్డ్ యజమాన్యం మాటలు నమ్మి సుమారు రూ. 10 లక్షలు చెల్లించారు. జగన్ మాటలు నమ్మినా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి పైసా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనిగిరి, న్యూస్టుడే: రాష్ట్రంలో సంక్షేమం కోసం తరచూ బటన్లు నొక్కుతున్నాను. ప్రతి గడపకూ సంక్షేమాన్ని పెద్ద ఎత్తున చేరుస్తున్నానంటూ గొప్పలు చెప్పే ముఖ్యమంత్రివన్నీ ఉత్తుతి మాటలేనని అగ్రిగోల్డ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ సంస్థ కారణంగా మోసపోయిన వారికి తానున్నానంటూ ప్రతిపక్ష నేత హోదాలో జగన్ తెగ హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బాధితులకు న్యాయం చేస్తానంటూ నమ్మించారు. ఆరు నెలల్లో సొమ్ము చెల్లించేలా చర్యలు తీసుకుంటానని.. కోర్టులో ఉన్న కేసుల సంగతి కూడా తాను చూసుకుంటానంటూ ప్రగల్భాలు పలికారు. జిల్లాలో అగ్రిగోల్ట్ ఏజెంట్లు లక్ష మంది వరకు ఉన్నారు. వీరి కింద లక్షల మంది పాలసీదార్లు ఉన్నారు. కష్టించిన డబ్బులు భవిష్యత్తు అవసరాలరీత్యా దాచుకున్నారు. ఆ సంస్థ మోసంతో తీవ్రంగా నష్టపోయారు. ఈ విషయాన్ని జగన్ తన రాజకీయ అవసరాలకు ఉపయోగించుకున్నారు. మోసపోయారని.. న్యాయం చేస్తానంటూ మొసలి కన్నీరు కార్చారు. అనంతరం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి బాండ్లు సేకరించారు. ఒక్కో ఏజెంటుకు కేవలం రూ. 10 వేలు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకొన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ అయిదేళ్లుగా బాధితులు నిరాహార దీక్షలు, పోరాటాలు, ధర్నాలు చేస్తున్నా పట్టించుకోలేదు. పైగా అనేక మందిపై కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఇబ్బందులుకు గురిచేశారు.
మాట తప్పారు.. మడమ తిప్పారు...
అయిదేళ్ల కాలంలో మాకు న్యాయం చేయాలంటూ ధర్నాలు చేశాం. అయినప్పటికీ వైకాపా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు. ఎన్నికల సమయంలో న్యాయం చేస్తానని నమ్మించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెడుతున్నాను అని హామీ ఇచ్చారు. అయిదేళ్లయినా ఎలాంటి న్యాయం చేయలేదు. జగన్ ఇచ్చిన మాట తప్పారు. హామీ నెరవేర్చకుండా మడమ తిప్పారు.
గాధంశెట్టి ప్రవీణ్, ఏజెంట్
కూడబెట్టి కట్టినవన్నీ పోయాయి...
ఏదో ఆదాయం వస్తుందని అగ్రిగోల్డ్ ఏజెంటÆ్ ద్వారా రూ. 3.50 లక్షలు కట్టాను. ఆ సంస్థ మోసంతో ఏంచేయాలో పాలుపోని పరిస్థితిలో పడ్డాను. వైకాపా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పినా ఇంతవరకు పైసా రాలేదు. ఎన్నిసార్లు అధికార్లు, ఏజెంట్లను కలసినా లాభం లేదు. నేను కూడబెట్టినదంతా పోగొట్టుకున్నాను. ఆదుకుంటానని చెప్పిన జగన్ కూడా చేసిందేమీ లేదు.
శ్రీనివాసరెడ్డి, బాధితుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాలో చేరిన వార్డు వాలంటీర్లు
[ 03-05-2024]
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన అయిదుగురు వాలంటీర్లు గురువారం రాజీనామా చేసి వైకాపాను వీడి తెదేపా చేరారు. -
రైల్వే పనులు త్వరలో పూర్తి
[ 03-05-2024]
దొనకొండ రైల్వేస్టేషన్లో నిలిచిన పనులు త్వరలో పూర్తి చేయాలని రైల్వే గుంటూరు డివిజనల్ మేనేజర్ ఎం.రామకృష్ణ అన్నారు. అమృత్ భారత్ పనులు పరిశీలనలో భాగంగా ఆయన గురువారం దొనకొండ వచ్చారు. -
వైభవంగా స్వామివారి చక్రస్నానం
[ 03-05-2024]
పట్టణంలోని కాప వీధిలో కొలువైన వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం స్వామివారి చక్రస్నానం పూజారులు కనులపండువగా నిర్వహించారు. -
నిర్లక్ష్యంతో ఆటలకు చేటు
[ 03-05-2024]
వైకాపా ప్రభుత్వం క్రీడారంగంపై శీతకన్ను వేసింది. ఫలితంగా యువత, విద్యార్థులకు గల్లీ క్రీడలే దిక్కవుతున్నాయి. చినుకు పడితే చాలు నగరంలోని మినీ స్టేడియం జలమయమవుతోంది. -
కోడిగుడ్ల డబ్బులు మింగేశారు!
[ 03-05-2024]
మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా కోడిగుడ్లు సరఫరా బిల్లుల చెల్లింపులో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ప్రతినెలా వారానికి ఒకసారి గుత్తేదారు కోడిగుడ్లు సరఫరా చేస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్