పండగ వేళ పట్నం వెలిగిపోతోంది
ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం, త్రినేత్రధారిణి పాతపట్నం నీలమణిదుర్గమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.
వైభవంగా సాగుతున్న నీలమణిదుర్గమ్మ సంబరాలు
నేడు ఘటోత్సవంతో ముగింపు
న్యూస్టుడే, పాతపట్నం : ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం, త్రినేత్రధారిణి పాతపట్నం నీలమణిదుర్గమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తొమ్మిదేళ్ల తర్వాత జరుగుతున్న వేడుకలను కనులారా తిలకించేందుకు ఎక్కడెక్కడో స్థిరపడినవారంతా స్వగ్రామానికి తరలివచ్చారు. దీంతో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తోంది. ఇంటింటా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది.. ఊరంతా విద్యుత్తుకాంతులతో వెలిగిపోతోంది. వీధివీధినా సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. అమ్మ తిరువీధితో శరణుఘోష మారుమోగుతోంది. ఈనెల 20న ప్రారంభమైన సంబరాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. మంగళవారం ప్రధాన వేడుక జరగనుంది. ఇందుకు ఉత్సవ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది
ప్రతి ఇంటి నుంచి ఘటాలు: అమ్మవారి ఉత్సవాల్లో ప్రత్యేకత ఘటాలు. కాపువీధి కూడలిలో ఉన్న ఆలయం నుంచి ప్రధాన ఆలయానికి అమ్మ పయనమైనప్పుడు వెంట వేలాది ఘటాలతో మహిళలు, భక్తులు తరలివెళ్తారు. గ్రామంలో సుమారు 8,500 ఇళ్లు ఉండగా ఒక్కో ఇంటి నుంచి రెండు లేదా మూడు ఘాటాలతో మొక్కులు చెల్లిస్తారు. చివరి రోజు జరిగే ఘటోత్సవంలో సుమారు 15 నుంచి 20 వేల ఘటాలు ఉంటాయని అంచనా.
ప్రతిరోజూ సంబరాలే..: పండగ చివరి రోజున బంధువులు, స్నేహితులను పిలిచి భోజనాలు పెట్టడం ఆనవాయితీ. ఈసారి ఇందుకు భిన్నంగా సంబరాల ప్రారంభం నుంచే భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. చివరి రోజున ఉత్సవాలు, మొక్కులు, లక్షల్లో తరలివచ్చే భక్తుల కారణంగా ఇసుకేస్తే రాలనంతగా వీధులు తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
గట్టి భద్రతా చర్యలు: చివరిరోజు మంగళవారం దాదాపు 3 నుంచి 5 లక్షల మంది జనం వస్తారని అంచనా. ఈనేపథ్యంలో అవాంఛనీయ ఘటనలకు లేకుండా గ్రామంలోకి ఇతర ప్రాంతాల నుంచి వాహనాలు రాకుండా నిలిపివేశారు. శివార్లలోనే పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్ఐలతో పాటు 220 మంది పోలీసు సిబ్బందితో భద్రతా చర్యలు పర్యవేక్షిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కనికరం లేని మావయ్యా.. కనీస వసతులేవయ్యా..!
[ 26-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసే ఆలయాలు. అలాంటి వాటిని అభివృద్ధి చేయకుండా వైకాపా నేతలు ఐదేళ్లపాటు గాలికొదిలేశారు. కార్పొరేట్ ప్రీ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తామని జగన్ చెప్పిన మాటలు ప్రసంగాలకే పరిమితమయ్యాయి. -
ఎండప్రచండం
[ 26-04-2024]
జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా ఉంటోంది. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బయటకు వచ్చేందుకు జనాలు సాహసించడం లేదు. -
శెభాష్.. సతీష్..
[ 26-04-2024]
జేఈఈ మెయిన్-2024 (సెషన్-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్కుమార్ అదరగొట్టాడు. -
నామినేషన్ల ఘట్టానికి తెర
[ 26-04-2024]
జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేశారు. వాటిల్లో రెండుసార్లు వచ్చిన వాటిని తీసివేయగా 123 మంది అభ్యర్థులు మిగిలారు. -
వైకాపా స్థావరాలపై పసుపు జెండా..!
[ 26-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయువుపట్టు లాంటి వైకాపా స్థావరాల్లో పసుపు జెండా ఎగురవేశారు. -
జేఈఈలో సిక్కోలు సత్తా..
[ 26-04-2024]
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవరు మృతి
[ 26-04-2024]
జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్ మృతిచెందాడు. -
27న పాలిసెట్-2024
[ 26-04-2024]
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే
[ 26-04-2024]
ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. -
మలుపులు.. మృత్యులోగిళ్లు
[ 26-04-2024]
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. -
దారికి రాని విస్తరణ
[ 26-04-2024]
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం