శెభాష్.. సతీష్..
జేఈఈ మెయిన్-2024 (సెషన్-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్కుమార్ అదరగొట్టాడు.
జేఈఈ మెయిన్లో మెరిసిన సిక్కోలు విద్యార్థి
ఆలిండియా 8వ ర్యాంకు కైవసం
న్యూస్టుడే, జలుమూరు
జేఈఈ మెయిన్-2024 (సెషన్-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్కుమార్ అదరగొట్టాడు. ఆలిండియా 8వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 2వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. తండ్రి చింతు బుచ్చన్న పాలకొండ మండలం లుంబూరు ప్రాథమిక పాఠశాలలో, తల్లి నక్క రమాదేవి విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలం ఆమదాలవలస కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యం కలిగిన సతీష్ చిన్నప్పటి నుంచి చదువుపై ఆసక్తి కనబరిచేవాడు. ప్రాథమిక విద్యాభ్యాసం పాలకొండ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. అనంతరం నవోదయ ప్రవేశ పరీక్షలో సీటు దక్కించుకున్నప్పటికీ బాగా చదవగలడనే నమ్మకంతో తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు. అక్కడే పదో తరగతి వరకు చదివాడు. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. పదో తరగతిలో (సీబీఎస్ఈ సిలబస్) 500 మార్కులకు 472 మార్కులు సాధించాడు. ఇంటర్మీడియట్ (సీబీఎస్ఈ) ఫలితాలు ఇంకా వెలువడలేదు.
అదనంగా రెండు గంటలు శ్రమించేవాడిని..
- సతీష్కుమార్
తల్లిదండ్రుల ప్రోత్సాహం, కళాశాలలో అధ్యాపకుల మార్గనిర్దేశంతో ఈ ర్యాంకు సాధించగలిగాను. కళాశాల నుంచి వచ్చిన తరువాత ప్రతిరోజూ రెండు గంటలు అదనంగా వెనుకబడిన సబ్జెక్టులపై దృష్టి పెట్టేవాడిని. అర్థం కాని అంశాలను మా తల్లిదండ్రులకు ఫోన్ చేసి నేర్చుకునేవాణ్ని. సాఫ్ట్వేర్ ఇంజినీరుగా స్థిరపడాలన్నదే నా లక్ష్యం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనం జాగాలపైకి జ‘గన్’..!
[ 05-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత భూఆక్రమణలకు కొదవ లేకుండా పోయింది. ఖాళీ జాగా కనిపిస్తే అధికార మదంతో కబ్జా చేసేస్తున్నారు. ప్రశ్నిస్తే వివాదాలకు దిగుతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేసేందుకు జగన్ కొత్త ఎత్తుగడతో జనాల ముందుకు వస్తున్నారు. -
ప్రతి మహిళకు నెలకు రూ.1,500
[ 05-05-2024]
‘వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కేసులతో వేధింపులకు గురిచేసి భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ ప్రకటించి నిరుద్యోగ యువతను మోసం చేశారు. -
‘దీవెన’ పేరుతో దగా!
[ 05-05-2024]
జడ్పీ, ఇతర సమావేశాల్లో ప్రజాప్రతినిధులకు అధికారులు ఇచ్చే వివరాల్లో వసతి దీవెన రెండు విడతలకు ఒకసారే ఇచ్చారని నమోదు చేస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థులందరికీ రెండో విడత జమ చేయనట్లే లెక్క. -
పోర్టు నిర్వాసితులకు న్యాయం చేస్తాం
[ 05-05-2024]
వైకాపా నాయకులు పోర్టు నిర్మాణం పేరుతో ఈ ప్రాంత సహజ వనరులను దోచుకుంటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం
[ 05-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ శనివారం ప్రారంభమైంది. మొత్తం 8 నియోజకవర్గాల పరిధిలో ప్రక్రియ నిర్వహించారు. -
చంద్రబాబుతోనే ప్రగతి సాధ్యం
[ 05-05-2024]
తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తేనే రాష్ట్రం ప్రగతి బాటలో పయనిస్తుందని సినీ నటుడు నారా రోహిత్ పేర్కొన్నారు. జిల్లాలో శనివారం ఆయన పర్యటించారు. -
అవే బాధలు.. అందలేదు డబ్బులు
[ 05-05-2024]
పింఛను ఇబ్బందులు ఇంకా తీరలేదు. ఇప్పటికీ వృద్ధులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మేడలపై ఉన్న బ్యాంకులు ఎక్కలేక ఇబ్బందులు పడుతున్నారు. -
ఎత్తిపోతలపై కన్నెత్తి చూడని ప్రభుత్వం..!
[ 05-05-2024]
కాలువల సదుపాయం లేని వ్యవసాయ భూములకు ఎత్తిపోతల పథకాలే శరణ్యం. దీనిని గుర్తించిన తెదేపా ప్రభుత్వ వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. నిధుల మంజూరుతో పాటు, నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో అన్నదాతల సాగునీటి ఇబ్బందులు తీరాయి. -
ఒకేసారి ఇద్దరు,ముగ్గురు ఓటు
[ 05-05-2024]
ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ శనివారం గందరగోళంగా సాగింది. నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నాలుగు మండలాల ఉద్యోగుల కోసం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఉదయం నుంచే ఉద్యోగుల తాకిడి పెరిగింది. -
డిగ్రీ సప్లిమెంటరీ పరీక్ష షెడ్యూల్లో స్వల్ప మార్పులు
[ 05-05-2024]
బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలలకు చెందిన విద్యార్థుల సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసినట్లు
తాజా వార్తలు (Latest News)
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM