దారికి రాని విస్తరణ
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.
ట్రాఫిక్తో నగర వాసులకు తప్పని ఇక్కట్లు
శ్రీకాకుళం నగరం, న్యూస్టుడే
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది. నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా చర్యలు తీసుకోవాల్సిన మంత్రి ధర్మాన ప్రసాదరావు జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నగరంలోని పాలకొండ రహదారి విస్తరణపై మూడేళ్లుగా తమకేమి పట్టనట్లు వ్యవహారించడంతో ట్రాఫిక్ ఇక్కట్లు తప్పడం లేదు.
ఆమదాలవలస- శ్రీకాకుళం ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో భాగంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో శ్రీకాకుళం నగరంలోని ‘డే అండ్ నైట్’ సెంటర్ నుంచి కొత్తరోడ్డు కూడలి వరకు విస్తరణ పనులు చేయాల్సి ఉంది. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి పనులకు హామీ ఇచ్చినా నిధులు మంజూరవ్వలేదు. అయితే ప్రాధాన్యతా క్రమంలో పనులు చేయాల్సిన విషయాన్ని ర.భ శాఖ, నగరపాలక సంస్థ అధికారులు విస్మరించారు. దీంతో రోజురోజుకు ట్రాఫిక్ ఇబ్బందులు తీవ్రంగా మారుతున్నాయి. మొదటి విడతగా ఆమదాలవలస నుంచి కొత్తరోడ్డు వరకు ఇప్పటికే చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించలేదు. దీంతో ఆ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి.
పూర్తికాని భూసేకరణ
ఆమదాలవలస ప్లై ఓవర్ నుంచి కొత్తరోడ్డు కూడలి వరకు 80 అడుగుల మేర.. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో 70 అడుగుల మేర విస్తరణ పనులు చేయాల్సి ఉంది. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని ఆదివారంపేట నుంచి ‘డే అండ్ నైట్ కూడలి’ వరకు సుమారు 2 కి.మీ మేర రహదారి విస్తరణకు అవసరమైన స్థలాన్ని సేకరించే బాధ్యత ప్రభుత్వం నగరపాలక సంస్థకు అప్పగించింది. ఏళ్లు గడుస్తున్నా ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం మొదలవ్వలేదు. నగరపాలక సంస్థ ప్రణాళిక విభాగం, ర.భ శాఖ అధికారుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. మొత్తం 428 ప్రైవేటు స్థలాలను సేకరించాల్సి ఉన్నట్లు గుర్తించారు. వీటిలో అధికంగా ఆదివారంపేట, బలగ ప్రాంతంలో ఉన్నాయి. ఈ మేరకు నివేదికలను సిద్ధం చేశారు.
చొరవచూపని అధికారులు
స్థలాన్ని ఇచ్చేందుకు నగరవాసులు ముందుకొచ్చినా.. ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కోల్పోయిన స్థలాలకు, ఇళ్లకు పరిహారం నగదు రూపంలో చెల్లించాలని నగరపాలక సంస్థ అధికారులను డిమాండ్ చేశారు. అప్పటికి నిధులు కొరత కారణంగా భూసేకరణ మధ్యలో నిలిచిపోయింది. ఇళ్లు నష్టపోయే వారికి టీడీఆర్ బాండ్లు జారీ చేస్తామని హామి ఇచ్చారు. పూర్తిగా ఇళ్లు నష్టపోయిన వారికి జగనన్న లేఅవుట్లలో ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు తొమ్మిది మంది మాత్రమే తగిన అంగీకార పత్రాలు, స్థలాలకు సంబంధించి పత్రాలను నగరపాలక సంస్థ అధికారులు సేకరించారు. నగరంలోని ఆర్టీసీ కాంపెక్ల్స్, తహసీల్దారు కార్యాలయం, పోలీసు అతిధి గృహం, ప్రభుత్వ ఐటీఐ, జిల్లా కోరు, ఇండ్రస్టీరియల్ కార్యాలయాలకు సంబంధించిన ప్రహరీలను తొలగించాల్సి రావడంతో వాటిని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రూ. 1.10 కోట్లతో పునరుద్ధరించేందుకు టెండర్లు పిలిచారు. పలు కార్యాలయాల ప్రహరీలను తొలగించి వాటిని ఆలానే వదిలేశారు. మిగిలిన కార్యాలయాలకు సంబంధించి పనులు అసలు ప్రారంభమే కాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పండుటాకుల ప్రాణాలతో జగన్నాటకం..!
[ 04-05-2024]
ప్రభుత్వం ఆడిన జగన్నాటానికి పండుటాకులు నరకం చూస్తున్నారు. పింఛను డబ్బులు చేతికి అందించే అవకాశమున్నా పట్టించుకోకుండా వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. జిల్లాలో శుక్రవారం సైతం మండుటెండలో బ్యాంకుల వద్ద వృద్ధులు పడిగాపులు కాశారు. -
9 న నరసన్నపేటలో ప్రజాగళం
[ 04-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఈ నెల 9న జిల్లాకు రానున్నారు. -
ప్రశ్నించే గొంతులపై ‘రాక్షస క్రీడ’..!
[ 04-05-2024]
జగన్ పాలనలో అన్యాయంపై నోరెత్తకూడదు. నిరసన ప్రదర్శించినా, సమస్యను పరిష్కరించమని అడిగినా నేరమే. ప్రభుత్వ వ్యతిరేకతను తెలిపేందుకు ఆందోళన చేసినా వారిపై కేసులు పెట్టించారు. -
ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉన్నాం
[ 04-05-2024]
శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఎన్నికల పరిశీలకులు శేఖర్ విద్యార్థి తెలిపారు. కేంద్ర డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస్ శుక్రవారం ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్లు, ఎస్పీలతో దూరదృశ్య సమావేశం నిర్వహించారు. -
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
[ 04-05-2024]
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు ఇతర సిబ్బంది ఓటు వినియోగించుకునేందుకు సమయం ఆసన్నమైంది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం వారందరికీ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు అవకాశం కల్పించారు. -
సికింద్రాబాద్ నుంచి బ్రహ్మపురకు ప్రత్యేక రైలు
[ 04-05-2024]
వేసవి రద్దీని నివారించేందుకు బ్రహ్మపుర నుంచి సికింద్రాబాద్కు ప్రత్యేక రైలును నడపనున్నారు. -
పరిశోధన విభాగం బలోపేతానికి చర్యలు
[ 04-05-2024]
డా.బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో అకడమిక్ అంశాలతో పాటు పరిశోధన విభాగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వర్సిటీ ఉపకులపతి ఆచార్య కె.ఆర్.రజని అన్నారు. -
బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 04-05-2024]
జిల్లాలోని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ఐదు నుంచి 18 ఏళ్ల లోపు వయసు కలిగిన బాలలకు కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. -
సంక్షేమం, అభివృద్ధితో కూటమి పాలన
[ 04-05-2024]
‘వైకాపా అస్తవ్యస్త పాలనతో రాష్ట్రంలో ఉపాధి దొరక్క యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. కొత్త పరిశ్రమలు రాకపోవడంతో అవకాశాలు సన్నగిల్లాయి. ప్రతిఒక్కరిపై పన్నుల భారం పడింది. -
వైకాపా నుంచి తెదేపాలో చేరికలు
[ 04-05-2024]
వైకాపా నుంచి తెదేపాలోకి చేరికల జోరు కొనసాగుతోంది. కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నందిగాం మండలాలకు చెందిన 150 వైకాపా కుటుంబాల వారు తెదేపాలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
దంచికొట్టిన డుప్లెసిస్, కోహ్లీ.. గుజరాత్పై బెంగళూరు విజయం
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు