logo

రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవరు మృతి

జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్‌ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్‌ మృతిచెందాడు.

Published : 26 Apr 2024 03:45 IST

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్‌ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్‌ మృతిచెందాడు. ఎచ్చెర్ల ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం.. అచ్చెప్పడు రోజూ కూరగాయలను శ్రీకాకుళం తీసుకెళ్లి విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో ఉదయం 7 గంటల సమయంలో ఆటోపై కూరగాయలు తీసుకెళ్తుండగా వెనుక నుంచి వ్యాన్‌ ఢీకొనడంతో ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో అచ్చెప్పడుతో పాటు ఆటోలో ఉన్న మరో వ్యక్తి, వ్యాన్‌లో ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. అచ్చెప్పడును 108లో శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వివరాలు నమోదుచేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని