మలుపులు.. మృత్యులోగిళ్లు
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు.
ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి అన్న వాహనదారులు
ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అసహనం
చాలా ప్రమాదాలు జరిగాయని వెల్లడి
కవిటి గ్రామీణం, కంచిలి గ్రామీణం
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. ప్రమాద నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ఆ రోడ్లపై రాకపోకలు చేసే వాహనదారుల్లో ఆందోళన తప్పడం లేదు.
కవిటి మండలంలోని రాజపురం నుంచి బైరిపురం మీదుగా జల్లుపుట్టుగ వచ్చే రహదారిలో మలుపులు ప్రమాదాలకు చిరునామాగా మారాయి. ‘యూ’, ‘ఎస్’ ఆకారాల్లో ఉండటంతో దగ్గరకు వచ్చే వరకు ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదు. దీంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
ఆ రోడ్లపై పరీక్షే
సీమూరు నుంచి నెలవంక, బైరెడ్లపుట్టుగ, కొమ్ముపుట్టుగ, కపాసుకుద్ది, ముత్యాలపేట వయా మండల కేంద్రం కవిటి చేరుకునే రహదారిల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కవిటి నుంచి రాజపురం, బొరివంక నుంచి డి.గొనపపుట్టుగ, నర్తుపుట్టుగ నుంచి జాతీయ రహదారికి చేరుకునే క్రమంలో పలు గ్రామాల్లో మలుపులు వాహనదారులను భయపెడుతున్నాయి. హెచ్చరిక బోర్డులు, వేగ నియంత్రికలు సంబంధిత శాఖాధికారులు ఏర్పాటు చేయలేదు. చీకటి పడితే మలుపుల వద్ద హడలిపోతున్నారు. ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామస్థులు, వాహనదారులు కోరుతున్నారు.
మొక్కలు తొలగించక ఇక్కట్లు
ఆదివారం సంత నుంచి కవిటి రోడ్డును కలిపే రహదారిలో ఏళ్లపాటు జంగిల్ క్లియరెన్స్ లేకపోవడంతో ఇరువైపులా పొదలు పెరిగి వాహనాలు కనిపించడం లేదు. కంచిలి, కవిటి మండలాలను కలిపే ప్రధాన రహదారి కావడంతో నిత్యం రద్దీగా ఉంటోంది.
భయంగా ఉంటుంది
- పి.రామారావు, డీజి.పుట్టుగ
జల్లుపుట్టుగ నుంచి రాజపురం వెళ్లే రహదారిలో పలు చోట్ల మలుపులు ఉన్నాయి. అక్కడకు వచ్చేసరికి జాగ్రత్త పడకపోతే ప్రమాదమే. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించవు. అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
వేగ నియంత్రికలు లేవు
- ఎస్.గణేష్, యువకుడు, నెలవంక
కవిటి నుంచి నెలవంక దారిలో మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు, వేగ నియంత్రికలు లేవు. చీకట్లో వాహనాలపై వెళ్లినప్పుడు ఆందోళనగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనం జాగాలపైకి జ‘గన్’..!
[ 05-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత భూఆక్రమణలకు కొదవ లేకుండా పోయింది. ఖాళీ జాగా కనిపిస్తే అధికార మదంతో కబ్జా చేసేస్తున్నారు. ప్రశ్నిస్తే వివాదాలకు దిగుతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేసేందుకు జగన్ కొత్త ఎత్తుగడతో జనాల ముందుకు వస్తున్నారు. -
ప్రతి మహిళకు నెలకు రూ.1,500
[ 05-05-2024]
‘వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కేసులతో వేధింపులకు గురిచేసి భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ ప్రకటించి నిరుద్యోగ యువతను మోసం చేశారు. -
‘దీవెన’ పేరుతో దగా!
[ 05-05-2024]
జడ్పీ, ఇతర సమావేశాల్లో ప్రజాప్రతినిధులకు అధికారులు ఇచ్చే వివరాల్లో వసతి దీవెన రెండు విడతలకు ఒకసారే ఇచ్చారని నమోదు చేస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థులందరికీ రెండో విడత జమ చేయనట్లే లెక్క. -
పోర్టు నిర్వాసితులకు న్యాయం చేస్తాం
[ 05-05-2024]
వైకాపా నాయకులు పోర్టు నిర్మాణం పేరుతో ఈ ప్రాంత సహజ వనరులను దోచుకుంటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం
[ 05-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ శనివారం ప్రారంభమైంది. మొత్తం 8 నియోజకవర్గాల పరిధిలో ప్రక్రియ నిర్వహించారు. -
చంద్రబాబుతోనే ప్రగతి సాధ్యం
[ 05-05-2024]
తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తేనే రాష్ట్రం ప్రగతి బాటలో పయనిస్తుందని సినీ నటుడు నారా రోహిత్ పేర్కొన్నారు. జిల్లాలో శనివారం ఆయన పర్యటించారు. -
అవే బాధలు.. అందలేదు డబ్బులు
[ 05-05-2024]
పింఛను ఇబ్బందులు ఇంకా తీరలేదు. ఇప్పటికీ వృద్ధులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మేడలపై ఉన్న బ్యాంకులు ఎక్కలేక ఇబ్బందులు పడుతున్నారు. -
ఎత్తిపోతలపై కన్నెత్తి చూడని ప్రభుత్వం..!
[ 05-05-2024]
కాలువల సదుపాయం లేని వ్యవసాయ భూములకు ఎత్తిపోతల పథకాలే శరణ్యం. దీనిని గుర్తించిన తెదేపా ప్రభుత్వ వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. నిధుల మంజూరుతో పాటు, నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో అన్నదాతల సాగునీటి ఇబ్బందులు తీరాయి. -
ఒకేసారి ఇద్దరు,ముగ్గురు ఓటు
[ 05-05-2024]
ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ శనివారం గందరగోళంగా సాగింది. నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నాలుగు మండలాల ఉద్యోగుల కోసం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఉదయం నుంచే ఉద్యోగుల తాకిడి పెరిగింది. -
డిగ్రీ సప్లిమెంటరీ పరీక్ష షెడ్యూల్లో స్వల్ప మార్పులు
[ 05-05-2024]
బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలలకు చెందిన విద్యార్థుల సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసినట్లు
తాజా వార్తలు (Latest News)
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన