logo

వందకు పైగా వైకాపా కుటుంబాలు తెదేపాలో చేరిక

పార్టీ మీద, మా మీద నమ్మకంతో పార్టీలో చేరుతున్న వందలాది మంది నమ్మకాలను వమ్ము కానివ్వమని, అభివృద్ధి అంటే ఏమిటో? చేసి చూపుతామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

Published : 18 Apr 2024 06:27 IST

 అచ్చెన్నాయుడితో తెదేపా నేతలు

 కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: పార్టీ మీద, మా మీద నమ్మకంతో పార్టీలో చేరుతున్న వందలాది మంది నమ్మకాలను వమ్ము కానివ్వమని, అభివృద్ధి అంటే ఏమిటో? చేసి చూపుతామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం నిమ్మాడలోని పార్టీ కార్యాలయంలో నందిగాం, సంతబొమ్మాళి మండలం లక్కివలస పంచాయతీలకు చెందిన వందకు పైగా వైకాపా కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన పిట్ట దండాసి, తలుపెద్ద కామయ్య, కామరాజు, సందుపల్లి ఎర్రన్న, చిన్నారావు, తదితరులను పార్టీలోకి ఆహ్వానించారు. నందిగాం నుంచి బెండి కాళిదాసు, న్రగడ ఆదిత్యలతో పాటు పలువురు తెదేపాలో చేరారు. నాయకులు ధర్మార్జునరెడ్డి, అప్పన్న, రాజులు, రామ్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని