సబ్వేలలో సిద్ధంగా మోటారు పంపులు
వర్షపు నీటి ప్రవాహం, వరదలు నియంత్రించేందుకు నగరంలోని సబ్వేలున్న ప్రాంతాల్లో చెన్నై మహానగర కార్పొరేషన్ పనులు పూర్తి చేసింది. 16 సబ్వేలకు మరమ్మతులు చేసి అదనంగా 16 సబ్మెర్సిబుల్ మోటార్లను సిద్ధంగా ఉంచింది.
వడపళని, న్యూస్టుడే: వర్షపు నీటి ప్రవాహం, వరదలు నియంత్రించేందుకు నగరంలోని సబ్వేలున్న ప్రాంతాల్లో చెన్నై మహానగర కార్పొరేషన్ పనులు పూర్తి చేసింది. 16 సబ్వేలకు మరమ్మతులు చేసి అదనంగా 16 సబ్మెర్సిబుల్ మోటార్లను సిద్ధంగా ఉంచింది. వీటితో పాటు 113 పంపుసెట్లకు గాను 41 వరకు ఏర్పాటు చేశారు. ఎక్కువ భాగం మోటార్లు రంగరాజపురం, మ్యాడ్లీ రోడ్డు, దురైస్వామి సబ్వే, జోన్స్ రోడ్డు, బజార్ రోడ్డు, మ్యాడ్లీ రోడ్డు సబ్వేలలో 14 మోటార్లను సిద్ధం చేసినట్టు అధికారులు చెప్పారు. అదనంగా మరో ఏడు మోటార్లు రానున్నాయి. దురైస్వామి సబ్వేకి ఏడు పంపులున్నాయని, అవికాకుండా మరో నాలుగు సబ్మెర్సిబుల్ మోటార్లు తెప్పిస్తున్నామని చెప్పారు. రాయపురం జోన్లోని స్టాన్లీ సబ్వేకి రెండు అదనపు పంపు సెట్లు, ఆర్బీఐ సబ్వేకి 3, గెంగురెడ్డి సబ్వేకి 2, పెరంబూరు సబ్వేలో ఒకటి, గణేశపురం సబ్వేలో 4, విల్లివాక్కంలో ఒకటి, హారింగ్టన్ రోడ్డు సబ్వేకి 2, నుంగంబాక్కం సబ్వేకి ఒకటి, రంగరాజపురం సబ్వేలో నాలుగు పంపుసెట్లను అమర్చారు. తిరువొత్తియూరులోని మాణిక్యం నగర్ సబ్వే కోసం మూడు పంపు సెట్లు సిద్ధం చేశారు. పెరంబూరు సబ్వే వద్ద రైల్వే శాఖ మరమ్మతులు చేపడుతోందని త్వరలోనే పూర్తవుతాయన్నారు. సింగార చెన్నై 2.0 పథకంలో భాగంగా కార్పొరేషన్ 91 శాతం మేరకు పనులు పూర్తి చేసినట్టు అధికారులు చెప్పారు. హబిబుల్లా రోడ్డు, సీతమ్మాళ్ కాలనీ, అంబేడ్కర్ కాలేజ్ రోడ్డు, మునుస్వామి సాలై, రాజమన్నార్ సాలైలో చాలావరకు రోడ్ల పనులు పూర్తయ్యాయి. అక్కడక్కడా పనులు మిగిలిపోయిన ప్రాంతాల్లో కూడా త్వరలోనే పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం