logo

ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీ

పుదుచ్చేరిలో ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీ జరిగింది. జ్యోతి వళ్లలార్‌ 200వ జయంతి, గాంధీ 154వ జయంతి, స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ తరఫున పుదుచ్చేరిలో ఆదివారం ర్యాలీ జరిగింది.

Published : 03 Oct 2022 00:36 IST

ర్యాలీలో మంత్రి నమశివాయం పాల్గొన్న దృశ్యం

చెన్నై, న్యూస్‌టుడే: పుదుచ్చేరిలో ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీ జరిగింది. జ్యోతి వళ్లలార్‌ 200వ జయంతి, గాంధీ 154వ జయంతి, స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ తరఫున పుదుచ్చేరిలో ఆదివారం ర్యాలీ జరిగింది. ఇందులో భాజపాకు చెందిన పుదువై మంత్రులు నమశివాయం, సాయి శరవణన్‌ కుమార్‌, ఎమ్మెల్యేలు తదితర వెయ్యి మంది ఆర్‌ఎస్‌ఎస్‌ దుస్తుల్లో పాల్గొన్నారు. కామరాజర్‌ రోడ్డు, నెహ్రూ వీధి, మిషన్‌వీధి, బుస్సీ వీధి, మరైమలైనగర్‌ రోడ్డు మార్గంగా సింగారవేలర్‌ విగ్రహం వరకు కొనసాగింది.  ర్యాలీ సందర్భంగా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని