డుగాంగ్ ప్రాణాలకు రక్ష
అంతరించిపోతున్న సముద్ర జీవుల్లో ఒకటిగా ‘డుగాంగ్’ ఉంది. భారీ కాయంతో నీటిలో తిరుగుతూ పరిశోధకుల్ని సైతం ఈ జీవి ఆకట్టుకుంటూనే ఉంది. వీటి సంతతి బాగా తగ్గిపోతుండటం, అందులోనూ తమిళనాడు తీర ప్రాంతంలో వీటి సంతతి ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం వాటి సంరక్షణ బాధ్యత తీసుకుంది.
దేశపు తొలి కన్జర్వేషన్ రిజర్వ్గా గల్ఫ్ ఆఫ్ మన్నార్
మూడేళ్లపాటు ప్రత్యేక చర్యలు
అంతరించిపోతున్న సముద్ర జీవుల్లో ఒకటిగా ‘డుగాంగ్’ ఉంది. భారీ కాయంతో నీటిలో తిరుగుతూ పరిశోధకుల్ని సైతం ఈ జీవి ఆకట్టుకుంటూనే ఉంది. వీటి సంతతి బాగా తగ్గిపోతుండటం, అందులోనూ తమిళనాడు తీర ప్రాంతంలో వీటి సంతతి ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం వాటి సంరక్షణ బాధ్యత తీసుకుంది.
- ఈనాడు-చెన్నై
గల్ఫ్ ఆఫ్ మన్నార్లో పాక్ జలసంధి ప్రాంతాన్ని దేశపు తొలి డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్గా తమిళనాడు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. సముద్ర క్షీరదాల్లో ‘డుగాంగ్’ కూడా ఒకటి. వీటిని సముద్ర ఆవులుగా కూడా పిలుస్తున్నారు. పాక్ జలసంధి ప్రాంతం విస్తరణ సుమారుగా 450 చ.కి.మీ దాకా ఉండొచ్చు. ఈ ప్రాంతంలో వీటి సంతతి అరుదుగా ఉందని రాష్ట్ర అటవీశాఖ చెబుతూ వస్తోంది. ఇప్పుడు వాటి సంరక్షణ బాధ్యత ప్రభుత్వం చేపట్టింది.
200 మాత్రమే..
ఈ జీవులు ఇండో-పసిఫిక్లో చాలా ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. భారతదేశంలో మాత్రం డుగాంగ్ సంతతి బాగా తగ్గిపోతోందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇప్పుడున్న అంచనాల ప్రకారం కేవలం 200 మాత్రమే దేశ సముద్ర తీరాల్లో ఉన్నట్లుగా వెల్లడిస్తున్నారు. గల్ఫ్ ఆఫ్ మన్నార్తో పాటు అండమాన్ నికోబార్ దీవుల్లోనూ ఇలాంటివి కనిపిస్తుంటాయని అంటున్నారు. గల్ఫ్ ఆఫ్ మన్నార్లోని పాక్ జలసంధి ప్రాంతం వీటి మనుగడకు చాలా అనుకూలంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాంతాన్ని సంరక్షించాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉందని, ఇప్పుడు రాజకీయ నిర్ణయం తీసుకోవడంతో మంచి ఫలితం వచ్చే అవకాశముందని వారు అభిప్రాయపడుతున్నారు.
జీవనశైలి ప్రత్యేకం
డుగాంగ్ జీవి 3 నుంచి 3.5 మీటర్ల పొడవు దాకా పెరుగుతుంటుంది. బరువు సుమారు 300 కిలోల వరకు ఉండొచ్చు. సముద్రంలో తేలియాడుతూ, లోపలికెళ్తూ సందడి చేస్తుంటాయి. ప్రతీ 3, 4 నిమిషాలకోసారి సముద్రజలాల ఉపరితలానికి వచ్చి శ్వాస తీసుకుంటూ ఉంటాయని అంటున్నారు. ఉపరితలం నుంచి సముద్రంలో 10 మీ లోతుదాకా తిరుగుతూ ఉంటాయని, ఒంటరిగా కాకుండా బృందంగా తిరుగుతూ కనిపిస్తుంటాయని అంటున్నారు. తక్కువలోతు ఉన్న సముద్రగర్భంలో పచ్చికలపై తిరుగుతూ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని చెబుతున్నారు.
సరిహద్దుల నిర్ణయం పూర్తి
కన్జర్వేషన్ రిజర్వ్పై తమిళనాడు ప్రభుత్వం వేగంగా స్పందించింది. తాజాగా ఈ ప్రాంతాన్ని డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్గా గుర్తిస్తూ గెజిట్ను కూడా ముద్రించింది. పైగా ఈ ప్రాంతానికి హద్దుల్ని కూడా నిర్ణయించింది. ఈ సరిహద్దులు తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా అదిరంపట్టిణం నుంచి, పుదుక్కొట్టై జిల్లా అమ్మపట్టిణం తీర సముద్రం వరకు నిర్ణయించారు. భూభాగం నుంచి సముద్రలోపలికి సుమారు 10 కి.మీ మేర ప్రాంతాన్ని సరిహద్దు పరిధిలోకి తెచ్చారు. ఇక్కడి సముద్రతీర గర్భంలో సుమారు 12,250 హెక్టార్ల మేర డుగాంగ్లు నివసించేందుకు అనువైన పచ్చికలున్నట్లు అంచనా వేశారు. వాటితో పాటు సముద్ర తీరంలోని సమగ్ర పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచేందుకు 3ఏళ్ల పాటూ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు.
మత్స్యకారుల సాయంతో..
స్థానిక మత్సకారులతో కలిసి వీటి సంరక్షణ బాధ్యతను తీసుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ జీవుల కోసం సుదీర్ఘ ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లుగా చెబుతున్నారు. ఒక్కోసారి మత్స్యకారులు వేసే వలల కారణంగానూ ఇవి మృతిచెందే ప్రమాదముందని, ఇదివరకు ఇలాంటి తప్పిదాలు జరిగాయని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రకటించిన కన్జర్వేషన్ రిజర్వ్ ప్రాంతం బాగా చేపలుపట్టేందుకు ఉపయోగపడేదిగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ వేటకు వెళ్లే కుటుంబాల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని తమిళనాడు ప్రభుత్వం యోచిస్తోంది. వారు చేపలు పట్టుకోవడంతో పాటు డుగాంగ్ల సంరక్షణలో వారినీ భాగస్తుల్ని చేయాలని భావిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434