logo

Jayalalithaa: జయలలితకు స్వీట్స్‌ ఇచ్చి హతమార్చారు: కోవై సెల్వరాజ్‌

జయలలితకు ఎక్కువగా మిఠాయిలు, ఐస్‌క్రీమ్‌ ఇచ్చి చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని ఓపీఎస్‌ మద్దతుదారుడు కోవై సెల్వరాజ్‌ ఆరోపించారు. చెన్నై చేప్పాక్కంలో ఉన్న ప్రెస్‌క్లబ్‌లో శనివారం అరుణా జగదీశన్‌ కమిషన్‌ నివేదిక, ఆరుముగస్వామి కమిషన్‌ నివేదిక గురించి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... ముఖ్యమంత్రి స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Updated : 24 Nov 2022 16:23 IST

ప్యారిస్, న్యూస్‌టుడే: జయలలితకు ఎక్కువగా మిఠాయిలు, ఐస్‌క్రీమ్‌ ఇచ్చి చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని ఓపీఎస్‌ మద్దతుదారుడు కోవై సెల్వరాజ్‌ ఆరోపించారు. చెన్నై చేప్పాక్కంలో ఉన్న ప్రెస్‌క్లబ్‌లో శనివారం అరుణా జగదీశన్‌ కమిషన్‌ నివేదిక, ఆరుముగస్వామి కమిషన్‌ నివేదిక గురించి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... ముఖ్యమంత్రి స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రెండు నివేదికలు బయటకు వచ్చిన స్థితిలో ఎడప్పాడి మాట్లాకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎడప్పాడి తదితర తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. జయలలితను హత్య చేయాలనే ఎక్కువగా మిఠాయిలు, ఐస్‌క్రీమ్‌ ఇచ్చి చిత్రహింసలకు గురిచేసి దారుణంగా హత్య చేశారన్నారు. జయలలితను విదేశాలకు తీసుకెళ్లాలని ఓపీఎస్‌ చెప్పారని, ఆరోగ్యశాఖ మంత్రి సహా పలువురు అమాత్యులు అంగీకరించలేదని తెలిపారు. తగిన విచారణ జరిపి న్యాయం చేయకపోతే జయలలిత సమాధి వద్ద కార్యకర్తలు నిరవధిక నిరాహారదీక్ష చేపడతారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని