ఆకాశమంత ప్రోత్సాహం!
గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు, మురికి వాడల్లోని వారికి విమానాన్ని దగ్గరగా చూసే అవకాశమే ఉండదు. దూరంగా కనిపిస్తే సంబరపడటమే వారికి తెలుసు. అలాంటి ఇళ్ల నుంచి వచ్చిన పిల్లలు.. ఆ విమానాల్లో ప్రయాణిస్తూ ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు.
పేద విద్యార్థుల కోసం విహారయాత్రలు
రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న విధానం
ఈనాడు, చెన్నై: గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు, మురికి వాడల్లోని వారికి విమానాన్ని దగ్గరగా చూసే అవకాశమే ఉండదు. దూరంగా కనిపిస్తే సంబరపడటమే వారికి తెలుసు. అలాంటి ఇళ్ల నుంచి వచ్చిన పిల్లలు.. ఆ విమానాల్లో ప్రయాణిస్తూ ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. అదీ ఆషామాషీగా కాదు! ‘మీరు బాగా చదవండి.. మేం విమానంలో తీసుకెళ్తాం’ అని అధికారులు చెప్పినమాట చెవికెక్కించుకుని.. కష్టపడి ప్రతిభ చూపి ఈ అవకాశాన్ని దక్కించుకున్నారు. అలాంటి పేదవిద్యార్థులు ఇప్పుడు పెరుగుతున్నారు. ఈ తరహా ప్రోత్సాహం రాష్ట్రంలో బాగా పెరుగుతోంది.
దుబాయ్ ప్రయాణానికి ఎంపికైన విద్యార్థులతో చెన్నై మేయర్ ప్రియ, కమిషనర్ గగన్దీప్ సింగ్ తదితరులు
తాజాగా చెన్నై కార్పొరేషన్లో ఓ వినూత్న కార్యక్రమం జరిగింది. చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు దుబాయ్, యూఏఈ వెళ్లే అవకాశం కల్పిస్తామని అధికారులు ప్రకటించారు. ఇందులో 478 పాఠశాలలకు చెందిన పేద విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. 32 మంది ఫైనల్స్కు చేరగా.. 8 మంది విజేతలుగా ఎంపికయ్యారు. ఇందులో 9, 11 తరగతుల వారున్నారు. వీరికిప్పుడు దుబాయ్, యూఏఈ వెళ్లే అవకాశం వచ్చింది. తాజాగా ఈ పిల్లల్ని కార్పొరేషన్ కార్యాలయానికి పిలిచి సత్కరించారు. వీరిని పర్యటనకు సిద్ధం చేస్తున్నామని కమిషనర్ గగన్దీప్సింగ్ బేడీ తెలిపారు. పిల్లల మోముల్లో ఎంత సంబరం కనిపించిందో కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తీపి గుర్తుగా మారిపోయింది.
రెక్కలొచ్చినట్లుగా..
ఏటా రోటరీక్లబ్ వారు ‘వింగ్స్ టు ఫ్లై’ కార్యక్రమం చేపడుతున్నారు. విద్యార్థుల్లో వివిధరకాలుగా అవగాహన వచ్చేలా పలు ప్రదర్శనలు కూడా పెడుతున్నారు. గెలిచినవారిని విమానాల్లో విహారయాత్రకు తీసుకెళ్తుంటారు. గతేడాది కూడా వీరు చెన్నై నగరంలో కార్పొరేషన్ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కోసం ఓ వినూత్న పోటీపెట్టారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యార్థులకు అవకాశమొస్తే ఏమేం చేస్తారనే కోణంలో ఈ పోటీ సాగింది. 5 విడతలుగా జరిగిన ఈ ప్రదర్శనల్లో భారీగా విద్యార్థులు పాల్గొన్నారు. ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. ఇందులో విజేతులుగా నిలిచిన 8మంది విద్యార్థుల్ని విమానంలో లండన్ తీసుకెళ్లారు. అక్కడి సైన్స్ మ్యూజియం, క్యూ గార్డెన్స్ లాంటి ప్రముఖ ప్రాంతాల్లో తిప్పారు. పిల్లలకిది మరుపురాని పర్యటనగా మారింది.
మంచు కొండల్లో..
* విమాన పర్యటనలు విద్యార్థుల్లో పెనుమార్పులు తెస్తున్నాయని విద్యాశాఖ గమనించింది. ఈ నేపథ్యంలో ఈ తరహా ప్రోత్సాహం కోసం వివిధరకాల పోటీలు నిర్వహించడం మంచిదేననే అభిప్రాయానికి వచ్చింది. మహాబలిపురం కేంద్రంగా జరిగిన 44వ చెస్ ఒలింపియాడ్ నేపథ్యంలోనూ పలువురు చిన్నారులకు ప్రత్యేక అవకాశాల్ని ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పిల్లలకు చెస్ పోటీలు నిర్వహించి, విజేతల్ని విమానంలో ఈ పోటీలు చూసేలా చేశారు.
* తిరునెల్వేలి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గతేడాది ఐఐటీ జేఈఈ శిక్షణ కూడా ఇచ్చారు. ఇందులో అద్భుత ప్రతిభ కనబరిచిన 21మంది విద్యార్థులకు తూత్తుకుడి నుంచి చెన్నై మధ్య విమానంలో వచ్చే అవకాశం ఇచ్చారు. ఇక్కడి ఐఐటీ మద్రాస్ సందర్శన, నిపుణులతో మాట్లాడే అవకాశాన్ని కల్పించారు.
* విమాన విహార యాత్రల్లో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ముందుంది. పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు తెచ్చుకున్నవారిలో గతేడాది నవంబరులో 50మంది విద్యార్థుల్ని ఎంపికచేశారు. వీరికి జాతీయస్థాయి విహారానికి తీసుకెళ్లారు. దిల్లీ, కశ్మీరుకు కూడా పంపారు. అక్కడి మంచులోయల్లో వారి ప్రయాణం ఆనందంలో ముంచెత్తింది.
* పేదలకోసం విమానయాన సంస్థలు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 149 మంది పేద విద్యార్థులకు చెన్నై-బెంగళూరు మధ్య విమాన ప్రయాణం చేసే అవకాశాన్ని ఇచ్చారు. ఇందుకోసం స్పైస్జెట్ సంస్థ ఓ ప్రత్యేక విమానాన్నే వీరికోసం కేటాయించింది.
ఆకాశమే హద్దు
రెయిన్డ్రాప్ ఫౌండేషన్ సంస్థ కూడా పిల్లల్ని ప్రోత్సహించడానికి విమానయాన విహారయాత్రలను సిద్ధం చేస్తూ వస్తోంది. ప్రత్యేకించి దివ్యాంగ పిల్లలపై వీరు దృష్టిపెడుతుంటారు. ఇందుకోసం ‘ఆకాశమే హద్దు (వానమే ఎల్లై)’ పేరుతో ఈ సంస్థ ముందుకొచ్చి కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. ఈ తరహా పిల్లల జీవితాల్లో వారికి కనీసం ఒక్కసారైనా ఇలాంటి విమాన విహారయాత్రలకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రయాణానికి అనువుగా ఉన్నవారినే ఎంపిక చేసుకుంటున్నారు. కోయంబత్తూరు-చెన్నై మధ్య విమానాల్లో తీసుకెళ్లడంతో పాటు అక్కడి పర్యాటక ప్రాంతాల్నీ చూపించారు. ఆ సంస్థ ఇలాంటి ప్రణాళికల్ని కొనసాగిస్తోంది.
లండన్ సైన్స్ మ్యూజియంలో..
కశ్మీర్లో గుర్రాలపై విద్యార్థుల సందడి
వారి నవ్వు మర్చిపోలేను
పేద విద్యార్థుల్ని ప్రోత్సహించడం మా బాధ్యత, కార్పొరేషన్ తరఫున వివిధ సంస్థల్ని కలుపుకొని విద్యార్థుల కలలు సాకారమయ్యేలా విమాన విహారయాత్రలకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది వారి చదువుకు ఎంతో ఉపయోగపడుతోంది. మార్కులు సాధించుకోవడంలో వారెంతో వృద్ధి చెందారనేది మాకు అర్థమైంది. పైగా వారి చిరునవ్వు ఎంతో ముచ్చటేస్తోంది. మా కార్యక్రమాలతో అటు పిల్లల్లోనూ పోటీతత్వం ఏర్పడుతోంది. ఇప్పుడు వారు ప్రపంచాన్ని చుట్టొస్తున్నారు. ఇలాంటి మరిన్ని కార్యక్రమాల్ని చేపడతాం.
ప్రియ, చెన్నై మేయర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమ రవాణాకు అడ్డుకట్ట
[ 27-04-2024]
అత్యంత విలువైన వస్తువుల్ని విదేశాల నుంచి అక్రమంగా తెచ్చేందుకు, తీసుకెళ్లేందుకు స్మగ్లర్లు పన్నుతున్న పన్నాగాలు అన్నీఇన్నీ కావు. కరుడుగట్టిన విదేశీ మాఫియాలతో చేతులు కలిపి.. రాష్ట్రాన్ని స్మగ్లర్ల అడ్డాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. -
అట్టహాసంగా ఏఐ హ్యాకథాన్
[ 27-04-2024]
తమిళ భాషలో ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్)తో ‘నాన్ ముదల్వన్-అన్నా యూనివర్సిటీ-గువి తమిళనాడు కోడర్స్ ప్రీˆమియర్ లీగ్’ (ఎన్ఎం-ఏయూ- టీఎన్సీపీఎల్) ఆధ్వర్యంలో జరిగిన హ్యాకథాన్లో రాష్ట్రంలోని 400 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి 82,688 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
హోసూర్లో నీటి ఎద్దడి
[ 27-04-2024]
హోసూర్లో నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుతం 5 వేల లీటర్ల ట్రాక్టర్ ట్యాంకర్ నీరు రూ.1200 పలుకుతోంది. కొద్దిరోజుల కిందట రూ.600గా ఉండేది. -
తాగునీటి ట్యాంకులో ఆవు పేడ
[ 27-04-2024]
తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలో తాగునీటి ట్యాంకులో ఆవు పేడ కలిపిన ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. -
ఓట్ల లెక్కింపు ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష
[ 27-04-2024]
ఓట్ల లెక్కింపు ముందస్తు ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సత్యప్రద సాహు సమీక్ష నిర్వహించారు. -
చెన్నై - తడ జాతీయ రహదారి పనులు వేగవంతం
[ 27-04-2024]
చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిలా తడ వరకు ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మితమవుతోంది. పనులు 95.75 శాతం మేరకు పూర్తయ్యాయి. ఇంకా 1.4 కిలోమీటర్ల దూరానికి జరగాల్సిన పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. -
స్మోక్ బిస్కెట్ల తయారీపై నిషేధం
[ 27-04-2024]
చెన్నైలో లిక్విడ్ నైట్రోజన్ ఉపయోగించి తయారు చేసే స్మోక్ బిస్కెట్లపై నిషేధం విధించినట్లు రాష్ట్ర ఆహార భద్రతాశాఖ పేర్కొంది. -
చెన్నైలో ట్రాఫిక్ ఆంక్షలు
[ 27-04-2024]
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్వే వద్ద మూడు నెలల పాటు ట్రాఫిక్లో మార్పులు చేసినట్టు ఆ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. -
శివకార్తికేయన్ విడుదల చేసిన ఫొటో
[ 27-04-2024]
రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించిన చిత్రం ‘అమరన్’. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాష్ట్రానికి చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ కథా నేపథ్యంతో రూపొందింది. -
నిర్మాత జ్ఞానవేల్రాజా దంపతులపై ఫిర్యాదు
[ 27-04-2024]
సినీ నిర్మాత జ్ఞానవేల్రాజా, అతని భార్య నేహాపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంటి పని మనిషి లక్ష్మిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న ఎన్నికల అధికారులు
[ 27-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కోసం నియమితులైన ఎన్నికల అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని తిరుప్పూర్ నియోజకవర్గ భాజపా అభ్యర్థి మురుగానందం ఆరోపించారు. -
బెదిరింపు రాజకీయాలకు భయపడం
[ 27-04-2024]
బెదిరింపు రాకీయాలకు భయపడబోమని మాజీ గవర్నర్ తమిళిసై తెలిపారు. లోక్సభ ఎన్నికల సమయంలో ఆళ్వార్పేటలోని పోలింగ్బూత్లో ఏజెంట్గా ఉన్న భాజపా నిర్వాహకుడు గౌతమన్పై డీఎంకే వారు దాడి చేశారని తమిళిసై ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్