‘అవన్నీ కట్టుకథలే
సెంగోల్ గురించి అన్నీ కట్టుకథలే చెబుతున్నారని ది హిందూ పబ్లిషింగ్ గ్రూపు డైరెక్టరు ఎన్.రాం తెలిపారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఎన్.రాం
చెన్నై, న్యూస్టుడే: సెంగోల్ గురించి అన్నీ కట్టుకథలే చెబుతున్నారని ది హిందూ పబ్లిషింగ్ గ్రూపు డైరెక్టరు ఎన్.రాం తెలిపారు. నగరంలోని కామరాజర్ ఆడిటోరియంలో ‘దేశియ సిందనైయాళర్గళ్ పేరవై’ తరఫున నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సెంగోల్ గురించి పలు కట్టుకథలు ప్రాచుర్యంలోకి వచ్చాయన్నారు. నటీనటులతో చిత్రీకరించిన కథనూ ఆన్లైన్లో ఉంచారని తెలిపారు. నెహ్రూ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏదైనా కార్యక్రమం నిర్వహించాలా? అని మౌంట్ బాటెన్ ప్రభువు అడిగినట్టు ఎలాంటి ఆధారాలూ లేవన్నారు. దాని గురించి ప్రస్తుతం చెబుతున్నవి అవాస్తవాలని కొట్టిపారేశారు. అధికార మార్పిడి కోసం సెంగోల్ను ఇచ్చినట్టు చెప్పడం కట్టుకథని, జరగని విషయాన్ని జరిగినట్టు చెప్పడానికి హిందుత్వమే కారణమని ఆరోపించారు. ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత కీలక కార్యక్రమమని, ఆ రోజు నెహ్రూ చేతికి అందించిన బహుమతుల్లో సెంగోల్ కూడా ఒకటని తెలిపారు. దీంతో దానిని మ్యూజియంలో ఉంచారన్నారు. వివరాల్లో గోల్డెన్ స్టిక్ అనే రాసి ఉంచారని, వాకింగ్ స్టిక్ అని రాయలేదని తెలిపారు. టీఎన్సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి మాట్లాడుతూ... సెంగోల్ అనేది గర్వకారణమైన విషయం కాదన్నారు. మోదీ మళ్లీ రాచరిక పాలనను తీసుకురావడానికి ఈ సెంగోల్ను తెచ్చారని విమర్శించారు. ఈ చర్యల్లో రాజకీయ ఉద్దేశం ఉందన్నారు. కార్యక్రమానికి తమిళనాడుకు చెందిన ఆధీనాన్ని మాత్రమే ఎందుకు ఆహ్వానించారని, క్రైస్తవ, ముస్లిం తదితర మత పెద్దలను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434