ఐఐటీఎంలో కొత్త కోర్సు ప్రారంభం
రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల రంగాన్ని బాగా అభివృద్ధి చేసేందుకు ఐఐటీఎం ‘ఎలక్ట్రానిక్ సిస్టమ్స్’లో బీఎస్ డిగ్రీ కోర్సును లాంఛనంగా ప్రారంభించింది. అభివృద్ధి చెందుతూ, ఎలక్ట్రానిక్స్ రంగంలో కొత్తగా వస్తున్న డిమాండ్లకు అనుగుణంగా నూతన కోర్సును డిజైన్ చేశారు.
వడపళని, న్యూస్టుడే: రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల రంగాన్ని బాగా అభివృద్ధి చేసేందుకు ఐఐటీఎం ‘ఎలక్ట్రానిక్ సిస్టమ్స్’లో బీఎస్ డిగ్రీ కోర్సును లాంఛనంగా ప్రారంభించింది. అభివృద్ధి చెందుతూ, ఎలక్ట్రానిక్స్ రంగంలో కొత్తగా వస్తున్న డిమాండ్లకు అనుగుణంగా నూతన కోర్సును డిజైన్ చేశారు. పారిశ్రామిక రంగ నిపుణులను సంప్రదించి, వారి సలహాలు, సూచనల మేరకు సిలబస్ రూపొందించారు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఐఐటీ సెంటర్ ఫర్ ఔట్ రీచ్, డిజిటల్ ఎడ్యుకేషన్ (సీˆఓడీఈ) ఆచార్యులు, అసోసియేట్ ఛైర్ ఆండ్రూ తంగరాజ్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా సంభావ్యత (పొటెన్షియల్) ఎక్కువగా ఉందన్నారు. అందుకు ఐఐటీలో ప్రారంభించిన బీఎస్ ‘ఎలక్ట్రానిక్ సిస్టమ్స్’ కోర్సు చాలా ఉపయోగకరంగా ఉండగలదని చెప్పారు. కోర్సుతో ఆటోమోటివ్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, మొబైల్, మెడికల్ ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగాలకు దోహద పడుతుందన్నారు. కోర్సులో భాగంగా విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశాలుంటాయని చెప్పారు. ఆయా సంస్థల్లో పని చేస్తున్న సమయంలో పరిశ్రమల గురించి తెలుసుకోగలరన్నారు. ఇంటర్న్షిప్లో ఉన్న వారికి సముచిత స్టయిఫండు అందుతుందని తెలిపారు. ఇది ఆఫ్లైన్లో ఉంటుంది. ప్లస్టూ ఉత్తీర్ణులై గణితం, భౌతిక శాస్త్రంతో చదివిన వారు వయో పరిమితితో సంబంధం లేకుండా చేరవచ్చు. తరగతులు ఆన్లైన్లో ఉంటాయి. అన్ని రకాలైన సందేహాలు ఆన్లైన్లో నివృత్తి చేసుకోవాల్సి ఉంటుంది. క్విజ్లు, పరీక్షలు, ల్యాబ్ పరీక్షలకు నేరుగా హాజరు కావాలి. ల్యాబ్ కోర్సులు ఐఐటీ మద్రాస్ ప్రాంగణంలో జరుగుతాయి. 2025 నాటికి 100 బిలియన్ల యూఎస్ డాలర్లకు చేరుకోవాలనేది ‘తమిళనాడు ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ మానుఫ్యాక్చరింగ్ పాలసీ’ ఆలోచనగా ఉంది. ఆ నాటికి మొత్తం ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో 25శాతం ఎగుమతి చేయాలని కూడా ప్రభుత్వం అనుకుంటోంది. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగు విభాగ ఆచార్యులు బాబి జార్జి, ఆచార్యులు ఎస్.అనిరుద్ధన్ బీఎస్ కోర్సు గురించి వివరించారు. కోర్సులో చేరాలనుకునే ఔత్సాహికులు ఈ నెల 25వ తేదీలోగా https://study.iitm.ac.in/es/ లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు