Vijay: దళపతి దారెటు!.. ‘బీ టీమ్’గా ఎవరికివారే ముద్ర
ప్రముఖ నటుడు సూపర్స్టార్ రజనీకాంత్.. తాను సరైన సమయంలో రాజకీయరంగ ప్రవేశం చేస్తానని అభిమానులను ఊరించి చివరి నిమిషంలో రాజకీయాల్లోకి రావట్లేదని ప్రకటించి అభిమానుల ఆశలు నీరుగార్చారు.
విమర్శలు తీవ్రతరం చేసిన పలు పార్టీలు
విజయ్తో పార్టీ ప్రధాన కార్యదర్శి బస్సీ ఆనంద్
న్యూస్టుడే, వేలచ్చేరి : ప్రముఖ నటుడు సూపర్స్టార్ రజనీకాంత్.. తాను సరైన సమయంలో రాజకీయరంగ ప్రవేశం చేస్తానని అభిమానులను ఊరించి చివరి నిమిషంలో రాజకీయాల్లోకి రావట్లేదని ప్రకటించి అభిమానుల ఆశలు నీరుగార్చారు. కానీ నటుడు దళపతి విజయ్ అలాకాకుండా తాను చెప్పిన సమయానికి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించి రాజకీయ అరంగేట్రం చేయడంతో పలు పార్టీల నేతలు సంప్రదాయానికి స్వాగతిస్తున్నా లోలోపల మదనపడుతున్నారు.
ప్రజాసేవతో మార్గం సిద్ధం
విజయ్కు వ్యక్తిగతంగా రాజకీయ అనుభవం లేకున్నా తన అభిమాన సంఘాల ద్వారా గత కొంతకాలంగా ప్రజా సేవలో ఉన్నారు. పాఠశాల విద్యార్థులకు ఆర్థికసాయం, పేదలకు అన్నదానం, విపత్తుల సమయంలో సహాయం చేయడం వంటి కార్యక్రమాలతో ప్రజలకు చేరువై అభిమాన సంఘాల ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ ద్వారా తన రాజకీయ రంగ ప్రవేశానికి మార్గం సిద్ధం చేసుకున్నారు. విజయ్ తాను నటించిన ప్రతి సినిమాలో రాజకీయ అంశాలను వ్యక్తపరచడంతో ఆ చిత్రాల విడుదలకు అనేక సమస్యలు ఎదురవుతూ వచ్చాయి. 2011లో ‘కావలన్’ చిత్రానికి డీఎంకే ప్రభుత్వం ఆటంకాలు సృష్టించడంతో తరువాత ఎన్నికల్లో అన్నాడీఎంకేకు మద్దతు తెలిపారు. అన్నాడీఎంకే గెలుపొందిన తరువాత తాను ఉడుతగా పార్టీ విజయానికి కృషి చేశానని చెప్పడంతో జయలలిత ఆగ్రహానికి గురయ్యాడు.
పార్టీ ప్రకటనకు ముందే పోటీ
తరువాత డీఎంకే, అన్నాడీఎంకే, భాజపా ఇలా ఏదో ఒక పార్టీని లక్ష్యంగా చేసుకుని సినిమాల్లో డైలాగులు ఉండేలా చూసుకున్నారు. అదేవిధంగా సినీ పాటల విడుదల కార్యక్రమాల్లో పాల్గొని వివాదాస్పద వ్యాఖ్యలు చేయసాగారు. రాజకీయ ప్రకటనకు ముందే గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ తరఫున అనేక మంది పోటీ చేసి గెలుపొందారు. వీటన్నింటిని బేరీజు వేసుకుని కొన్నిరోజుల క్రితం ‘తమిళగ వెట్రి’ పార్టీని ప్రారంభించారు. అదే సమయంలో విజయ్ పార్టీని ప్రారంభించిన సమయంలో విడుదల చేసిన ప్రకటనలో.. తన పార్టీ పరిపాలనలో దుర్వినియోగాలు, అవినీతి, కులమతాల తేడాలు ఉండవని పేర్కొన్నారు.
విమర్శలూ ఎక్కువే..
డీఎంకే వైపున ఉన్న మైనార్టీలు, యువత ఓట్లను రాబట్టేందుకు భాజపా పంపిన వ్యక్తిగా విజయ్ని ఓ వైపు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా అన్నామలై ఎదుగుదలను నిరోధించేందుకు డీఎంకే తరఫున వచ్చిన వ్యక్తిగా భాజపా అదేస్థాయిలో విమర్శిస్తోంది. రజనీకాంత్ను రాజకీయాల్లో తీసుకు రాలేకపోవడంతో నిరాశతో ఉన్న భాజపా విజయ్ను రంగంలోకి దింపిందని మరో వైపు అన్నాడీఎంకే వ్యంగ్యాస్త్రాలు సందిస్తోంది. యువతలో మంచి పేరున్న సీమాన్ ప్రాభవాన్ని తగ్గించడం కోసమే రంగంలోకి దింపారని నామ్ తమిళర్ కట్చి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇలా విజయ్ తన రాజకీయ పార్టీని ప్రకటించినప్పటి నుంచి ఆయనపై ‘బీ టీమ్’ అనే ముద్ర పడింది. తన రాజకీయ నినాదాలను తెరపైకి తెచ్చిన విజయ్ ఇంకా స్పష్టమైన విధానాల ప్రకటనతో బయటకు రాలేదు. అయితే డీఎంకే, అన్నాడీఎంకే, భాజపాకు వ్యతిరేకంగా ఆయన రాజకీయం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమ రవాణాకు అడ్డుకట్ట
[ 27-04-2024]
అత్యంత విలువైన వస్తువుల్ని విదేశాల నుంచి అక్రమంగా తెచ్చేందుకు, తీసుకెళ్లేందుకు స్మగ్లర్లు పన్నుతున్న పన్నాగాలు అన్నీఇన్నీ కావు. కరుడుగట్టిన విదేశీ మాఫియాలతో చేతులు కలిపి.. రాష్ట్రాన్ని స్మగ్లర్ల అడ్డాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. -
అట్టహాసంగా ఏఐ హ్యాకథాన్
[ 27-04-2024]
తమిళ భాషలో ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్)తో ‘నాన్ ముదల్వన్-అన్నా యూనివర్సిటీ-గువి తమిళనాడు కోడర్స్ ప్రీˆమియర్ లీగ్’ (ఎన్ఎం-ఏయూ- టీఎన్సీపీఎల్) ఆధ్వర్యంలో జరిగిన హ్యాకథాన్లో రాష్ట్రంలోని 400 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి 82,688 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
హోసూర్లో నీటి ఎద్దడి
[ 27-04-2024]
హోసూర్లో నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుతం 5 వేల లీటర్ల ట్రాక్టర్ ట్యాంకర్ నీరు రూ.1200 పలుకుతోంది. కొద్దిరోజుల కిందట రూ.600గా ఉండేది. -
తాగునీటి ట్యాంకులో ఆవు పేడ
[ 27-04-2024]
తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలో తాగునీటి ట్యాంకులో ఆవు పేడ కలిపిన ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. -
ఓట్ల లెక్కింపు ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష
[ 27-04-2024]
ఓట్ల లెక్కింపు ముందస్తు ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సత్యప్రద సాహు సమీక్ష నిర్వహించారు. -
చెన్నై - తడ జాతీయ రహదారి పనులు వేగవంతం
[ 27-04-2024]
చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిలా తడ వరకు ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మితమవుతోంది. పనులు 95.75 శాతం మేరకు పూర్తయ్యాయి. ఇంకా 1.4 కిలోమీటర్ల దూరానికి జరగాల్సిన పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. -
స్మోక్ బిస్కెట్ల తయారీపై నిషేధం
[ 27-04-2024]
చెన్నైలో లిక్విడ్ నైట్రోజన్ ఉపయోగించి తయారు చేసే స్మోక్ బిస్కెట్లపై నిషేధం విధించినట్లు రాష్ట్ర ఆహార భద్రతాశాఖ పేర్కొంది. -
చెన్నైలో ట్రాఫిక్ ఆంక్షలు
[ 27-04-2024]
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్వే వద్ద మూడు నెలల పాటు ట్రాఫిక్లో మార్పులు చేసినట్టు ఆ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. -
శివకార్తికేయన్ విడుదల చేసిన ఫొటో
[ 27-04-2024]
రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించిన చిత్రం ‘అమరన్’. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాష్ట్రానికి చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ కథా నేపథ్యంతో రూపొందింది. -
నిర్మాత జ్ఞానవేల్రాజా దంపతులపై ఫిర్యాదు
[ 27-04-2024]
సినీ నిర్మాత జ్ఞానవేల్రాజా, అతని భార్య నేహాపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంటి పని మనిషి లక్ష్మిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న ఎన్నికల అధికారులు
[ 27-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కోసం నియమితులైన ఎన్నికల అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని తిరుప్పూర్ నియోజకవర్గ భాజపా అభ్యర్థి మురుగానందం ఆరోపించారు. -
బెదిరింపు రాజకీయాలకు భయపడం
[ 27-04-2024]
బెదిరింపు రాకీయాలకు భయపడబోమని మాజీ గవర్నర్ తమిళిసై తెలిపారు. లోక్సభ ఎన్నికల సమయంలో ఆళ్వార్పేటలోని పోలింగ్బూత్లో ఏజెంట్గా ఉన్న భాజపా నిర్వాహకుడు గౌతమన్పై డీఎంకే వారు దాడి చేశారని తమిళిసై ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!