చెన్నై సహా ఐదుచోట్ల ఎన్ఐఏ సోదాలు
బెంగళూరులో బాంబు దాడి వ్యవహారమై రాష్ట్రంలో ఐదుచోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితులు చెన్నై ట్రిప్లికేన్లో నెల రోజులకి పైగా ఉండి కుట్ర పన్నిన నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
షేక్ దావూద్ ఇంట్లో పోలీసు భద్రత మధ్య సోదాలు చేస్తున్న ఎన్ఐఏ అధికారులు
ప్యారిస్, న్యూస్టుడే: బెంగళూరులో బాంబు దాడి వ్యవహారమై రాష్ట్రంలో ఐదుచోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితులు చెన్నై ట్రిప్లికేన్లో నెల రోజులకి పైగా ఉండి కుట్ర పన్నిన నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు చెన్నైలో పలు ప్రాంతాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయమై 1000 సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించి, వారిద్దరికి ఎవరెవరితో సంబంధం ఉందనే విషయమై ఆరా తీస్తున్నారు. చెన్నై మన్నడి వినాయగర్ కోవిల్ వీధిలో, మన్నడి మూట్టైక్కారన్ వీధిలో, ట్రిప్లికేన్ లాడ్జిలో బుధవారం సోదాలు చేపట్టారు. రామనాథపురం జిల్లా దేవీపట్టినంలో ఉంటున్న షేక్ దావూద్, అతని తండ్రి ఇళ్లలో తనిఖీలు చేశారు. షేక్ దావూద్పై 2018, 2020లో ఆయుధాలతో ఉన్నట్లు, నిషేధిత సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు, ఆ సంస్థలకు నగదు బదిలీ, యువకులకు బ్రెయిన్ వాష్చేసి శిక్షణ ఇవ్వడం తదితర కేసులు నమోదయ్యాయి. బెంగళూరు బాంబు పేలుడు నిందితులకు ఆశ్రయం ఇచ్చి ఉంటారన్న అనుమానంతో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఆయన ఇంట్లో గత నాలుగేళ్లలో ఎన్ఐఏ అధికారులు మూడుసార్లు సోదాలు చేపట్టారు. కన్యాకుమారి జిల్లా మార్తాండంలో అద్దెకు ఉంటున్న రాజాముత్తు అనే వ్యక్తి ఇంట్లోనూ తనిఖీలు చేశారు. బాంబుపేలుడు ఘటనలో సంబంధం ఉన్న నిందితులకు సాయం చేసిన వారిని గురిం్తచేందుకు ఈ సోదాలు జరిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమ రవాణాకు అడ్డుకట్ట
[ 27-04-2024]
అత్యంత విలువైన వస్తువుల్ని విదేశాల నుంచి అక్రమంగా తెచ్చేందుకు, తీసుకెళ్లేందుకు స్మగ్లర్లు పన్నుతున్న పన్నాగాలు అన్నీఇన్నీ కావు. కరుడుగట్టిన విదేశీ మాఫియాలతో చేతులు కలిపి.. రాష్ట్రాన్ని స్మగ్లర్ల అడ్డాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. -
అట్టహాసంగా ఏఐ హ్యాకథాన్
[ 27-04-2024]
తమిళ భాషలో ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్)తో ‘నాన్ ముదల్వన్-అన్నా యూనివర్సిటీ-గువి తమిళనాడు కోడర్స్ ప్రీˆమియర్ లీగ్’ (ఎన్ఎం-ఏయూ- టీఎన్సీపీఎల్) ఆధ్వర్యంలో జరిగిన హ్యాకథాన్లో రాష్ట్రంలోని 400 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి 82,688 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
హోసూర్లో నీటి ఎద్దడి
[ 27-04-2024]
హోసూర్లో నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుతం 5 వేల లీటర్ల ట్రాక్టర్ ట్యాంకర్ నీరు రూ.1200 పలుకుతోంది. కొద్దిరోజుల కిందట రూ.600గా ఉండేది. -
తాగునీటి ట్యాంకులో ఆవు పేడ
[ 27-04-2024]
తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలో తాగునీటి ట్యాంకులో ఆవు పేడ కలిపిన ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. -
ఓట్ల లెక్కింపు ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష
[ 27-04-2024]
ఓట్ల లెక్కింపు ముందస్తు ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సత్యప్రద సాహు సమీక్ష నిర్వహించారు. -
చెన్నై - తడ జాతీయ రహదారి పనులు వేగవంతం
[ 27-04-2024]
చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిలా తడ వరకు ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మితమవుతోంది. పనులు 95.75 శాతం మేరకు పూర్తయ్యాయి. ఇంకా 1.4 కిలోమీటర్ల దూరానికి జరగాల్సిన పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. -
స్మోక్ బిస్కెట్ల తయారీపై నిషేధం
[ 27-04-2024]
చెన్నైలో లిక్విడ్ నైట్రోజన్ ఉపయోగించి తయారు చేసే స్మోక్ బిస్కెట్లపై నిషేధం విధించినట్లు రాష్ట్ర ఆహార భద్రతాశాఖ పేర్కొంది. -
చెన్నైలో ట్రాఫిక్ ఆంక్షలు
[ 27-04-2024]
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్వే వద్ద మూడు నెలల పాటు ట్రాఫిక్లో మార్పులు చేసినట్టు ఆ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. -
శివకార్తికేయన్ విడుదల చేసిన ఫొటో
[ 27-04-2024]
రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించిన చిత్రం ‘అమరన్’. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాష్ట్రానికి చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ కథా నేపథ్యంతో రూపొందింది. -
నిర్మాత జ్ఞానవేల్రాజా దంపతులపై ఫిర్యాదు
[ 27-04-2024]
సినీ నిర్మాత జ్ఞానవేల్రాజా, అతని భార్య నేహాపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంటి పని మనిషి లక్ష్మిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న ఎన్నికల అధికారులు
[ 27-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కోసం నియమితులైన ఎన్నికల అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని తిరుప్పూర్ నియోజకవర్గ భాజపా అభ్యర్థి మురుగానందం ఆరోపించారు. -
బెదిరింపు రాజకీయాలకు భయపడం
[ 27-04-2024]
బెదిరింపు రాకీయాలకు భయపడబోమని మాజీ గవర్నర్ తమిళిసై తెలిపారు. లోక్సభ ఎన్నికల సమయంలో ఆళ్వార్పేటలోని పోలింగ్బూత్లో ఏజెంట్గా ఉన్న భాజపా నిర్వాహకుడు గౌతమన్పై డీఎంకే వారు దాడి చేశారని తమిళిసై ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్