అన్యాయం జరిగింది.. ఆపండి!
స్టాఫ్నర్స్ పోస్టుల కౌన్సెలింగ్లో అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు నిరసన తెలియజేశారు. కొవిడ్ కాలంలో పనిచేసిన ఎస్సీ అభ్యర్థులకు మార్కులు వేయడంలో, జాబితా పొందుపర్చడంలో తప్పిదాలు జరిగాయని, కౌన్సెలింగ్ వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
స్టాఫ్నర్స్ల కౌన్సెలింగ్ కేంద్రం వద్ద ఆందోళన
కౌన్సెలింగ్ కేంద్రం వద్ద నిరసన తెలియజేస్తున్న అభ్యర్థులు
సీతంపేట, న్యూస్టుడే: స్టాఫ్నర్స్ పోస్టుల కౌన్సెలింగ్లో అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు నిరసన తెలియజేశారు. కొవిడ్ కాలంలో పనిచేసిన ఎస్సీ అభ్యర్థులకు మార్కులు వేయడంలో, జాబితా పొందుపర్చడంలో తప్పిదాలు జరిగాయని, కౌన్సెలింగ్ వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్యశాఖ జోన్- 1 పరిధిలో విశాఖ రామాటాకీస్ రోడ్డులోని ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభించగా.. ఉదయం 11 గంటల నుంచే ఈ నిరసన మొదలయింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ద్వారకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సి.ఐ. సింహాద్రినాయుడు ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
సమస్య ఇదీ: ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కాంట్రాక్టు పద్ధతిలో 179 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ గతంలో విడుదల చేశారు. 172 పోస్టులకు సుమారు 9వేల దరఖాస్తులు అందాయి. వీటిలో మెరిట్, రిజర్వేషన్ ప్రక్రియ కింద ఎంపిక చేసిన వారి సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 18వ తేదీ వరకు చేశారు. అనంతరం అదే రోజు రాత్రి మెరిట్ జాబితా, తద్వారా ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో పొందుపర్చారు. దీని ఆధారంగా శుక్రవారం ఉదయం 11గంటల నుంచి కౌన్సెలింగ్ ప్రారంభించి, వచ్చిన అభ్యర్థులకు ఖాళీల ఆధారంగా పోస్టులు కేటాయించి ఉత్తర్వులు అందించి పంపించారు. అయితే మెరిట్, ఎంపిక జాబితాలు రెండూ వెబ్సైట్లో పొందుపర్చారు. మెరిట్ జాబితాను రెండు సార్లు పెట్టడంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. ఈ కౌన్సెలింగ్పై కలెక్టర్తో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి నిలిపుదల చేయిస్తామని ఎ.ఐ.టి.యు.సి ప్రతినిధి అమర్ తెలిపారు.
* వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ ఉమా సుందరి పోలీసుల రక్షణలో నిరసన తెలియజేస్తున్న అభ్యర్థుల నుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే నడుచుకున్నామన్నారు. సిబ్బంది కొరత కారణంగా తొలి జాబితాలో తప్పు దొర్లిన విషయం వెలుగు చూసిందని, దీంతో క్షుణ్ణంగా పరిశీలించి తుది జాబితా విడుదల చేశామన్నారు.
* పసి పిల్లలతో వచ్చి: కౌన్సెలింగ్ కోసం వచ్చిన అభ్యర్థులు పలు తిప్పలు పడ్డారు. నిల్చోవడానికి టెంట్లు వేసినప్పటికీ తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదని పలువురు ఆరోపించారు. అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వక పోవడంతో మెరిట్ జాబితాలో ఉన్న చాలామంది ఉత్తరాంధ్రలోని మారూమూల ప్రాంతాల నుంచి సహాయకుల సహాయంతో వచ్చారు. కొంతమంది తల్లులు పసిపిల్లలతో సైతం కౌన్సెలింగ్ కేంద్రానికి చేరుకున్నారు.
* కౌన్సెలింగ్కి 136మంది హాజరు: కౌన్సెలింగ్కు 172 మందిని పిలవగా 136 మంది అభ్యర్థులు హాజరైనట్లు ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ ఉమా సుందరి తెలిపారు. మొత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 108 పోస్టులకు 81, విమ్స్లోని 24 పోస్టులకు 18, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ)లో 47 పోస్టులకు 29 మాత్రమే భర్తీ అయ్యాయని, 8మంది అభ్యర్థులు సుముఖత చూపలేదన్నారు. ఎంపికైన అభ్యర్థులు వెంటనే విధుల్లో చేరాలని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల విధుల్లో.. ఎన్ని బాధలో!!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పించడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. -
కీలక పోరు.. ఓటర్ల జోరు
[ 19-05-2024]
విశాఖ లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2019 ఎన్నికలతో పోల్చితే పోలింగ్ శాతం బాగానే పెరిగింది. -
ఎన్నికల ఖర్చులకు రూ.12 కోట్లు విడుదల
[ 19-05-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి నిర్వహించిన ఎన్నికల ఖర్చు కోసం రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా రూ.12 కోట్లు విడుదల చేసింది. -
పోలింగులో యువ వెల్లువ
[ 19-05-2024]
ఎన్నికల్లో యువత తమ ఓటు హక్కును వినియోగించుకోడానికి వెల్లువలా తరలివచ్చారు. -
ఓట్ల గణనకు 14 టేబుళ్లు.. 800మందికి పైగా సిబ్బంది
[ 19-05-2024]
జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు లెక్కింపునకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
చిరంజీవిని కలిసిన గంటా
[ 19-05-2024]
భీమిలి అసెంబ్లీ అభ్యర్థి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం హైదరాబాద్లో సినీ నటులు, మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. -
‘అందరి సహకారంతో చందనోత్సవం విజయవంతం’
[ 19-05-2024]
సింహాచలం దేవస్థానం తొలిసారిగా ప్రవేశపెట్టిన విద్యుత్తు బస్సును అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రారంభించారు. -
తెలంగాణ ఎప్సెట్ ఫలితాల్లో సత్తా
[ 19-05-2024]
తెలంగాణ రాష్ట్ర ఎప్సెట్ ఫలితాలలో నగరానికి చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారు. -
పట్టభద్రుల నెత్తిన మట్టితట్టలు
[ 19-05-2024]
ఏటా డిగ్రీ, బీటెక్లు పూర్తిచేసి కళాశాలల నుంచి బయటకు వస్తున్న పట్టభద్రులు వేల సంఖ్యలో ఉంటున్నారు. వీరికి గత అయిదేళ్లలో ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపలేకపోయారు. -
వేసవి శిక్షణ ఇంతేసంగతులా?
[ 19-05-2024]
ఈ ఏడాది వేసవి క్రీడా శిక్షణ తరగతులు లేనట్లేనని క్రీడా శాఖ ఉన్నతాధికారులు తేల్చేశారు. -
సైబర్ మాయగాళ్ల ఉచ్చులో నగర యువత
[ 19-05-2024]
ఉద్యోగం సంపాదించాలి...కుటుంబాన్ని పోషించాలి అనే ఒకే ఒక్క ఆశతో ‘ఏజెంట్ల’ను నమ్మిన యువకులు సైబర్నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. -
ఆసక్తికరం.. 1.75 కోట్ల పందెం
[ 19-05-2024]
ఓటర్ల తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉండగా గెలుపుపై నేతలు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. -
ప్రయాణికుల రద్దీతో ప్రత్యేక రైళ్లు
[ 19-05-2024]
వేసవి సెలవులతో ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో వేసవి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు.