నిధుల కోత.. అభివృద్ధికి వాత!
జిల్లాపరిషత్తు ప్రాదేశిక సభ్యులకు తమ పరిధిలో అభివృద్ధి పనుల కోసం కేటాయించే నిధుల్లో ఈ ఏడాది కొంత కోతపెట్టారు.
జడ్పీటీసీ సభ్యులకు తగ్గిన కేటాయింపులు
ప్రహరీకి నోచుకోని రాజయ్యపేట అంగన్వాడీ కేంద్రం
ఈనాడు డిజిటల్, అనకాపల్లి: జిల్లాపరిషత్తు ప్రాదేశిక సభ్యులకు తమ పరిధిలో అభివృద్ధి పనుల కోసం కేటాయించే నిధుల్లో ఈ ఏడాది కొంత కోతపెట్టారు. ఓవైపు మండలస్థాయి సమావేశాల్లో తమకు గుర్తింపు ఉండడం లేదని, ప్రొటోకాల్ పాటించడం లేదని ఇప్పటికే జడ్పీటీసీ సభ్యులు గగ్గోలుపెడుతున్నారు. ఇప్పుడు తమకిచ్చే అరకొర నిధులను తగ్గిస్తే ప్రజల్లోకి ఎలా వెళ్లాలంటూ ఆవేదన చెందుతున్నారు. ఇటీవలే జడ్పీటీసీ సభ్యులతో పనుల పంపకంపై ప్రత్యేకంగా జడ్పీ ఛైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర సమావేశమై చర్చించారు. ఆ సమయంలో కొంతమంది సభ్యులు నిధుల కోత, బిల్లుల చెల్లింపుల్లో జాప్యంపైనా అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
జడ్పీటీసీ సభ్యులకు ఏటా జిల్లా పరిషత్తు సాధారణ, ఆర్థిక సంఘం నిధుల నుంచి కొంతమేర నిధులు కేటాయిస్తుంటారు. వాటిని ఒకే పనిపై మొత్తం ఖర్చుచేయకుండా ఉపాధిహామీ పథకం నిధులకు అనుసంధానించి ఎక్కువ పనులు జరిగేలా చూస్తుంటారు. తాగునీరు, సామాజిక భవనాలు, అంగన్వాడీ కేంద్రాల మరమ్మతులు, కాలువలు, సీసీ రహదారుల నిర్మాణాల లాంటి వాటికే వీటిని ఉపయోగిస్తుంటారు. 2021-22 ఏడాదికి సంబంధించి 39 మంది జడ్పీటీసీ సభ్యులకు రూ.15 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. వాటితో ప్రతిపాదించిన పనుల్లో 50 శాతం కూడా పూర్తి చేయలేకపోయారు. ఈ ఏడాదికి వచ్చేసరికి 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ఒక్కో జడ్పీటీసీ సభ్యునికి రూ.13 లక్షలే కేటాయించారు. అంటే ఒక్కో జడ్పీటీసీ సభ్యునికి రూ.2 లక్షలు చొప్పున జిల్లా మొత్తంగా రూ.78 లక్షల నిధులకు కోతపెట్టారు. ఎమ్మెల్యేలకు మొదటి ఏడాది రూ.50 లక్షలు చొప్పున కేటాయిస్తే ఈ ఏడాదికి వచ్చేనాటికి రూ.13 లక్షలకే పరిమితం చేసినట్లు తెలిసింది. ఈ నిధులు కూడా ఇంకా జడ్పీ ఖాతాకు చేరలేదు. వీటితో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని ముందే అడుగుతున్నారు. నిధులున్నా బిల్లులందని పరిస్థితి ఉంటే ఇంకా నిధులు రానివాటికి ప్రతిపాదనలు అడగడంపై సభ్యుల నుంచి విస్మయం వ్యక్తమవుతోంది.
భీమవరంలో జడ్పీ నిధులతో ప్రతిపాదించిన కాలువ
పనులు సాగవు.. బిల్లులందవు..
* ఎస్.రాయవరానికి మొదటి విడతగా రూ.16 లక్షల జడ్పీ నిధులు మంజూరయ్యాయి. వీటిని తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించారు. భీమవరంలో రూ.3 లక్షలతో కాలువ నిర్మించాలని ప్రతిపాదించి నిధులు సరిపోవని వదిలేశారు..ఈ ఏడాది చేద్దామనుకుంటే నిధులు తగ్గించి ఇవ్వడంతో ఆ పని ముందుకు వెళ్లే అవకాశం కనిపించడం లేదు.
* నక్కపల్లి మండలంలో వివిధ అభివృద్ధి పనులకు గతేడాది రూ. 15 లక్షలు కేటాయించారు. వాటితో పలు గ్రామాల్లో తాగునీటి పైపులు, ఎస్సీ కాలనీల్లో సామాజిక భవనాలు, తరగతి గదుల మరమ్మతులతో పాటు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.60 వేల నుంచి రూ.3 లక్షలకు పైబడి మొత్తం పది పనులకు కేటాయించారు. తీరా ఏడాది పూర్తయినా ఈ పనుల్లో ఒక్కటీ ముందుకు వెళ్లలేదు.. గతంలో చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో గుత్తేదారులు ఎవరూ ఆసక్తి చూపలేదు..
* అనంతగిరి మండలంలో జడ్పీ నిధుల నుంచి ఆరు పనులు చేశారు. వాటిలో ఒక్క పనికి కూడా బిల్లులు రాకపోవడంతో గుత్తేదారులు జడ్పీటీసీ సభ్యుని చుట్టూ తిరుగుతున్నారు.. ఈనెల 10 లోగా పనుల వివరాలను సీఎఫ్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేయకుంటే బిల్లులు అందడం కష్టమేనని తెలియడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.
సభ్యులతో చర్చించే కేటాయింపు..
- శ్రీరామమూర్తి, జడ్పీ సీఈవో, ఉమ్మడి జిల్లా
గతేడాది పనులన్నీ పురోగతిలో ఉన్నాయి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగకుండా ఛైర్పర్సన్ చూస్తున్నారు. సభ్యులందరితో చర్చించాకే ఈ ఏడాది నిధులు కేటాయింపులు జరిగాయి. జడ్పీకి 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.9.5 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వీటితో చేపట్టే పనుల విషయంలో ఆందోళన అవసరం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చింది.. ఆటో డ్రైవర్లను జగన్ ఆదుకుంటాడని అంతా ఊహించారు. రూ.పది వేల సాయం చేశాడని సంబరపడిపోయారు. ఆటోల మీద పన్నుల బాదుడు మొదలైన తరువాత కొద్ది రోజులకే పరిస్థితి వారికి అర్థమైంది. -
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడాశాఖను నిర్వీర్యం చేసింది. క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. -
పేట వైకాపాలో రోజుకో వికెట్
[ 27-04-2024]
వైకాపా నుంచి రోజుకో వికెట్ పడుతోంది. తెదేపాలోకి చేరేందుకు నాయకులు క్యూ కడుతుండటంతో ఆ పార్టీ నాయకులకు శిరోభారం తప్పడం లేదు. -
ఎన్నికల వేళ..‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
విశాఖ లోక్సభ స్థానానికి 33 నామపత్రాల ఆమోదం
[ 27-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి దాఖలైన 39 నామపత్రాల్లో 33 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ), కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆమోదించారు. -
‘విశాఖ - మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు. -
ఎంపీ అభ్యర్థుల నామినేషన్లలో 22 ఆమోదం
[ 27-04-2024]
అనకాపల్లి ఎంపీ స్థానానికి 25 మంది అభ్యర్థుల నామినేషన్లలో మూడింటిని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవి తిరస్కరించారు. -
జగన్ వాహన మిత్రద్రోహి
[ 27-04-2024]
ఆటోలు, టాక్సీలు, మ్యాక్సీ క్యాబ్లు నడుపుతూ జీవనం సాగించే వారికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటిస్తూ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వాహన మిత్ర పథకం.. వాహన చోదకుల పాలిట శాపంగా మారింది. -
అనువుగాని ప్రాంగణం.. ఆడేందుకు అవస్థలు
[ 27-04-2024]
క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయి. నేటి సమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు క్రీడలను జీవనశైలిలో భాగం చేసుకోవాలని వైద్యులు సైతం చెబుతున్నారు. -
రాష్ట్రానికి త్వరలోనే మంచి రోజులు
[ 27-04-2024]
కూటమి విజయంతోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని కూటమి అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ పేర్కొన్నారు. -
కూటమితోనే అన్ని వర్గాలకు న్యాయం
[ 27-04-2024]
ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి చివరికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారని పెందుర్తి తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు ధ్వజమెత్తారు. -
కూటమితోనే బంగారు భవిష్యత్తు
[ 27-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బంగారు భవిష్యత్తు సాధ్యమని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. -
అనుమానం పెనుభూతమై..
[ 27-04-2024]
కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబంలో అనుమానపు బీజం పడింది. -
వైకాపా నాయకులు దోచుకున్న నగదే పంచి పెడుతున్నారు
[ 27-04-2024]
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైకాపా నాయకులు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని, దాన్ని ప్రజలు తిప్పికొట్టాలని భాజపా (కూటమి) అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు అన్నారు. -
జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి
[ 27-04-2024]
వైకాపా పాలనలో రాష్ట్రం అధోగతికి చేరుకుందని తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు గండిబాబ్జీ అన్నారు. -
ఎంవీవీ నామపత్రం ఆమోదంలో ఉత్కంఠ
[ 27-04-2024]
విశాఖ తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ నామపత్రం ఆమోదించే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
సుప్రభాత సేవ టికెట్ల పునః ప్రారంభం
[ 27-04-2024]
శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని రద్దు చేసిన సుప్రభాత సేవ, ఉదయం, సాయంత్రం ఆరాధన సేవల టికెట్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. -
డీఎల్ఈడీలో ప్రవేశాలకు ఆహ్వానం
[ 27-04-2024]
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ)లో ప్రవేశాల కోసం మే 8వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. -
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!