పేట వైకాపాలో రోజుకో వికెట్
వైకాపా నుంచి రోజుకో వికెట్ పడుతోంది. తెదేపాలోకి చేరేందుకు నాయకులు క్యూ కడుతుండటంతో ఆ పార్టీ నాయకులకు శిరోభారం తప్పడం లేదు.
వలసలతో నేతల దిగ్భ్రాంతి
పాయకరావుపేట, న్యూస్టుడే: వైకాపా నుంచి రోజుకో వికెట్ పడుతోంది. తెదేపాలోకి చేరేందుకు నాయకులు క్యూ కడుతుండటంతో ఆ పార్టీ నాయకులకు శిరోభారం తప్పడం లేదు. నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర నుంచి నిన్నటి చంద్రబాబు ప్రజాగళం సభ వరకు పెద్దఎత్తున చేరికలు వచ్చాయి. అధికార పార్టీ నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల వలసలు పెరిగాయి. పట్టణానికి చెందిన మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు గూటూరు శ్రీనివాసరావు వైకాపాను వీడి తెదేపాలో చేరడంతో ఆ పార్టీకి భారీ కుదుపేనని చెప్పాలి. ఆయనతోపాటు పాల్మన్పేట, ఈదటం తదితర గ్రామాల ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు తెదేపా కండువా కప్పుకొన్నారు. నియోజకవర్గ కేంద్రం సుమారు 20 వేల ఓటర్లున్న పేట నుంచి వార్డు సభ్యులు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. సీనియర్ నాయకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు తోట నగేష్ ఇటీవలే జనసేనలో చేరారు. కోటవురట్ల, నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల పరిధిలో రోజూ చేరికల జాతర సాగుతోంది. వైకాపా సానుభూతిపరులు కుటుంబాలతో సహా కూటమి అభ్యర్థి వంగలపూడి అనిత సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. తాజాగా గోపాలపట్నం ఎంపీటీసీ సభ్యుడు, వైకాపా కీలక నాయకుడు కలిదిండి సతీష్రాజు చేరికతో పార్టీకి ఆయా గ్రామాల పరిధిలో మరింత బలం చేకూరింది. ఆయనతోపాటు పలువురు వార్డు సభ్యులు, కార్యకర్తలు ఆయన వెంట తరలివచ్చారు.
వార్డు సభ్యుల చేరికతో నూతన ఉత్సాహం
అనిత సమక్షంలో పార్టీలో చేరిన గోపాలపట్నం ఎంపీటీసీ సభ్యుడు సతీష్రాజు తదితరులు
తాజాగా పట్టణంలోని నాలుగో వార్డు సభ్యుడు దాసరి శ్రీనివాసరావు శనివారం అనిత సమక్షంలో పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం నామవరంలో అనిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వైకాపా నాయకులు పార్టీలోకి రావడంతో అక్కడ నూతనోత్సాహం ఉట్టిపడుతోంది. ఇలా ప్రతిరోజూ తెదేపాలోకి వస్తుండటంతో పూర్తిస్థాయిలో ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతోంది. కూటమి నాయకులు తెదేపా, జనసేన, భాజపా నాయకులంతా నాలుగు వైపుల నుంచి ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ప్రాంతాల వారీగా మోదీ, చంద్రబాబు, పవన్కల్యాణ్ ఆశయాలను, పథకాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. పార్టీ నుంచి వరుసగా నాయకులు వీడుతుండటంతో వైకాపా పెద్దలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎన్నికల ముందు ఆపార్టీపై తీవ్రప్రభావం చూపుతోందంటూ ఆందోళన చెందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రమోదీయం.. జనామోదం
[ 07-05-2024]
ప్రధాని మోదీ, తెదేపా అధినేత చంద్రబాబు కలయికతో ఉత్తరాంధ్ర పులకించింది. తాళ్లపాలెం వద్ద సోమవారం జరిగిన ప్రజాగళం సభకు అంచనాలకు మించి జనం తరలివచ్చారు. -
విత్తు ధర పెంచి చిత్తు చేశావు!
[ 07-05-2024]
కొందరు ప్రైవేటుగా విత్తనాలు కొనుగోలు చేస్తుంటారు. వారికి ఎలాంటి రాయితీ వర్తించదు. గరిష్ఠ చిల్లర ధరకే విత్తనాలు కొనుగోలు చేయాలి. వారిపై ధరల పెరుగుదల భారం మూడింతలు పడింది. -
జగన్ ఏలుబడిలో... అంగన్వాడీల అగచాట్లు
[ 07-05-2024]
అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏ వర్గాన్నీ విడిచిపెట్టకుండా చిత్రహింసలకు గురి చేసింది. ఇందులో అంగన్వాడీలు పడ్డ ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. -
ఉద్యోగులపై వైకాపా ప్రలోభాల వల
[ 07-05-2024]
ఈ ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లు కీలకం కానున్నాయి. దీంతో అధికార వైకాపా నాయకులు వారిని పెద్దఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నారు. -
వైకాపా హయాంలో..అన్నీ నేరాలే!
[ 07-05-2024]
వైకాపా హయాంలో విశాఖను గంజాయి హబ్గా మార్చారని విశాఖపట్నం కూటమి తెదేపా ఎంపీ అభ్యర్థి భరత్ విమర్శించారు. -
మూడు పార్టీల కూటమితోనే ఉత్తరాంధ్ర ప్రగతి
[ 07-05-2024]
‘యువత సైకిల్ ఎక్కాలి. భాజపా, తెదేపా, జనసేన జెండాలు కట్టుకోవాలి. ఒక చేత్తో గాజు గ్లాసు పట్టుకొని, కమలం పువ్వును సైకిల్ మీద ఉంచి వారం రోజుల పాటు పనిచేయాలని’ తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
సమస్యల్లో పరవాడ ‘మేజర్’
[ 07-05-2024]
పరవాడ మేజర్ పంచాయతీలో పలు సమస్యలు రాజ్యమేలుతున్నాయి. -
శిశువులపై జగన్ కర్కశత్వం
[ 07-05-2024]
జగన్ నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం అప్పుడే పుట్టిన శిశువు నుంచి పండు ముసలి వరకు ఎవరినీ విడిచిపెట్టకుండా కర్కశత్వాన్ని ప్రదర్శిస్తోంది. -
చీకట్లో పోలింగ్ కేంద్రాలు.. కనిపించని గుర్తులు
[ 07-05-2024]
ఎలమంచిలి నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు సౌకర్యాలు కరవయ్యాయి. -
పింఛన్ లబ్ధిదారులకు తీరని అవస్థలు
[ 07-05-2024]
పింఛన్ బట్వాడా విషయంలో ప్రభుత్వ తీరుతో పేదల కష్టాలు కొనసాగుతున్నాయి. -
మాజీ పోలీసు ఇంట్లో రూ.9.99 లక్షలు స్వాధీనం
[ 07-05-2024]
జీవీఎంసీ 95వ వార్డు పరిధిలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో అనుమానాస్పదంగా నిల్వ చేసిన నగదును సార్వత్రిక ఎన్నికల ఫ్లైయింగ్ సర్వేలైన్ టీం(ఎఫ్ఎస్టీ) స్వాధీనం చేసుకుంది. -
చందనోత్సవం భక్తులకు మెరుగైన సదుపాయాలు
[ 07-05-2024]
ఈనెల 10వ తేదీన సింహగిరిపై జరగనున్న చందనోత్సవం సందర్భంగా అప్పన్న స్వామి నిజరూప దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి కరికల్ వలవన్ సూచించారు. -
ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా
[ 07-05-2024]
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా అందజేస్తామని పెందుర్తి నియోజకవర్గం జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
-
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
-
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
-
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
-
నెల క్రితం ప్రమోషన్.. ఇప్పుడు లేఆఫ్.. టెస్లాలో భారత టెకీ ఆవేదన!
-
పవన్ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి