logo

జగన్‌ పాలనలో రాష్ట్రం అధోగతి

వైకాపా పాలనలో రాష్ట్రం అధోగతికి చేరుకుందని తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు గండిబాబ్జీ అన్నారు.

Published : 27 Apr 2024 04:02 IST

వైకాపా ప్రభుత్వంపై వెలువరించిన ఛార్జిషీట్‌ను విడుదల చేస్తున్న గండి బాబ్జీ, ఇతర నాయకులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: వైకాపా పాలనలో రాష్ట్రం అధోగతికి చేరుకుందని తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు గండిబాబ్జీ అన్నారు. శుక్రవారం సాయంత్రం తెదేపా కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌కు విశ్వసనీయత, నైతికత లేదన్నారు. ఆయన మోసాలపై తెదేపా నాయకత్వం ఛార్జిషీటు విడుదల చేసిందన్నారు. ఒక్క ఛాన్సు అంటూ అధికారంలోకి వచ్చి అరాచకాలను సృష్టించారని, రూ.13లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్ర ప్రజల నెత్తిన గుదిబండ మోపారన్నారు. మద్యం నిషేధించాకే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్‌ ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించడం లేదన్నారు. 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని, 25లక్షల ఇళ్లు నిర్మిస్తానని చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు. అన్ని రంగాల్లో విఫలమైన జగన్‌ను ఇంటి సాగనంపాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ ప్రణవగోపాల్‌, ఇతర నాయకులు శ్రీనివాస్‌, పొడుగు కుమార్‌, కేదారి లక్ష్మి, ఎర్నాగుల జగదీశ్వరరావు, రామురెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛార్జిషీటు పుస్తకాలను విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని