అనువుగాని ప్రాంగణం.. ఆడేందుకు అవస్థలు
క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయి. నేటి సమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు క్రీడలను జీవనశైలిలో భాగం చేసుకోవాలని వైద్యులు సైతం చెబుతున్నారు.
నియోజక వర్గానికి ఒక స్టేడియం నిర్మిస్తామని చేతులెత్తేసిన జగన్
పెందుర్తిలో తుప్పల మధ్యనున్న ఖాళీ స్థలంలో ఆడుతున్న యువత
పెందుర్తి, వేపగుంట, పరవాడ, న్యూస్టుడే: క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయి. నేటి సమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు క్రీడలను జీవనశైలిలో భాగం చేసుకోవాలని వైద్యులు సైతం చెబుతున్నారు. పెందుర్తి నియోజకవర్గంలో క్రీడా మైదానాలు లేకపోవడంతో ఇక్కడి యువత ప్రైవేట్ క్రీడా ప్రాంగణాలను ఆశ్రయించాల్సి వస్తోంది. 2018లో తెదేపా ప్రభుత్వం చినముషిడివాడ వుడాకాలనీలో ఇండోర్ స్టేడియం నిర్మించాలని ప్రతిపాదించింది. అనంతరం వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదన మూలకు చేరడంతో ఆ ప్రాంతమంతా డంపింగాయార్డులా మార్చారు. ఈ పరిసరాలు పందుల పెంపకానికి ఆవాసంగా మారాయి. యువత, బాలలు రోడ్లపైన, ఖాళీ స్థలాల్లో ఆటలాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆనందం ఆవిరి..
వైకాపా అధికారంలోకి రాగానే ప్రతీ నియోజకవర్గంలో ఒక క్రీడా ప్రాంగణం నిర్మిస్తామని జగన్ హామీ ఇచ్చారు. దీంతో క్రీడాకారులమంతా ఎంతో ఆనందించాం. ఐదేళ్లలైనా హామీ కార్యరూపం దాల్చలకపోవడంతో ఆనందమంతా ఆవిరైపోయింది. ఏ నియోజకవర్గంలోనూ క్రీడాకారులు ఆడుకునేందుకు సరైన సదుపాయాలు కల్పించలేదు. ఆడుదాం ఆంధ్రా పోటీలు సైతం ప్రైవేట్ కళాశాలల క్రీడా ప్రాంగణాల్లోనే నిర్వహించారు.
కోమటి పవన్, క్రీడాకారుడు
క్రికెట్ ఆడాలంటే నగరానికి వెళ్లాలి
క్రికెట్ ఆడాలంటే నగరంలోని మైదానాలకు వెళ్లాల్సి వస్తోంది. క్రికెట్ నేర్పించేందుకు ప్రైవేటు నెట్లు ఏర్పాటు చేసి భారీగా డబ్బులు గుంజుతున్నారు. పెందుర్తి పరిసర ప్రాంతాల్లో అనేక ఖాళీ ప్రదేశాలున్నాయి. ఆయా స్థలాల్లో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
త్రిపురాన ఆర్య
నడకకూ తిప్పలే..
పెందుర్తి పరిసర ప్రాంతాల్లో క్రీడా మైదానం లేకపోవడంతో ఉదయం, సాయంత్రం నడకకు వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందికరంగా ఉంది. బీఆర్టీఎస్ రహదారిలో వాకింగ్ చేయాల్సి వస్తోంది. వాహన కాలుష్యంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని రన్నింగ్ ట్రాక్ పూర్తిగా పాడైపోయింది.
జి.హరినాథ్
ఏ విద్యాలయంలో చూసినా..
విద్యార్థులు శారీరకంగా బలంగా ఉండాలని చెప్పే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆ దిశగా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన మాత్రం చేయడం లేదు. ఏ ప్రభుత్వ పాఠశాల, కళాశాలను చూసినా ఈ విషయం అర్థమవుతుంది. భవిష్యత్లోనైనా క్రీడా ప్రాంగణాలు నిర్మించి క్రీడాకారులకు అందుబాటులోకి వస్తాయని ఆశపడుతున్నాం.
మామిడి హరీష్, క్రీడాకారుడు
ప్రోత్సాహం అంతంతమాత్రమే..
గ్రామాల్లో ఎంతో మంది ప్రతిభ గల క్రీడాకారులు ఉన్నారు. వారికి ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం అందడం లేదు. క్రీడా పరికరాలు, మైదానాలు అందుబాటులో లేకపోవడంతో ఆటగాళ్లకు శిక్షణ కొరవడింది. నా ఇద్దరు కుమార్తెలు జాతీయ, రాష్ట్ర స్థాయి రన్నింగ్ పోటీల్లో రాణిస్తున్నారు. సాధన కోసం స్థానికంగా మైదానాలు లేకపోవడంతో ఉక్కునగరం వెళ్లిపోవాల్సి వచ్చింది.
కూండ్రపు చినసన్నిబాబు, నాయుడుపాలెం
శిక్షణ ఇప్పిస్తే..
పరవాడలో క్రికెట్ ఆడటానికి విశాలమైన మైదానం లేకపోవడంతో విద్యార్థులు, యువత ఇక్కట్లు పడుతున్నారు. చెరువులు ఎండిన తర్వాత తమ సొంత నిధులతో బాగు చేసుకుని సాధన చేస్తున్నారు. ఇండోర్ స్టేడియం ఉన్నా ప్రవేశ రుసుం చెల్లించాల్సి వస్తోంది. మైదానాలను అందుబాటులోకి తెచ్చి మంచి శిక్షణ ఇప్పిస్తే నాణ్యమైన క్రీడాకారులు తయారవుతారు.
కె.సోమునాయుడు, పరవాడ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రమోదీయం.. జనామోదం
[ 07-05-2024]
ప్రధాని మోదీ, తెదేపా అధినేత చంద్రబాబు కలయికతో ఉత్తరాంధ్ర పులకించింది. తాళ్లపాలెం వద్ద సోమవారం జరిగిన ప్రజాగళం సభకు అంచనాలకు మించి జనం తరలివచ్చారు. -
విత్తు ధర పెంచి చిత్తు చేశావు!
[ 07-05-2024]
కొందరు ప్రైవేటుగా విత్తనాలు కొనుగోలు చేస్తుంటారు. వారికి ఎలాంటి రాయితీ వర్తించదు. గరిష్ఠ చిల్లర ధరకే విత్తనాలు కొనుగోలు చేయాలి. వారిపై ధరల పెరుగుదల భారం మూడింతలు పడింది. -
జగన్ ఏలుబడిలో... అంగన్వాడీల అగచాట్లు
[ 07-05-2024]
అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏ వర్గాన్నీ విడిచిపెట్టకుండా చిత్రహింసలకు గురి చేసింది. ఇందులో అంగన్వాడీలు పడ్డ ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. -
ఉద్యోగులపై వైకాపా ప్రలోభాల వల
[ 07-05-2024]
ఈ ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లు కీలకం కానున్నాయి. దీంతో అధికార వైకాపా నాయకులు వారిని పెద్దఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నారు. -
వైకాపా హయాంలో..అన్నీ నేరాలే!
[ 07-05-2024]
వైకాపా హయాంలో విశాఖను గంజాయి హబ్గా మార్చారని విశాఖపట్నం కూటమి తెదేపా ఎంపీ అభ్యర్థి భరత్ విమర్శించారు. -
మూడు పార్టీల కూటమితోనే ఉత్తరాంధ్ర ప్రగతి
[ 07-05-2024]
‘యువత సైకిల్ ఎక్కాలి. భాజపా, తెదేపా, జనసేన జెండాలు కట్టుకోవాలి. ఒక చేత్తో గాజు గ్లాసు పట్టుకొని, కమలం పువ్వును సైకిల్ మీద ఉంచి వారం రోజుల పాటు పనిచేయాలని’ తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
సమస్యల్లో పరవాడ ‘మేజర్’
[ 07-05-2024]
పరవాడ మేజర్ పంచాయతీలో పలు సమస్యలు రాజ్యమేలుతున్నాయి. -
శిశువులపై జగన్ కర్కశత్వం
[ 07-05-2024]
జగన్ నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం అప్పుడే పుట్టిన శిశువు నుంచి పండు ముసలి వరకు ఎవరినీ విడిచిపెట్టకుండా కర్కశత్వాన్ని ప్రదర్శిస్తోంది. -
చీకట్లో పోలింగ్ కేంద్రాలు.. కనిపించని గుర్తులు
[ 07-05-2024]
ఎలమంచిలి నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు సౌకర్యాలు కరవయ్యాయి. -
పింఛన్ లబ్ధిదారులకు తీరని అవస్థలు
[ 07-05-2024]
పింఛన్ బట్వాడా విషయంలో ప్రభుత్వ తీరుతో పేదల కష్టాలు కొనసాగుతున్నాయి. -
మాజీ పోలీసు ఇంట్లో రూ.9.99 లక్షలు స్వాధీనం
[ 07-05-2024]
జీవీఎంసీ 95వ వార్డు పరిధిలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో అనుమానాస్పదంగా నిల్వ చేసిన నగదును సార్వత్రిక ఎన్నికల ఫ్లైయింగ్ సర్వేలైన్ టీం(ఎఫ్ఎస్టీ) స్వాధీనం చేసుకుంది. -
చందనోత్సవం భక్తులకు మెరుగైన సదుపాయాలు
[ 07-05-2024]
ఈనెల 10వ తేదీన సింహగిరిపై జరగనున్న చందనోత్సవం సందర్భంగా అప్పన్న స్వామి నిజరూప దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి కరికల్ వలవన్ సూచించారు. -
ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా
[ 07-05-2024]
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా అందజేస్తామని పెందుర్తి నియోజకవర్గం జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి