నాకేమీ చెప్పకపోతే ఎలా?
గత రెండు నెలలుగా అధికారులు తనకు ఏ సమాచారం ఇవ్వడం లేదని మున్సిపల్ ఛైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాలో మాకు సవాలక్ష సమస్యలు ఉంటాయి.
అధికారులపై ఛైర్పర్సన్ మండిపాటు
పరిహారంపై ఛైర్పర్సన్ ఆదిలక్ష్మికి లేఖ అందజేస్తున్న తెదేపా కౌన్సిలర్లు
నర్సీపట్నం, న్యూస్టుడే: గత రెండు నెలలుగా అధికారులు తనకు ఏ సమాచారం ఇవ్వడం లేదని మున్సిపల్ ఛైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాలో మాకు సవాలక్ష సమస్యలు ఉంటాయి. మీరు ఎప్పటికప్పుడు అన్ని విషయాలు చెప్పాలి కదా! ఇళ్ల పన్నుల జీవోపై ఇప్పటివరకు చెప్పలేదు. అత్యవసర మున్సిపల్ సమావేశం అజెండా మంగళవారం సాయంత్రం ఇవ్వడం ఏమిటి ముందుగా ఇవ్వాలి కదా?’ అని మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. రహదారి విస్తరణపై బుధవారం ఆమె అధ్యక్షతన సమావేశం జరిగింది. వంద అడుగుల మేర విస్తరించనున్న ప్రధాన రహదారిపై తయారు చేసిన అజెండాను చదివి వినిపించారు. దీనిపై జనం నుంచి వచ్చిన సలహా సూచనలు వాటికి సమాధానాలను వివరించారు. తెదేపా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పనులకు తెదేపా కౌన్సిలర్లంతా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు.
తెదేపా, వైకాపా కౌన్సిలర్ల వాగ్వాదం
నష్ట పరిహారంగా టీడీఆర్ బాండ్లకు బదులు నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. చట్ట పరిధిలో దీనికి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీనిపై కమిషనర్ కనకారావు మాట్లాడుతూ నిబంధనల ప్రకారం మాస్టర్ ప్లాన్కు లోబడి వంద అడుగుల విస్తరణ కొనసాగుతుందన్నారు. నగదు చెల్లింపునకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదన్నారు. దీంతో భవనాల యజమానులు నష్టపోతారని, బాండ్లు ఎందుకూ పనికిరావని తెదేపా కౌన్సిలర్లు మధు, శ్రీకాంత్ తదితరులు వాదించారు. దీనిపై వైకాపా సభ్యులు రామకృష్ణ, అప్పలనాయుడు, చినబాబు, నాని, బుల్లిదొరలు టీడీఆర్ విధానమే అమల్లో ఉందంటూ సమాధానం చెప్పడంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఛైర్పర్సన్ ఇరువర్గాలనూ సముదాయించడంతో పరిస్థితి సద్దుమణిగింది. తెదేపా సభ్యులంతా దీనిపై కమిషనర్, ఛైర్పర్సన్లకు లేఖలు అందజేశారు. జనసేన కౌన్సిలర్ అద్దెపల్లి సౌజన్య సైతం నగదు రూపంలోనే పరిహారం చెల్లించాలని కోరారు. మున్సిపాలిటీలో మహా శివరాత్రికి రూ.10 లక్షల సొమ్ము ఖర్చు చూపడం ఎంత వరకు సబబు అని ఆమె ప్రశ్నించారు. 20వ వార్డు తెదేపా కౌన్సిలర్ రామరాజు పలు సమస్యలతో ఉన్న బ్యానర్ను తెచ్చి నిరసన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా గగ్గోలు పెడుతున్నా ఒక సమస్య పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయంలో సమావేశం కొనసాగుతుండగా బయట రోడ్డు విస్తరణ బాధితుల పేరిట వర్తకులు కొందరు ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లతో ఉన్న ప్లకార్డులను సంప్రదించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమితోనే అన్ని వర్గాలకు న్యాయం
[ 27-04-2024]
ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి చివరికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారని పెందుర్తి తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు ధ్వజమెత్తారు. -
కూటమితోనే బంగారు భవిష్యత్తు
[ 27-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బంగారు భవిష్యత్తు సాధ్యమని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. -
అనుమానం పెనుభూతమై..
[ 27-04-2024]
కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబంలో అనుమానపు బీజం పడింది. -
వైకాపా నాయకులు దోచుకున్న నగదే పంచి పెడుతున్నారు
[ 27-04-2024]
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైకాపా నాయకులు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని, దాన్ని ప్రజలు తిప్పికొట్టాలని భాజపా (కూటమి) అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు అన్నారు. -
జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి
[ 27-04-2024]
వైకాపా పాలనలో రాష్ట్రం అధోగతికి చేరుకుందని తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు గండిబాబ్జీ అన్నారు. -
ఎంవీవీ నామపత్రం ఆమోదంలో ఉత్కంఠ
[ 27-04-2024]
విశాఖ తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ నామపత్రం ఆమోదించే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
సుప్రభాత సేవ టికెట్ల పునః ప్రారంభం
[ 27-04-2024]
శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని రద్దు చేసిన సుప్రభాత సేవ, ఉదయం, సాయంత్రం ఆరాధన సేవల టికెట్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. -
డీఎల్ఈడీలో ప్రవేశాలకు ఆహ్వానం
[ 27-04-2024]
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ)లో ప్రవేశాల కోసం మే 8వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్