logo

దువ్వాడ, విశాఖ మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు

వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తూర్పు కోస్తా రైల్వే పలు ప్రత్యేక రైళ్లు నడపనుందని వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.

Updated : 13 Apr 2024 08:40 IST

రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే: వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తూర్పు కోస్తా రైల్వే పలు ప్రత్యేక రైళ్లు నడపనుందని వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. విశాఖ-కొల్లాం(08539) ప్రత్యేక రైలు ఈ నెల 17 నుంచి జులై 3 వరకు ప్రతి బుధవారం ఉదయం 8.20 గంటలకు విశాఖలో బయలుదేరుతుంది. కొల్లాం-విశాఖ(08540) ప్రత్యేక రైలు ఈ నెల 18 నుంచి జులై 4 వరకు ప్రతి గురువారం రాత్రి 7.35 గంటలకు కొల్లాంలో బయలుదేరి మర్నాడు రాత్రి 11.20 గంటలకు విశాఖ వస్తుంది.

  • భువనేశ్వర్‌-యలహంక(02811) ప్రత్యేక రైలు ఈ నెల 13 నుంచి మే 25 వరకు ప్రతి శనివారం సాయంత్రం 7.15 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి అర్ధరాత్రి దాటిన తరువాత 1.53 గంటలకు దువ్వాడ వచ్చి.. 1.55 గంటలకు వెళుతుంది. భువనేశ్వర్‌- యలహంక(02812) ప్రత్యేక రైలు ఈ నెల 15 నుంచి మే 27 వరకు ప్రతి సోమవారం ఉదయం 5 గంటలకు యలహంకలో బయలు దేరి మర్నాడు తెల్లవారుజామున 4.30 గంటలకు దువ్వాడ వచ్చి.. 4.32 గంటలకు వెళుతుంది.
  • హావ్‌డా-యశ్వంత్‌పూర్‌(02863) ప్రత్యేక ఏసీ రైలు ఈ నెల 18 నుంచి జూన్‌ 27 వరకు ప్రతి గురువారం మధ్యాహ్నం 12.40 గంటలకు హావ్‌డాలో బయలుదేరి మర్నాడు తెల్లవారుజామున 2.43 గంటలకు దువ్వాడ వచ్చి.. 2.45 గంటలకు వెళుతుంది. యశ్వంత్‌పూర్‌- హావ్‌డా (02864) రైలు ఈ నెల 20 నుంచి 29 వరకు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి రాత్రి 11.05 గంటలకు దువ్వాడ వచ్చి.. 11.07 గంటలకు వెళుతుంది.
  • కొచ్చివెల్లి-షాలిమార్‌(06081) ప్రత్యేక రైలు మే 31 వరకు ప్రతి శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు కొచ్చివెల్లిలో బయలు దేరి మర్నాడు రాత్రి 10.50 గంటలకు దువ్వాడ వచ్చి.. 10.52 గంటలకు వెళుతుంది. షాలిమార్‌- కొచ్చివెల్లి(06082) రైలు ఈ నెల 15 నుంచి జూన్‌ 6 వరకు ప్రతి సోమవారం మధ్యాహ్నం 2.20 గంటలకు షాలిమార్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 4.18 గంటలకు దువ్వాడ వచ్చి.. 4.20 గంటలకు వెళుతుంది.
  • న్యూటిన్‌ సుఖియా-ఎస్‌ఎంవీ బెంగళూరు(05952) రైలు మే 2 నుంచి జూన్‌ 27 వరకు ప్రతి గురువారం సాయంత్రం 6.45 గంటలకు న్యూటిన్‌ సుఖియాలో బయలుదేరి మూడో రోజు మధ్యాహ్నం 1.50 గంటలకు విశాఖ వచ్చి.. 2.10 గంటలకు వెళుతుంది.
  • ఎస్‌ఎంవీ బెంగళూరు- న్యూటిన్‌ సుఖియా(05951) రైలు మే 6 నుంచి జులై 1 వరకు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటలకు ఎస్‌ఎంవీ బెంగుళూరులో బయలుదేరి తర్వాత రోజు రాత్రి 9.40 గంటలకు విశాఖ వచ్చి.. 10 గంటలకు వెళుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని