అదీ.. నాయకత్వం!!
విశాఖకు ‘హుద్హుద్’ తుపాను చేసిన గాయం చరిత్రలో మరచిపోలేనిది. 2014 అక్టోబరులో విరుచుకుపడిన ఆ ఉపద్రవం ఇప్పటికీ కళ్లముందే కదులుతుంది.
హుద్హుద్కు చిగురుటాకులా వణికిన విశాఖ
2014లో కకావికలమైన నగరం, భారీగా ఆస్తి నష్టం
నేనున్నానంటూ వేగంగా చేరుకున్న చంద్రబాబు
ఇక్కడే బస చేసి పునరుద్ధరణ పనుల పర్యవేక్షణ
కొద్ది రోజుల్లోనే కోలుకున్న విశాఖ
నాడు.. ప్రజలతో మాట్లాడుతున్న చంద్రబాబు
ఈనాడు, విశాఖపట్నం, న్యూస్టుడే కంచరపాలెం, గోపాలపట్నం: విశాఖకు ‘హుద్హుద్’ తుపాను చేసిన గాయం చరిత్రలో మరచిపోలేనిది. 2014 అక్టోబరులో విరుచుకుపడిన ఆ ఉపద్రవం ఇప్పటికీ కళ్లముందే కదులుతుంది. తుపాను పేరెత్తితో వెంటనే గుర్తుకు వచ్చే హుద్హుద్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రచండ గాలులు..కుండపోత వర్షంతో విద్యుత్తు, సమాచార వ్యవస్థలు నిమిషాల్లో కుప్పకూలాయి. భారీ వృక్షాలు కూకటి వేళ్లతో కూలిపోయాయి. బీచ్ రోడ్డు కొట్టుకుపోయింది. బాహ్యప్రపంచంతో విశాఖకు సంబంధాలు తెగిపోయాయి. వేల నివాసాలు నేలమట్టం అయ్యాయి. ఆ ప్రళయ ఉద్ధృతికి ప్రతి ఒక్కరూ వణికిపోయారు.
భరోసా కల్పిస్తూ: విశాఖ తిరిగి సాధారణ స్థితికి వచ్చేందుకు చంద్రబాబు కంటిమీద కునుకులేకుండా పనిచేశారు. అధికారులు, యంత్రాంగం సైతం ఆయనతో పరుగులు తీసి పనులు చేశారు. నెల రోజులకైనా విద్యుత్తు సరఫరా మెరుగుపడుతుందో లేదో అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ అయిదు రోజుల్లోనే నగరంలోని 70 శాతం ప్రాంతాల్లో విద్యుత్తు వ్యవస్థను పునరుద్ధరించారు. నిత్యావసరాలు ప్రతి కుటుంబానికి అందేలా చూశారు. విమానాశ్రయాన్ని వాయువేగంతో పునరుద్ధరించారు. దెబ్బతిన్న కైలాసగిరిపై పచ్చదనం నింపే చర్యలు తీసుకున్నారు.
పునరుద్ధరణ చర్యలు పూర్తైన తరువాత ప్రజలతో కలిసి కాగడాల ర్యాలీలో..
తుపాను తీవ్రతను ప్రధాని మోదీకి వివరిస్తున్న చంద్రబాబు
జనజీవనం అల్లకల్లోలమైన ఆ పరిస్థితుల్లో నేనున్నానంటూ కొన్ని గంటల వ్యవధిలోనే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు హుటాహుటిన విశాఖకు చేరుకున్నారు. ప్రతిక్షణం పర్యవేక్షించారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నాకే తిరిగి వెళ్లారు.
అదీ నాయకత్వం అంటే.. అదీ సమర్థతంటే.. అదీ పరిపాలన దక్షతంటే అని ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. అలా నడిపించే నేతలకు, విశాఖను అభివృద్ధి శిఖరానికి తీసుకువెళ్లే వారికే మళ్లీ ఎన్నికల్లో పట్టం కట్టాలంటూ పలువురు పేర్కొంటున్నారు.
విద్యుత్తు వ్యవస్థ పునరుద్ధరణపై చర్చిస్తూ..
- హుద్హుద్ విలయానికి నగరం నామరూపాల్లేకుండా పోయింది. అంతటా అంధకారం అలముకుంది. నాడు.. 2014 అక్టోబర్ 12వ తేదీ రాత్రికే హైదరాబాద్ నుంచి బయలుదేరిన చంద్రబాబు ఆకాశమార్గాన రావడానికి అవకాశం లేక రాజమహేంద్రవరం వరకు వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గాన రావాలని చూశారు.
- ఆ రోజు రాత్రి పరిస్థితులు అనుకూలించక 13వ తేదీ ఉదయం అక్కడి నుంచి బయలుదేరారు. ప్రతి ప్రాంతంలో పర్యటించారు. కలెక్టరేటు వద్ద బస్సులోనే బస చేసి రాత్రింబవళ్లు సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇంటింటికీ తిరిగి బాధితులను పరామర్శించారు. సహాయక, పునరావాస చర్యలను దగ్గరుండి వేగవంతం చేశారు. రోజుకు 18 గంటల పాటు ప్రజలతోనే ఉన్నారు. ఒడిశా, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి సత్వర సాయం అందేలా చేశారు. ప్రధాని మోదీ సైతం ఇక్కడి పునరుద్ధరణచర్యలు, చంద్రబాబు చొరవను ప్రశంసించారు.
- వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం కావడంతో నిత్యావసరాలకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఓ వైపు పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు నిత్యావసరాలను అందించే బాధ్యత అంతే వేగంగా చేపట్టారు. తక్కువ ధరకు పాలు, కూరగాయలు, ఉల్లిపాయలు వంటివి అందజేశారు. ఇంటింటికీ నిత్యావసరాలు అందేలాచంద్రబాబు ప్రణాళిక చేశారు.
- విశాఖ నగరం అంటే హుద్హుద్కు ముందు..హుద్హుద్కు తర్వాత అన్న చందంగా మారిపోయింది. దీంతో విశాఖ నగర ప్రణాళిక కొత్త తరహాను సంతరించుకుంది. ప్రపంచ బ్యాంకు నిధులు అందిపుచ్చుకొని కొన్ని పనులకు శ్రీకారం చుట్టారు. భూగర్భ విద్యుత్తు కేబుల్ వ్యవస్థకు నాంది పలికారు. పచ్చదనం, అడవుల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నగరంలోని అన్ని రహదారులను భారీగా విస్తరించి అభివృద్ధి చేశారు.
వైకాపా హయాంలో..
రెండేళ్ల కిందట భారీ వర్షాలకు నగరంలో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఆ సమయంలో ఆదుకునేందుకు యంత్రాంగం చేసిన జాప్యంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. వైకాపా నేతలు సైతం చొరవ చూపలేదు. పునరావాస కేంద్రాల పేరిట సొమ్ములు నొక్కేసి అక్రమాలకు పాల్పడిన ఘటనలూ బయట పడ్డాయి. ఇదీ..వైకాపా పాలకుల తీరని జనం మండిపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నమోదును మించి.. పోలింగుకు పోటెత్తి
[ 18-05-2024]
సార్వత్రిక సమరంలో గతానికి భిన్నంగా ఈసారి ఓటర్లు పోటెత్తారు. ఎప్పుడూ పోలింగ్ బూత్ మొహం ఎరగని వారు కూడా ఈసారి ఓటెత్తారు. ఫలితంగానే రికార్డు స్థాయిలో 83.94 శాతం పోలింగ్ జరిగింది. -
ఓట్ల వేళ.. ఓటి పనులు!!
[ 18-05-2024]
ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రభావితం చేసేందుకు వైకాపా ప్రభుత్వం అభివృద్ధి పనుల పేరిట గాలం వేసింది. నాలుగేళ్లుగా పట్టించుకోకుండా ఎన్నికల వేళ హడావుడి అధికార పాలకవర్గం జీవీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. -
వైకాపా గూండాలకు రోజులు ముగిశాయి
[ 18-05-2024]
వైకాపా గూండాలకు రోజులు ముగిశాయని ఉత్తర నియోజకవర్గం భాజపా (కూటమి) ఎమ్మెల్యే అభ్యర్థి పి.విష్ణుకుమార్ రాజు హెచ్చరించారు. బర్మాక్యాంపు ప్రాంతంలో ఓ కుటుంబంపై దాడి ఘటనపై శుక్రవారం సీతమ్మధారలోని పార్టీ కార్యాలయంలో బాధితులతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
5,56,819 మంది పోలింగ్కు దూరం
[ 18-05-2024]
విశాఖ పార్లమెంట్ పరిధిలో 2019తో పోలిస్తే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. కానీ అయిదేళ్లకోసారి వచ్చే అవకాశాన్ని 5 లక్షలకు పైగా ఓటర్లు జారవిడుచుకున్నారు. సమర్థులైన నాయకులను ఎన్నుకునేందుకు ఓటు అనే వజ్రాయుధాన్ని వినియోగించుకోలేదు. -
కోడికత్తి కేసు వాయిదా
[ 18-05-2024]
కోడికత్తి కేసు విశాఖలోని ప్రత్యేక న్యాయస్థానంలో శుక్రవారం విచారణకు వచ్చింది. నిందితుడు శ్రీనివాసరావు కోర్టుకు హాజరయ్యారు. -
వేసవి క్రీడా శిబిరాలు ఉన్నట్టా.. లేనట్టా..!
[ 18-05-2024]
పాఠశాల స్థాయి విద్యార్థులకు వేసవి క్రీడా శిబిరాల నిర్వహణపై ఈ ఏడాది మహా విశాఖ నగరపాలక సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు. అసలు శిబిరాలు ఉంటాయా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. -
నేడు నిర్మాల్య చందనం విక్రయాలకు విరామం
[ 18-05-2024]
సింహాద్రి అప్పన్న స్వామి నిర్మాల్య చందనం విక్రయానికి శనివారం విరామం ఇస్తున్నట్లు దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు. -
దాడి పూర్వాపరాలపై డీసీపీ ఆరా
[ 18-05-2024]
తెదేపాకు ఓటు వేయలేదన్న కక్షతో కంచరపాలెం బర్మాక్యాంప్లో నూకాంబిక ఆలయం వద్ద గురువారం ఒక కుటుంబంపై జరిగిన దాడి కేసుకు సంబంధించి రాజకీయ ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం డీసీపీ-2 ఎం.సత్తిబాబు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. -
వేడి నీటిలోకి జారిపడ్డ ఉక్కు కార్మికుడు
[ 18-05-2024]
విశాఖ ఉక్కు కర్మాగారంలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఒప్పంద కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్టీల్ప్లాంట్ పోలీసులు, తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం... కర్మాగారంలోని కోకోవెన్ బ్యాటరీ-3లో సెమీ స్కిల్డ్ వర్కర్గా పని చేస్తున్న జె.సాంబయ్య (55) ఉదయం జనరల్ షిఫ్ట్కు వెళ్లాడు. -
వైజాగ్ కన్వెన్షన్లో మెగా కన్జ్యూమర్ ఎక్స్పో
[ 18-05-2024]
పీఎంపాలెం వైజాగ్ కన్వెన్షన్లో ఇండియా ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ ఫెయిర్(ఐఐసీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ మెగా కన్జ్యూమర్ ఎక్స్పో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈనెల 20వ తేదీ వరకు జరగనున్న ఈ ప్రదర్శనలో ఇంటీరియర్, ఫర్నీచర్, దుస్తులు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ తదితర వందకు పైగా స్టాళ్ల ద్వారా విక్రయిస్తున్నారు. -
ప్రిన్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా తన్వి రిషిక
[ 18-05-2024]
ఇటీవల కేరళలో జరిగిన జూనియర్ మోడల్స్ ఇంటర్నేషనల్ కార్యక్రమంలో ప్రిన్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విన్నర్గా నిలిచిన నగరానికి చెందిన తన్వి రిషికను విశాఖ పౌరగ్రంథాలయంలో శుక్రవారం ఘనంగా సత్కరించారు. -
అమ్మవారి పండగపై పోలీసుల ఆంక్షలు
[ 18-05-2024]
కొమరవోలు గ్రామదేవత అయిన కొమరవోలు తల్లి పండగ ఈసారి పోలీసు ఆంక్షలతో సాదాసీదాగా సాగింది. ఈ పండగ మూడేళ్లకోసారి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుంటారు. -
పాడేరు మోదకొండమ్మ జాతర 9 నుంచి
[ 18-05-2024]
ఈ నెల 19, 20, 21 తేదీల్లో జరగాల్సిన మోదకొండమ్మ అమ్మవారి మహోత్సవాలు వాయిదా పడ్డాయి. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. -
నాలుగు రోజులు చిరుజల్లులు
[ 18-05-2024]
జిల్లాలో మరో నాలుగు రోజులు చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు తెలిపారు. శుక్రవారం వాతావరణ అధారిత సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. -
వాహన లైటింగ్తో వేగాన్ని తేల్చేలా..
[ 18-05-2024]
టెలి కమ్యూనికేషన్ డే సందర్భంగా అనకాపల్లిలోని డైట్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు నూతన టెక్నాలజీ లైఫై ప్రాజెక్టును రూపొందించారు. కాంతి మార్గం ద్వారా మనం అందించే సిగ్నల్స్ రిసీవ్ చేసుకునేలా దీన్ని తయారుచేశారు. -
అక్రమార్కులకు అధికార పార్టీ అండ
[ 18-05-2024]
చీడికాడ మండలంలో గ్రావెల్ అక్రమ తరలింపు పెద్దఎత్తున జరుగుతోంది. అక్రమార్కులకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
-
కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి
-
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
-
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!