ఉద్యోగులపై వైకాపా ప్రలోభాల వల
ఈ ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లు కీలకం కానున్నాయి. దీంతో అధికార వైకాపా నాయకులు వారిని పెద్దఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నారు.
పోస్టల్ బ్యాలట్లకు తాయిలాల ఎర
పోలింగ్ కేంద్రం బయటే బేరసారాలు
ఏయూ రోడ్డులోని బస్స్టాప్ వద్ద ప్రలోభాలు
వన్టౌన్, న్యూస్టుడే: ఈ ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లు కీలకం కానున్నాయి. దీంతో అధికార వైకాపా నాయకులు వారిని పెద్దఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నారు. వరుసగా రెండో రోజు ఓట్ల కొనుగోలుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఉద్యోగుల ఇళ్లకే వెళ్లి కొంత మంది బేరసారాలు పెడితే.. పోలింగ్ కేంద్రం ఆవల మరి కొందరు బేరాలకు దిగారు. ఏయూ ఆంగ్ల, తెలుగు మాధ్యమ పాఠశాల ఆవరణలో ఆదివారం నుంచి పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ ఆరంభమైంది. రెండో రోజు సోమవారం భారీ సంఖ్యలో ఓటు వేసేందుకు ఉద్యోగులు తరలివచ్చారు. సాయంత్రం 6గంటల వరకు ప్రక్రియ కొనసాగింది. సాయంత్రం 5గంటల సమయానికి మిగిలి ఉన్న వారికి టోకెన్లు అందజేసి ఓటింగ్ కొనసాగించారు. మంగళ, బుధవారాల్లో కూడా పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ కొనసాగనున్నది.
ఒక్కో ఓటుకు రూ.2500 వరకు..
వైకాపా ప్రభుత్వానికి ఉద్యోగులు వ్యతిరేకంగా ఉండడం ఆ పార్టీ నాయకులను కలవరపరుస్తోంది. ఎలాగైనా వారి ఓట్లను పొందడానికి పెద్దఎత్తున ప్రలోభాలకు తెర తీశారు. ఉత్తరం, తూర్పు, దక్షిణం, గాజువాక, పశ్చిమ, భీమిలి నియోజకవర్గాలకు చెందిన నాయకులు ఏయూ అవుట్ గేట్ బయట మోహరించారు. ఉద్యోగులతో అక్కడికక్కడే బేరసారాలు సాగించారు. ఓటుకు రూ.1500 నుంచి రూ.2500 వరకు ముట్టజెప్పడానికి సిద్ధమయ్యారు. అయితే అధిక శాతం తాయిలాలు తీసుకోవడానికి నిరాకరించారు. డబ్బులు తీసుకున్న వారి పేర్లు, ఫోన్ నెంబరు, ఇతర వివరాలను నాయకులు నమోదు చేసుకున్నారు. అధికార పార్టీ ఎత్తుగడలను పసిగట్టిన తెదేపా నాయకులు అక్కడికి చేరుకుని ప్రలోభాలకు లొంగవద్దని ఉద్యోగులకు మేలు చేసే వారికే ఓటేయాలని కోరారు. ఏయూ అవుట్గేట్ వద్ద ఆదివారం వైకాపా నాయకులు ప్రచార వాహనాలతో హడావుడి చేయగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేయడంతో సోమవారం కనిపించలేదు.
ఓటు కోసం వెతుకులాట
పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న పలువురు ఉద్యోగులకు ఓటు లేదని హెల్ప్డెస్క్ సిబ్బంది చెప్పడంతో ఆందోళన చెందారు. వెంటనే పోలింగ్ అధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పలుమార్లు దరఖాస్తు చేసినా ఓటరు జాబితాలో తమ పేర్లు లేవని ఆందోళనకు దిగారు. వారికి అధికారులు సర్దిచెప్పి మళ్లీ దరఖాస్తులు తీసుకున్నారు. ఎక్కువగా సచివాలయ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇటువంటి పరిస్థితి ఎదురైంది వీరికి ఈనెల 8న ఓటు హక్కు కల్పించనున్నారు. ఏయూ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ ఏడీసీ కేఎస్ విశ్వనాథన్, జేసీ మయూర్ అశోక్, తదితరులు సందర్శించారు.
ఓట్ల వివరాలను తెలుసుకుంటూ.
మందకొడిగా పోలింగ్ ప్రక్రియ
సోమవారం మండుటెండను సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ఉద్యోగులు తరలివచ్చారు. షామియానాలు ఏర్పాటు చేసినప్పటికీ ఉక్కబోతకు తాళలేక ఉక్కిరిబిక్కిరయ్యారు. దీంతో పోలింగ్ మందకొడిగా సాగింది. ఓటు వేయడానికి నాలుగైదు నిమిషాల సమయం పట్టింది. దీంతో ఉద్యోగులు బారులు తీరి నిలబడ్డారు. కుర్చీలు, బల్లలు ఏర్పాటు చేసినప్పటికీ సరిపోకపోవడంతో పలువురు అధిక సమయం నిరీక్షించి నీరసించిపోయారు.
ఓటేయడానికి నిరీక్షణ
ఓటు హక్కు వినియోగం ఇలా..
పీఓ, ఏపీఓ, ఓపీఓ, పోలీసు, ఇతర ఉద్యోగులు: 13,076
ఆది, సోమవారాల్లో ఓటేసిన వారు: 8,974 (68.62శాతం)
ఇతర జిల్లాల ఉద్యోగులు: 5,389
ఆది, సోమవారాల్లో ఓటేసిన వారు: 3,044 (56.48శాతం)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనా సైబర్ ముఠా చేతిలో ఏపీ వాసులు.. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల మోసం
[ 18-05-2024]
విదేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలని చెప్పి.. చైనా ముఠాలకు నిరుద్యోగులను విక్రయిస్తున్న ఏజెంట్లు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. -
నమోదును మించి.. పోలింగుకు పోటెత్తి
[ 18-05-2024]
సార్వత్రిక సమరంలో గతానికి భిన్నంగా ఈసారి ఓటర్లు పోటెత్తారు. ఎప్పుడూ పోలింగ్ బూత్ మొహం ఎరగని వారు కూడా ఈసారి ఓటెత్తారు. ఫలితంగానే రికార్డు స్థాయిలో 83.94 శాతం పోలింగ్ జరిగింది. -
ఓట్ల వేళ.. ఓటి పనులు!!
[ 18-05-2024]
ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రభావితం చేసేందుకు వైకాపా ప్రభుత్వం అభివృద్ధి పనుల పేరిట గాలం వేసింది. నాలుగేళ్లుగా పట్టించుకోకుండా ఎన్నికల వేళ హడావుడి అధికార పాలకవర్గం జీవీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. -
వైకాపా గూండాలకు రోజులు ముగిశాయి
[ 18-05-2024]
వైకాపా గూండాలకు రోజులు ముగిశాయని ఉత్తర నియోజకవర్గం భాజపా (కూటమి) ఎమ్మెల్యే అభ్యర్థి పి.విష్ణుకుమార్ రాజు హెచ్చరించారు. బర్మాక్యాంపు ప్రాంతంలో ఓ కుటుంబంపై దాడి ఘటనపై శుక్రవారం సీతమ్మధారలోని పార్టీ కార్యాలయంలో బాధితులతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
5,56,819 మంది పోలింగ్కు దూరం
[ 18-05-2024]
విశాఖ పార్లమెంట్ పరిధిలో 2019తో పోలిస్తే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. కానీ అయిదేళ్లకోసారి వచ్చే అవకాశాన్ని 5 లక్షలకు పైగా ఓటర్లు జారవిడుచుకున్నారు. సమర్థులైన నాయకులను ఎన్నుకునేందుకు ఓటు అనే వజ్రాయుధాన్ని వినియోగించుకోలేదు. -
కోడికత్తి కేసు వాయిదా
[ 18-05-2024]
కోడికత్తి కేసు విశాఖలోని ప్రత్యేక న్యాయస్థానంలో శుక్రవారం విచారణకు వచ్చింది. నిందితుడు శ్రీనివాసరావు కోర్టుకు హాజరయ్యారు. -
వేసవి క్రీడా శిబిరాలు ఉన్నట్టా.. లేనట్టా..!
[ 18-05-2024]
పాఠశాల స్థాయి విద్యార్థులకు వేసవి క్రీడా శిబిరాల నిర్వహణపై ఈ ఏడాది మహా విశాఖ నగరపాలక సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు. అసలు శిబిరాలు ఉంటాయా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. -
నేడు నిర్మాల్య చందనం విక్రయాలకు విరామం
[ 18-05-2024]
సింహాద్రి అప్పన్న స్వామి నిర్మాల్య చందనం విక్రయానికి శనివారం విరామం ఇస్తున్నట్లు దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు. -
దాడి పూర్వాపరాలపై డీసీపీ ఆరా
[ 18-05-2024]
తెదేపాకు ఓటు వేయలేదన్న కక్షతో కంచరపాలెం బర్మాక్యాంప్లో నూకాంబిక ఆలయం వద్ద గురువారం ఒక కుటుంబంపై జరిగిన దాడి కేసుకు సంబంధించి రాజకీయ ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం డీసీపీ-2 ఎం.సత్తిబాబు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. -
వేడి నీటిలోకి జారిపడ్డ ఉక్కు కార్మికుడు
[ 18-05-2024]
విశాఖ ఉక్కు కర్మాగారంలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఒప్పంద కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్టీల్ప్లాంట్ పోలీసులు, తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం... కర్మాగారంలోని కోకోవెన్ బ్యాటరీ-3లో సెమీ స్కిల్డ్ వర్కర్గా పని చేస్తున్న జె.సాంబయ్య (55) ఉదయం జనరల్ షిఫ్ట్కు వెళ్లాడు. -
వైజాగ్ కన్వెన్షన్లో మెగా కన్జ్యూమర్ ఎక్స్పో
[ 18-05-2024]
పీఎంపాలెం వైజాగ్ కన్వెన్షన్లో ఇండియా ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ ఫెయిర్(ఐఐసీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ మెగా కన్జ్యూమర్ ఎక్స్పో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈనెల 20వ తేదీ వరకు జరగనున్న ఈ ప్రదర్శనలో ఇంటీరియర్, ఫర్నీచర్, దుస్తులు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ తదితర వందకు పైగా స్టాళ్ల ద్వారా విక్రయిస్తున్నారు. -
ప్రిన్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా తన్వి రిషిక
[ 18-05-2024]
ఇటీవల కేరళలో జరిగిన జూనియర్ మోడల్స్ ఇంటర్నేషనల్ కార్యక్రమంలో ప్రిన్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విన్నర్గా నిలిచిన నగరానికి చెందిన తన్వి రిషికను విశాఖ పౌరగ్రంథాలయంలో శుక్రవారం ఘనంగా సత్కరించారు. -
అమ్మవారి పండగపై పోలీసుల ఆంక్షలు
[ 18-05-2024]
కొమరవోలు గ్రామదేవత అయిన కొమరవోలు తల్లి పండగ ఈసారి పోలీసు ఆంక్షలతో సాదాసీదాగా సాగింది. ఈ పండగ మూడేళ్లకోసారి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుంటారు. -
పాడేరు మోదకొండమ్మ జాతర 9 నుంచి
[ 18-05-2024]
ఈ నెల 19, 20, 21 తేదీల్లో జరగాల్సిన మోదకొండమ్మ అమ్మవారి మహోత్సవాలు వాయిదా పడ్డాయి. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. -
నాలుగు రోజులు చిరుజల్లులు
[ 18-05-2024]
జిల్లాలో మరో నాలుగు రోజులు చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు తెలిపారు. శుక్రవారం వాతావరణ అధారిత సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. -
వాహన లైటింగ్తో వేగాన్ని తేల్చేలా..
[ 18-05-2024]
టెలి కమ్యూనికేషన్ డే సందర్భంగా అనకాపల్లిలోని డైట్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు నూతన టెక్నాలజీ లైఫై ప్రాజెక్టును రూపొందించారు. కాంతి మార్గం ద్వారా మనం అందించే సిగ్నల్స్ రిసీవ్ చేసుకునేలా దీన్ని తయారుచేశారు. -
అక్రమార్కులకు అధికార పార్టీ అండ
[ 18-05-2024]
చీడికాడ మండలంలో గ్రావెల్ అక్రమ తరలింపు పెద్దఎత్తున జరుగుతోంది. అక్రమార్కులకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం
-
చైనా సైబర్ ముఠా చేతిలో ఏపీ వాసులు.. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల మోసం
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?