logo

ఆ అమ్మకు.. ఆఖరి క్షణంలోనూ కష్టమే

ఆ మాతృమూర్తి మరో నెలలో పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఇంతలో ఆయాసం తల్లిని, కడుపులో ఉన్న బిడ్డను మింగేసింది. ఆఖరికి మృతదేహం తరలింపులోనూ ప్రకృతి అడ్డుతగిలింది. మెంటాడ మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన గర్భిణి జెర్రి ఈశ్వరమ్మ(22)కు

Published : 05 Dec 2021 05:17 IST

నదిలో నుంచి తీసుకొస్తున్న గ్రామస్థులు (అంతర చిత్రంలో ఈశ్వరమ్మ)

మెంటాడ, న్యూస్‌టుడే: ఆ మాతృమూర్తి మరో నెలలో పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఇంతలో ఆయాసం తల్లిని, కడుపులో ఉన్న బిడ్డను మింగేసింది. ఆఖరికి మృతదేహం తరలింపులోనూ ప్రకృతి అడ్డుతగిలింది. మెంటాడ మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన గర్భిణి జెర్రి ఈశ్వరమ్మ(22)కు శుక్రవారం రాత్రి ఆయాసం రావడంతో విశాఖ తరలించారు. ఆసుపత్రిలో చేర్చే సమయంలో మృతి చెందింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చే క్రమంలో చంపావతిపై వంతెన లేక మోకాలి లోతు నీటిలో మంచంపై ఉంచి తరలించారు.ఈశ్వరమ్మ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని